మే నెలలోనే మిడిల్ క్లాస్పై భారీ భారం.. పెట్రోల్ నుంచి పప్పుల దాకా పెరిగిన ధరలు
దేశవ్యాప్తంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్య ప్రజలపై భారీ భారం మోపుతున్నాయి. ముఖ్యంగా మే నెలలోనే నిత్యావసర వస్తువుల ధరలు ఒక్కసారిగా పెరగడంతో మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ పూర్తిగా తారుమారైంది. ప్రతి నెల ఒక అంచనాతో కుటుంబ ఖర్చులు ప్లాన్ చేసుకునే ప్రజలు ఇప్పుడు పెరిగిన ధరలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మే 1తో పోలిస్తే ప్రస్తుతం కందిపప్పు ధర కిలోకు ₹150 నుంచి ₹162కి చేరింది. శెనగపప్పు ₹84 నుంచి ₹92కి పెరిగింది. మినప్పప్పు…

