మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరి పోరే.. జనసేనతో పొత్తు లేదని స్పష్టం చేసిన రామచంద్రరావు

రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు స్పష్టంచేశారు. జనసేన పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రశక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉపాధి పథకాలపై నిర్వహించిన సెమినార్‌లో మాట్లాడిన ఆయన ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో తమ పార్టీ సత్తా ఏంటో తెలిసిపోయిందని రామచంద్రరావు వ్యాఖ్యానించారు. అయితే, వాస్తవ పరిస్థితి చూస్తే బీజేపీ…

Read More

కవిత స్థానంలో అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీ పదవి.. కాంగ్రెస్‌లో కదలికలు

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన ఎమ్మెల్సీ పదవికి చేసిన రాజీనామాను శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తాజాగా ఆమోదించారు. దీంతో నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ స్థానం అధికారికంగా ఖాళీ అయ్యింది. 2021లో నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి కవిత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అయితే బీఆర్‌ఎస్‌ పార్టీతో విభేదాలు తలెత్తిన నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆమెను సస్పెండ్ చేశారు….

Read More

రాహుల్ గాంధీ – రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు.. దిగజారుతున్న రాజకీయ భాషపై తీవ్ర విమర్శలు

తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత దిగజారుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని తెలంగాణపైకి “వదిలాడ”ని వ్యాఖ్యానించిన కేటీఆర్.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వరంగల్ అశోక్ నగర్ సభల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని…

Read More

తెలంగాణ అస్తిత్వం పేరుతో కవిత కొత్త పార్టీ.. ప్రజలు నమ్ముతారా? అనుమానాల మధ్య రాజకీయ ప్రయాణం

తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే పార్టీ కావాలంటూ.. సామాజిక తెలంగాణ సాధన కోసం కలిసి నడుద్దామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ జాగృతి విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నట్టు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఇప్పటికే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కవితకు ఆమోదం కూడా లభించినట్టు సమాచారం. బంజారాహిల్స్‌లో నిర్వహించిన తెలంగాణ జాగృతి సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యచరణ, ప్రజా సమస్యల గుర్తింపు, పరిష్కార దిశగా కమిటీల ఏర్పాటు…

Read More

అసెంబ్లీని వదిలేసి ప్రెస్ మీట్లు ఎందుకు? ప్రజల డబ్బు వృథాపై ప్రతిపక్షానికి సోయి లేదా?

ఇది మీ పర్సనల్ పార్టీ ఆఫీస్‌లో పెట్టుకున్న ప్రెస్ మీట్ కాదు.. అసెంబ్లీ. అక్కడ మాట్లాడితేనే మాటలకు శాసనబద్ధత ఉంటుంది. ఒక అంశాన్ని సభలో లేవనెత్తితే దానిపై చర్చ జరుగుతుంది, సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంటుంది. కానీ అలాంటి అవకాశం ఉండగానే, అసెంబ్లీని వదిలేసి బయట ప్రెస్ మీట్లు పెట్టడం ద్వారా గత పదేళ్లుగా తెలంగాణ ప్రజలను గాలికి వదిలేశారనే విమర్శలు ఇప్పుడు మరింత బలంగా వినిపిస్తున్నాయి. బీజేపీ విషయానికి వస్తే.. తమ వరకు సమస్య వచ్చినప్పుడే…

Read More

కవిత కాంగ్రెస్‌లోకి వెళ్తే ఆశ్చర్యం లేదు..! మంత్రి పదవి రాకపోతే పార్టీకే నష్టం: మాల్రెడ్డి రంగారెడ్డి

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే ఆశ్చర్యం ఏమీ లేదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మాల్రెడ్డి రంగారెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. మంగళవారం అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆమె భవిష్యత్ రాజకీయ ప్రయాణంపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో స్పందించిన మాల్రెడ్డి రంగారెడ్డి.. “కడియం శ్రీహరి, దానం నాగేందర్ కాంగ్రెస్‌లోకి వస్తారని మేము అనుకున్నామా?…

Read More

వ్యక్తిగా వెళ్తున్నా.. శక్తిగా తిరిగొస్తా: బిఆర్ఎస్‌పై నిప్పులు చెరిగిన కవిత, కొత్త పార్టీ సంకేతాలు?

