కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటే ప్రతి బూత్‌లో గెలవాలి.. కార్యకర్తలకు హరీశ్ రావు కీలక సూచనలు

కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటే ప్రతి బూత్‌లో గెలవాలి.. కార్యకర్తలకు హరీశ్ రావు కీలక సూచనలు బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలంటే ప్రతి కార్యకర్త బూత్ స్థాయిలో చురుకుగా పనిచేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. మహేశ్వరం నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన, కేవలం ప్రసంగాలు, నినాదాలతో విజయం సాధ్యం కాదని, ప్రతి పోలింగ్ బూత్‌లో మెజారిటీ సాధించేందుకు ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రారంభించాలని సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుతం అభివృద్ధి కంటే విధ్వంసమే…

Read Full News

సేర్లింగంపల్లిలో బీఆర్ఎస్ శక్తి ప్రదర్శన.. ఎమ్మెల్యే పార్టీ మారినా కార్యకర్తలే అసలైన బలం: కేటీఆర్

సేర్లింగంపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యే పార్టీ మారినా కార్యకర్తలే పార్టీకి అసలైన బలం అని పేర్కొంటూ, నాయకులు వస్తుంటారు పోతుంటారు కానీ పార్టీని నడిపేది కార్యకర్తలేనని స్పష్టం చేశారు. గత పదేళ్లలో సుమారు రూ.9,500 కోట్లతో సేర్లింగంపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని కేటీఆర్ పేర్కొన్నారు. ఫ్లైఓవర్లు, అండర్‌పాసులు, బ్రిడ్జిల నిర్మాణంతో హైదరాబాద్‌ను…

Read Full News

“కాంగ్రెస్ సినిమా ఇంటర్వెల్‌కే ఫ్లాప్.. 420 హామీల్లో ఒక్కటి నెరవేరలేదు” – మల్కాజిగిరిలో కేటీఆర్ విమర్శలు

మల్కాజిగిరిలో నిర్వహించిన బీఆర్ఎస్ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ K. T. Rama Rao కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు పూర్తవుతున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటీ పూర్తిగా అమలు కాలేదని ఆరోపించారు. హైదరాబాద్‌లో లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించామని, వాటిలో వేలాది ఇళ్లను మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలకు అందించామని గుర్తు చేసిన ఆయన, తెలంగాణ అభివృద్ధి కోసం గతంలో ప్రజలు బీఆర్ఎస్‌కు…

Read Full News

రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి ఆగిపోయాయి.. కాంగ్రెస్ పాలనపై తీవ్ర విమర్శలు

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రజలు చేసిన ఉద్యమ ఫలితంగా రాష్ట్రం ఏర్పడిందని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్భావానికి దాదాపు పన్నెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో తెలంగాణలో ప్రజలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో నిర్వహించిన సభలో మాట్లాడిన నాయకులు, రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రస్తుతం నిలిచిపోయాయని…

Read Full News

తెలంగాణకు మళ్లీ కేసీఆర్ నాయకత్వమే అవసరం”.. సిరిసిల్లలో కేటీఆర్ భావోద్వేగ ప్రసంగం

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్లలో నిర్వహించిన పార్టీ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందని, ఈ సమయంలో రాష్ట్రానికి మళ్లీ కేసీఆర్ నాయకత్వమే అవసరమని అన్నారు. కేసీఆర్‌కు ముఖ్యమంత్రి పదవి కొత్త కాదని, పదేళ్ల పాటు ఆయన ఆ బాధ్యతను ఒక తపస్సులా నిర్వర్తించారని వ్యాఖ్యానించారు. సిరిసిల్ల అభివృద్ధిని ఉదాహరణగా చూపుతూ, ఒకప్పుడు నక్సలిజం, నేత కార్మికుల ఆత్మహత్యలు, సాగునీటి కొరతతో అల్లాడిపోయిన ప్రాంతం నేడు విద్య,…

Read Full News

కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారు.. కాంగ్రెస్‌కు కర్రకాచి వాత పెడతాం” – హుజూరాబాద్ సభలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫైర్

హుజూరాబాద్ నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్లలో హుజూరాబాద్‌లో జరిగిన అభివృద్ధి అంతా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే జరిగిందని ఆయన పేర్కొన్నారు. బైఎన్నికల సమయంలో హరీశ్ రావు ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తూ రోడ్లు, గుడులు, బడులు, ఇతర అభివృద్ధి పనులను పూర్తి చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా నియోజకవర్గానికి కనీస నిధులు…

Read Full News

జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై రంగంలోకి కెసిఆర్ – కేటీఆర్, హరీష్ రావుతో కీలక బేటీ

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడెక్కుతోంది. బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి ఎర్రవల్లి ఫార్మ్ హౌస్‌లో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వ్యూహరచన, రోడ్ షోలు, ప్రచార కార్యక్రమాలపై చర్చించినట్లు సమాచారం. సిట్టింగ్ సీటును కాపాడుకోవడమే లక్ష్యంగా బిఆర్ఎస్ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నామినేషన్ ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో, పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా ప్రచారంపై దృష్టి పెట్టాలని మంత్రులకు దిశానిర్దేశం…

Read Full News