పెట్రోల్ ధరల పెరుగుదలతో సామాన్యుడిపై భారాలు.. నిత్యావసరాల నుంచి ప్రయాణాల వరకు పెరుగుతున్న ఖర్చులు

నమస్తే.. వెల్కమ్ టు ఓకే టీవీ. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి భారీగా పెరగడం సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పెరిగిన ధరలు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. మే 25 సోమవారం నాటికి తెలంగాణలో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.113 దాటగా, డీజిల్ రూ.102 వరకు చేరుకుంది. విజయవాడ వంటి ప్రాంతాల్లో పెట్రోల్ ధర రూ.115కు చేరడం ప్రజలను షాక్‌కు గురిచేస్తోంది. గత రెండు వారాల్లోనే లీటర్…

Read Full News

నీట్ యూజీ రద్దుపై రేవంత్ రెడ్డి ఫైర్.. “మోదీ సర్కార్ పూర్తిగా ఫెయిల్”

దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన నీట్ యూజీ 2026 పరీక్ష రద్దుపై తెలంగాణ సీఎం Revanth Reddy తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వ వైఫల్యాల కారణంగానే నీట్ యూజీ పరీక్షను రద్దు చేయాల్సి వచ్చిందని ఆయన విమర్శించారు. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నియంతృత్వ, నిరంకుశ నిర్ణయమని మండిపడ్డారు. గత పదేళ్లలో ప్రధాని Narendra Modi హయాంలో దేశవ్యాప్తంగా 93 పేపర్ లీకేజీలు జరిగాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ పరిణామాలతో రెండు కోట్లకు…

Read Full News

కాన్వాయ్ కోతలు.. సామాన్యుడికి నిజంగా ఉపశమనం దొరుకుతుందా?

దేశంలో పెరుగుతున్న ఆర్థిక ఒత్తిళ్లు, ఇంధన వినియోగంపై చర్చ నడుస్తున్న సమయంలో ప్రధాని Narendra Modi పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టినట్లు వార్తలు రావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ప్రధాని తన కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యను తగ్గించడమే కాకుండా, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ప్రధాని కాన్వాయ్‌లో సాధారణంగా 12 నుంచి 15 వాహనాలు ఉండగా వాటిని సగానికి తగ్గించినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే Amit Shah కూడా తన కాన్వాయ్‌ను 11 వాహనాల…

Read Full News

గ్యాస్ ధరల పెంపుపై ఆగ్రహం: మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఆమ్ ఆద్మీ పార్టీ మహిళలు

దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో ఎల్పీజీ గ్యాస్ ధరల పెంపుపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా గ్యాస్ సిలిండర్ ధరలను పెంచిన నేపథ్యంలో మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా Narendra Modi నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై మహిళా నాయకులు మరియు కార్యకర్తలు ప్రశ్నలు లేవనెత్తారు. ఆందోళనలో పాల్గొన్న మహిళలు మాట్లాడుతూ, ఇంట్లో ఉపయోగించే డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరను సుమారు 60 రూపాయలు…

Read Full News

అమెరికాతో ‘ది బెస్ట్ డీల్’నా..? ట్రంప్ ఒత్తిడికి తలగ్గిన ఒప్పందమా..? భారత్–అమెరికా ట్రేడ్ డీల్‌పై రాజకీయ దుమారం

భారత్–అమెరికా మధ్య కుదిరిన తాజా వాణిజ్య ఒప్పందం దేశవ్యాప్తంగా రాజకీయ దుమారానికి దారి తీసింది. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ ఈ ఒప్పందాన్ని “పొరుగు ప్రత్యర్థి దేశాలతో పోలిస్తే భారత్‌కు దక్కిన అత్యుత్తమ డీల్”గా అభివర్ణించారు. వ్యవసాయం, డైరీ ఉత్పత్తులకు పూర్తి రక్షణ కల్పించామని, టెక్స్టైల్స్, ఎంఎస్ఎంఈలు, చిన్న వ్యాపారులకు ఈ డీల్ ద్వారా లాభం చేకూరుతుందని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి డొనాల్డ్ ట్రంప్‌తో ఉన్న స్నేహ సంబంధాలే ఈ ఒప్పందానికి…

Read Full News

మిడిల్ క్లాస్‌కు ఊరటనిచ్చిన కేంద్ర బడ్జెట్‌.. నిర్మలా సీతారామన్‌పై పెరుగుతున్న విశ్వాసం

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన తాజా కేంద్ర బడ్జెట్ మిడిల్ క్లాస్, సామాన్య వర్గాలకు ఊరటనిచ్చేదిగా ఉందని రాజకీయ, ఆర్థిక వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. బీజేపీ పార్టీ, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా నిర్మలా సీతారామన్‌పై పెట్టుకున్న నమ్మకాన్ని ఆమె ఎప్పుడూ ఒమ్ము చేయలేదన్న అభిప్రాయం బలపడుతోంది. భారతదేశ ఆర్థిక పునాదులు బలంగా నిలబడటానికి మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్థిక శాఖ మంత్రిగా చేసిన కృషి…

Read Full News

కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను మోసం చేస్తున్నాయి: 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే ఎన్నికలు – బీసీ జేఏసీ డిమాండ్

బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై ఎండగట్టేందుకే ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించామని బీసీ జేఏసీ నేతలు స్పష్టం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ – రెండు ప్రభుత్వాలు కూడా బీసీ సమాజాన్ని మోసం చేస్తున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు బీసీలకు హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత 42 శాతం రిజర్వేషన్ల అమలును విస్మరిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుకు…

Read Full News

కొత్త ఉపాధి హామి బిల్లుతో గ్రామీణాభివృద్ధి దిశగా అడుగు.. కాంగ్రెస్ వ్యతిరేకతపై రాజకీయ వేడి

పార్లమెంట్ సమావేశాలు ఇటీవలే ముగియగా, త్వరలో బడ్జెట్ సెషన్ ప్రారంభం కానుంది. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులు, పథకాలు ఆమోదం పొందాయి. వాటిలో అత్యంత ముఖ్యమైనదిగా కొత్త ఉపాధి హామి బిల్ నిలుస్తోంది. ఈ బిల్ ద్వారా దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలిక లాభం చేకూరుతుందని పాలక వర్గాలు చెబుతున్నాయి. ఉపాధి హామి భావన కొత్తది కాదని, బ్రిటిష్ కాలం నుంచే వివిధ రూపాల్లో అమలులో ఉందని రాజకీయ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. కరువు కాలంలో…

Read Full News

బంగ్లాదేశ్ పరిస్థితులు భారత్‌కు హెచ్చరికేనా? మత–కుల రాజకీయాలపై ఓకే టీవీ డిబేట్

బంగ్లాదేశ్‌లో ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ అశాంతి, ఆర్థిక సంక్షోభంపై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. ఒక చిన్న ఉద్యమంగా మొదలైన పరిణామాలు, పదేళ్లుగా పరిపాలనలో ఉన్న ప్రధానిని దేశం విడిచే పరిస్థితికి దారితీసిన నేపథ్యంలో, ఇది భారత్‌కు కూడా హెచ్చరిక కావచ్చా అనే అంశంపై ఓకే టీవీ వేదికగా విస్తృత చర్చ జరిగింది. ఈ చర్చలో పాల్గొన్న ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు హేమ జిల్లోల గారు, బంగ్లాదేశ్‌లోని సమస్యలు కేవలం మతపరమైనవే కాకుండా, ఉద్యోగాలు, కుల వివక్ష,…

Read Full News