ఎన్నికల సాకుతో రైతు భరోసాకు వాయిదా? సీఎం రేవంత్ రెడ్డి హామీలపై రైతుల్లో అనుమానాలు
మున్సిపల్ ఎన్నికల సాకుతో రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని మరోసారి వాయిదా వేయడంపై రైతుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎన్నికలు పూర్తైన తర్వాత రైతు భరోసా పెట్టుబడి సాయం పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీపై రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత అనుభవాల నేపథ్యంలో సీఎం మాటలు నమ్మదగినవేనా అనే చర్చ గ్రామీణ ప్రాంతాల్లో జోరుగా సాగుతోంది. ఇదివరకూ కూడా అనేకసార్లు రైతు భరోసా హామీలు ఇచ్చారని, కానీ వాటి అమలు మాత్రం…

