శంకర్ దాదా MBBSలుగా నకిలీ వైద్యం.. హైదరాబాద్‌లో 12 మంది నకిలీ వైద్యుల అరెస్ట్!

హైదరాబాద్‌లో నకిలీ వైద్యుల వ్యవహారం మరోసారి కలకలం రేపింది. ఎలాంటి వైద్య అర్హతలు లేకుండానే డాక్టర్లుగా చెలామణి అవుతూ అమాయక ప్రజలకు వైద్యం చేస్తున్నారనే ఆరోపణలపై 12 మందిని సికింద్రాబాద్ జూబ్లీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. చిన్న చిన్న క్లినిక్‌లు నిర్వహిస్తూ ప్రజలకు వైద్యం చేస్తున్న వీరిలో కొందరు ఫార్మసిస్టులు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రజలకు అత్యవసర సమయంలో వైద్యం అందించే పేరుతో సరైన అర్హతలు లేకుండా చికిత్స…

Read Full News

బోరబండ బస్తీలో ప్రజల గోడు.. డ్రైనేజీ, చెత్త, నీటి ముంపుతో నరకయాతన.. అధికారులపై స్థానికుల ఆగ్రహం

హైదరాబాద్, బోరబండ:“ఎన్నికల సమయంలో అందరూ వస్తారు.. హామీలు ఇస్తారు.. గెలిచాక మాత్రం ఎవరూ కనిపించరు” అంటూ బోరబండ బస్తీ ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం పడితే ఇళ్లలోకి నీరు చేరడం, డ్రైనేజీలు పొంగిపొర్లడం, చెత్త పేరుకుపోవడం, దోమలు పెరిగిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు తెలిపారు. ఓకే టీవీ బృందం బోరబండ డివిజన్‌లోని పలు బస్తీలను సందర్శించి ప్రజల సమస్యలను తెలుసుకుంది. అక్కడి పరిస్థితులు పరిశీలించగా అనేక ప్రాంతాల్లో డ్రైనేజీలు బ్లాక్ కావడం, రోడ్లపై…

Read Full News

బోరబండ పద్మావతి నగర్‌లో డ్రైనేజీ సమస్యలు.. కార్పొరేటర్ పనితీరుపై స్థానికుల అసంతృప్తి

నమస్తే.. వెల్కమ్ టు ఓకే టీవీ. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌లోని బోరబండ డివిజన్ పరిధిలో ఉన్న పద్మావతి నగర్‌లో స్థానిక పరిస్థితులను తెలుసుకునేందుకు మా బృందం పర్యటించింది. గత కొన్నేళ్లలో స్థానిక ప్రజాప్రతినిధులు చేపట్టిన అభివృద్ధి పనులు, డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల పరిస్థితి, పారిశుద్ధ్యం, ప్రజల సమస్యలు వంటి అంశాలపై స్థానికులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేశాం. పద్మావతి నగర్ పరిసర ప్రాంతాల్లో పలు చోట్ల డ్రైనేజీ నీరు నిల్వ ఉండటం,…

Read Full News

బోరబండ బస్తీల్లో వర్షాల కష్టాలు.. డ్రైనేజీ, నీటి నిల్వలతో ప్రజల ఆవేదన

హైదరాబాద్‌లో వర్షాలు మొదలైతే నగరంలోని పలు బస్తీల్లో ప్రజలు ఎదుర్కొనే సమస్యలు మరోసారి వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా బోరబండ డివిజన్‌లో డ్రైనేజీ వ్యవస్థ, నీటి నిల్వలు, రోడ్ల దుస్థితి కారణంగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. వర్షం పడిన ప్రతిసారీ కాలనీలు నీటితో నిండిపోతున్నాయని, చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు రావడానికి కూడా ఇబ్బందిగా మారుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులతో మాట్లాడగా, బోరబండలోని పలు గల్లీల్లో ప్రధాన సమస్య డ్రైనేజీ వ్యవస్థేనని తెలిపారు. పై…

Read Full News

బోరబండ ఒంటరి మహిళ ఆవేదన.. “ఇల్లు ఇస్తామన్నారు.. ఇప్పటికీ అద్దె బతుకే”

హైదరాబాద్‌లోని బోరబండ బస్తీలో నివసిస్తున్న ఓ ఒంటరి మహిళ తన కుటుంబం ఎదుర్కొంటున్న సమస్యలను మీడియా ముందు వివరించారు. చిన్నప్పటి నుంచి బోరబండలోనే పెరిగానని, ప్రస్తుతం అద్దె ఇంట్లో చిన్న కుమార్తెతో జీవనం సాగిస్తున్నానని ఆమె చెప్పారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ, “మాకు ఇల్లు ఇస్తామని, ఒంటరి మహిళలకు పెన్షన్ ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఏదీ అందలేదు. నెలకు ₹15…

Read Full News