బిఆర్ఎస్ నుంచి ఘోరమైన అవమానాలు ఎదురయ్యాయని, అవినీతిపై ప్రశ్నించినందుకే తనపై కక్ష కట్టి పార్టీ నుంచి బయటకు పంపారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. బిఆర్ఎస్ తనను సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఆ పార్టీ ద్వారా లభించిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం తెలంగాణ శాసన మండలి వేదికగా భావోద్వేగంగా మాట్లాడిన కవిత, “వ్యక్తిగానే ఈ సభ నుంచి వెళ్తున్నాను.. కానీ భవిష్యత్తులో ఒక శక్తిగా తప్పకుండా తిరిగి వస్తాను” అంటూ…

Read More

అసెంబ్లీ బాయికాట్‌తో లాభం ఎవరికీ? రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, పవర్ పాయింట్ రాజకీయంపై తీవ్ర విమర్శలు

ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పూర్తిగా ప్రశ్నించడం లేదని తాను అనట్లేదని, కానీ బీజేపీతో పోలిస్తే కాస్త మెరుగ్గానే ఉందని రాజకీయ విశ్లేషకుడు వ్యాఖ్యానించారు. అయినప్పటికీ ఇంకా ఎక్కువగా గ్రౌండ్‌లో తిరగాల్సిన అవసరం ఉందన్నారు. హరీష్ రావు, కేటీఆర్ వంటి నేతలు ప్రజల్లోకి వెళ్లి మరింత బలంగా ప్రశ్నించవచ్చని సూచించారు. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రోజు బీఆర్ఎస్ బాయికాట్ చేయడాన్ని ఆయన సమర్థించినా, ఆ తర్వాత కూడా అసెంబ్లీకి రాకపోవడమే పెద్ద తప్పు అని విమర్శించారు. ఒకరోజు నిరసన…

Read More

అసెంబ్లీలో ప్రశ్నించే హక్కే ప్రజాస్వామ్యానికి ప్రాణం: ప్రతిపక్షాల పాత్రపై కీలక వ్యాఖ్యలు

ప్రెస్ మీట్లలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఒక ఎత్తయితే, అసెంబ్లీలో అధికారికంగా ప్రశ్నించడం మరొక ఎత్తని వ్యాఖ్యానించారు ఓ రాజకీయ విశ్లేషకుడు. అసెంబ్లీలో ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు తప్పనిసరిగా ఉండాలని, బీఆర్ఎస్, బీజేపీ వంటి పార్టీలకు ఈ హక్కు రాజ్యాంగబద్ధంగా ఉందని పేర్కొన్నారు. అసెంబ్లీ కార్యకలాపాలను యావత్ దేశం గమనిస్తుందని, అక్కడ పాస్ అయ్యే బిల్లులే చట్టాలుగా మారతాయని గుర్తు చేశారు. ప్రజలు తమ సమస్యలపై అసెంబ్లీలో తమ ఎమ్మెల్యేలు ఎలా మాట్లాడుతున్నారో చూస్తారని తెలిపారు. నిరుద్యోగులు, పెన్షన్…

Read More

కాంగ్రెస్‌–బీఆర్‌ఎస్‌ మధ్య PPT వార్‌.. అసెంబ్లీ నుంచి తెలంగాణ భవన్‌ వరకూ పవర్‌పాయింట్‌ రాజకీయాలు

కాంగ్రెస్‌.. బీఆర్‌ఎస్‌ మధ్య PPT వార్‌.. ఇవాళ పోటాపోటీ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్లునీళ్లు నిప్పులు అవుతున్నాయి. లెక్కలే అస్త్రాలు అవుతున్నాయి. తెలంగాణ గట్టు మీద పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ వార్‌ నడుస్తోంది. అసెంబ్లీలో ప్రభుత్వం PPTకి సిద్ధమైంది. ఇందుకోసం పోటీగా BRS కూడా PPTకి రెడీ అయింది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య వాడీవేడి రచ్చ మొదలైంది. నీళ్లు నిప్పులుగా మారుతున్నాయి. ఏకంగా పోటా పోటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్…

Read More