వరంగల్ రైతుల ఆవేదన.. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు, లారీలు లేక తీవ్ర ఇబ్బందులు
తెలంగాణలో వరి కొనుగోళ్ల వ్యవహారం మరోసారి రాజకీయంగా వేడెక్కుతోంది. ముఖ్యంగా వరంగల్, తొర్రూరు, పాలకుర్తి ప్రాంతాల్లో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి ధాన్యం నిల్వ ఉండిపోవడం, లారీలు సమయానికి రాకపోవడం, వర్షాల కారణంగా ధాన్యం తడవడం వంటి సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “పంట పండించడానికి పెట్టుబడులు పెరిగిపోయాయి. యూరియా కోసం లైన్లు కట్టాం. ట్రాక్టర్లు, కూలీల ఖర్చులు భరించాం. ఇప్పుడు పంట చేతికొచ్చాక…

