టిఎస్ పాలిటిక్స్‌లో గందరగోళం: 10 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపులపై సుప్రీం కోర్టు మొట్టికాయలు – కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపీలకు తలకాయ నొప్పులే!

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం నిశ్శబ్దం కన్నా అకస్మాత్తుగా పెను చర్చలు మొదలయ్యాయి. ఫిరాయింపుల కేసులో 10 మంది ఎమ్మెల్యేలపై సుప్రీం కోర్టు కఠిన వైఖరి తీసుకోవడంతో టిఎస్ పాలిటిక్స్ మొత్తం కుదేలైంది. కోర్టు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు కోర్టు దిక్కరణ కింద నోటీసులు పంపించడంతో కథ మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది.

స్పీకర్‌గా ఉన్నప్పటికీ, వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన గడ్డం ప్రసాద్ ఇప్పుడు రెండు వైపులా చిక్కుల్లో చిక్కుకున్నారు. ధర్మాసనం ఇచ్చిన హెచ్చరిక తర్వాత స్పీకర్ ఆఫీస్ మౌనంగా ఉంటే పరిస్థితి మరింత క్లిష్టమవుతుందని చెప్పడంలో సందేహం లేదు. మూడు నెలలు సమయం ఇచ్చినప్పటికీ ఎలాంటి స్పందన రాకపోవడంతో కోర్టు నేరుగా వార్నింగ్ మోడ్‌కి వెళ్లింది.

కానీ పెద్ద సమస్య ఎక్కడంటే…
ఈ 10 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ తీసుకోవడమే పార్టీకి ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది. రేవంత్ రెడ్డి నిర్ణయంతో వచ్చిన ఈ ఫిరాయింపులను రాహుల్ గాంధీ కూడా అంతగా సమర్థించలేదు అని విశ్వసనీయ వర్గాల సమాచారం చెబుతోంది. రాజ్యాంగాన్ని కావాలనే విస్మరించినట్లు కాంగ్రెస్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అదే సమయంలో…
బిఆర్ఎస్ చేసిన అదే తప్పును కాంగ్రెస్ కూడా చేసిందనే ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా దానం నాగేందర్, గూడెం మైపాల్ రెడ్డి, కడియం శ్రీహరి వంటి ఫిరాయింపు నేతలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడం పార్టీ స్ఫూర్తికే వ్యతిరేకం అని సీనియర్ లీడర్లు విమర్శిస్తున్నారు.

ఇక ఇప్పుడు AICC కొత్త స్ట్రాటజీ ప్రకారం పెద్ద షాక్ వచ్చే ఛాన్స్ ఉందని టాక్.
ఈ 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించాలని కాంగ్రెస్ ఆలోచన
రాజీనామాల తర్వాత అదే నియోజకవర్గాల్లో బైఎలక్షన్స్
మళ్లీ వీళ్లని పోటీకి నిలబెట్టాలా లేదా? అనే పెద్ద ప్రశ్న

కానీ సమస్య ఏమిటంటే…
• కాంగ్రెస్ ఇంచార్జ్‌లు, ఓడిపోయిన నాయకులు అసహనంతో ఉన్నారు
• కాంగ్రెస్ లోపలే వర్గపోరు తలెత్తే ప్రమాదం ఉంది
• సుదీర్ఘకాలం ప్రజలను మోసం చేసిన నాయకులకు మళ్లీ టికెట్లు ఇచ్చితే భారీ వ్యతిరేకత వస్తుంది

ఇక బిఆర్ఎస్ వైపు చూసినా పరిస్థితి సరిగ్గా లేదు.
గూడం మైపాల్ రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత పటంచేరులో బిఆర్ఎస్ పూర్తిగా బలహీన పడింది. కేడర్ మోరల్ డౌన్. నేతలు కనబడటం లేదు.
ఇంత పెద్ద పార్టీకి ఆ నియోజకవర్గంలో సరైన నాయకుడు కూడా లేని పరిస్థితి మరింత విచిత్రం.

ఇక బిజెపి పరిస్థితి కూడా అంతే.
జూబ్లీహిల్స్ బైఎలక్షన్‌లో కిషన్ రెడ్డి – బండి సంజయ్ ఇద్దరు పూర్తిగా ఫోర్స్ పెట్టినా కూడా ఓడిపోవడం బిజెపికి పెద్ద షాక్.
ఇప్పుడు ప్రతి ఓటమికి “ముస్లిమ్ ఓట్లు – రిగ్గింగ్” అనే నెపాన్ని పెట్టుకోవడం ప్రజలకు నచ్చడం లేదు.

తెలంగాణ ప్రజలు ఇప్పటికే చెప్పేశారు –

పని చేసే వాళ్లకే అవకాశం, ప్రచారంతో పనిలేదు!

ఇక మొత్తం 10 నియోజకవర్గాల్లో బైఎలక్షన్స్ వస్తే ఏం జరుగుతుంది?
ఇది మూడు పార్టీలకు కూడా అగ్నిపరీక్షే
• కాంగ్రెస్ – తీసుకున్న జంపింగులకు టికెట్ ఇస్తారా?
• బిఆర్ఎస్ – ఎవరు పోటీ చేస్తారు? కేడర్ ఎవరు?
• బిజెపి – ఏమైనా పాపులారిటీ ఉందా?

తెలంగాణలోని ఈ 10 నియోజకవర్గాలు రాజకీయ భవిష్యత్తును మార్చే కేంద్రంగా మారబోతున్నాయి.
ఇది కేవలం బైఎలక్షన్స్ మాత్రమే కాదు…
పార్టీల అసలు బలం బయటపడే యుద్ధం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *