వికారాబాద్ 17వ వార్డులో నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థిని – అభివృద్ధే లక్ష్యమని ప్రకటన

వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు నుంచి నామినేషన్ దాఖలు చేసినట్లు అభ్యర్థిని ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తన తండ్రి ప్రజాప్రతినిధిగా ఉన్న కారణంగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు మరిన్ని అవకాశాలు ఉంటాయని తెలిపారు. “నా తండ్రి ప్రజాప్రతినిధిగా ఉన్నప్పటికీ, ఆయన అందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉండలేని పరిస్థితులు ఉంటాయి. అందుకే నేను ఇక్కడే ఉండి ప్రజలకు దగ్గరగా ఉండి, సహాయం చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లో అడుగుపెట్టాను” అని ఆమె చెప్పారు. తాను రాజకీయాల్లోకి రావడం…

Read More

జూబ్లీ హిల్స్ బస్తీ పౌరుల ఆవేదన: వాగ్ధానాలు గాల్లోకెళ్ళి, కాలువ సమస్యలు–జీవితమే సవాలుగా మారింది

జూబ్లీ హిల్స్ పరిసర బస్తీలలో నివసించే ప్రజలు ప్రభుత్వం పై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్లుగా కాలువ సమస్య, రోడ్లలేమి, ప్రాథమిక వసతుల కొరత కారణంగా తమ జీవితం నరకంగా మారిందని వారు వాపోయారు. “మా కాలువ తొవ్వి వుంచేసి ఇలా నాశనం చేశారు. నీళ్ళు వెళ్లడానికి దారి లేదు. ఇళ్ళు కూల్చేశారు. పెద్దలు వస్తే ఒక్క గంటైనా మా దగ్గర కూర్చొని చూస్తారా?” అని ఒక మహిళ ప్రశ్నించారు. ప్రభుత్వాలు మారుతున్నా, పరిస్థితులు మాత్రం…

Read More

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: కేటీఆర్ ఆగ్రహం – నవీన్ యాదవ్ పై ఆరోపణలు, అభివృద్ధి చర్చే ముఖ్యమని ప్రతిపక్ష కౌంటర్

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడెక్కుతున్న నేపథ్యంలో, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ షేక్‌పేట్‌లో రోడ్‌షో నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను లక్ష్యంగా చేసుకుని, కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నవీన్ యాదవ్‌ను “ఆకు రౌడీ”గా వ్యవహరిస్తూ, ప్రజలు పొరపాటున గెలిపిస్తే అతను అందరినీ బెదిరించే అవకాశం ఉందని హెచ్చరించారు. కేటీఆర్ ఆరోపణల ప్రకారం, కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో రాష్ట్రానికి మేలు చేయలేకపోయిందని, ఇచ్చిన హామీలు అమలు కాలేదని చెప్పారు. పేదల ఇళ్లను కూల్చిన “బుల్డోజర్ ప్రభుత్వం”కు…

Read More