10 రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తి చేస్తాం.. రైతులకు క్షమాపణ చెప్పిన మంత్రి

రాష్ట్రంలో ధాన్యం సేకరణ ఆలస్యం కావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ప్రభుత్వం తరఫున మంత్రి క్షమాపణ చెప్పారు. ఈసారి అంచనాలకు మించి ధాన్యం రావడంతో సమస్యలు తలెత్తాయని, రైతులు గత 15 రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమేనని అంగీకరించారు. ప్రభుత్వం రైతుల కోసం ఎప్పుడూ కట్టుబడి పనిచేస్తుందని, రైతులకు అన్ని విధాలుగా అండగా ఉండాలన్న లక్ష్యంతోనే ముందుకు సాగుతోందని మంత్రి పేర్కొన్నారు. రాబోయే 10 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం సేకరణ పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు….

Read Full News

రైతు రాజు ఎక్కడ?.. లైన్లలోనే రైతు బతుకు ముగుస్తోందా?

“రైతు రాజు” అని చెప్పే ప్రభుత్వాల మాటలు ఒకవైపు ఉంటే.. నేల మీద రైతుల పరిస్థితి మాత్రం రోజురోజుకూ దారుణంగా మారుతోందనే ఆవేదన గ్రామాల్లో బలంగా వినిపిస్తోంది. ఎరువుల కోసం ఒక లైన్, డీజిల్ కోసం మరో లైన్, గ్యాస్ కోసం ఇంకో లైన్.. చివరికి రైతు జీవితమంతా లైన్లలోనే గడుస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయం చేయాలంటే పెట్టుబడులు పెరుగుతున్నాయి. డీజిల్ ధరలు, ఎరువుల ధరలు, విత్తనాల ఖర్చులు అన్నీ ఆకాశాన్ని అంటుతున్నాయి. కానీ…

Read Full News

తెలంగాణ రక్షణ సేన ఆవిర్భావం.. ఉచిత విద్య, వైద్యం, రైతు సంక్షేమమే లక్ష్యమన్న కవిత

తెలంగాణ రాష్ట్రంలో కొత్త రాజకీయ శక్తిగా “తెలంగాణ రక్షణ సేన” పేరుతో ప్రజల ముందుకు వస్తున్నామని మాజీ ఎమ్మెల్సీ K. Kavitha ప్రకటించారు. తెలంగాణ జాగృతి సంస్థను కొనసాగిస్తూ, తెలంగాణ రక్షణ సేనను రాజకీయ వేదికగా తీసుకొస్తున్నామని తెలిపారు. ప్రజల సమస్యలను ప్రశ్నించే గొంతుకగా, పాలక-ప్రతిపక్ష పార్టీల వైఫల్యాలను ఎత్తిచూపే శక్తిగా ఈ పార్టీ పనిచేస్తుందని చెప్పారు. సర్వోదయ తెలంగాణే తమ ప్రధాన లక్ష్యమని కవిత వెల్లడించారు. ప్రతి కుటుంబంలో వెలుగులు నింపే విధంగా పరిపాలన ఉండాలని,…

Read Full News

మేడారంలో చరిత్రాత్మక క్యాబినెట్ భేటీ: 18న మంత్రివర్గ సమావేశం, మున్సిపల్ ఎన్నికలపై కీలక నిర్ణయాలు?

తెలంగాణ చరిత్రలో తొలిసారిగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం హైదరాబాద్‌కు దూరంగా, ములుగు జిల్లా మేడారంలో నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 18న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమ్మక్క–సారలమ్మ మేడారం జాతర ప్రాంతంలో క్యాబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ క్యాబినెట్ సమావేశంలో ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి డెడికేటెడ్ కమిషన్ నివేదికకు ప్రభుత్వ ఆమోదం తెలిపే అవకాశం ఉందని…

Read Full News