వర్షాల కోసం వరుణ యాగం.. రైతుల కష్టాలపై ప్రశ్నలు!

కృష్ణమ్మ చెంత వేద మంత్రాల ఘోష.. సీఎం దంపతుల పూర్ణాహుతి తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పాడిపంటలు పుష్కలంగా పండాలని ఆకాంక్షిస్తూ నాగార్జునసాగర్‌లోని కృష్ణా నది తీరంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన వరుణ యాగం వైభవంగా జరిగింది. వేద మంత్రాల ఘోష మధ్య నిర్వహించిన ఈ యాగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు పూర్ణాహుతిలో పాల్గొన్నారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకట్ రెడ్డి, కొండా సురేఖతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు…

Read Full News

కౌలు రైతుల కష్టాలు తీరేదెప్పుడు? యూరియా కొరత, నష్టపరిహారం లేక అన్నదాతల ఆవేదన

కష్టం కౌలు రైతులది.. భరోసా భూ యజమానులదేనా? యూరియా కోసం మళ్లీ లైన్ల బాటలో అన్నదాతలు తెలంగాణలో కౌలు రైతుల పరిస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోంది. పంట పండించేది కౌలు రైతులే అయినప్పటికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు, నష్టపరిహారం, బ్యాంకు రుణాలు మాత్రం ఎక్కువగా భూ యజమానులకే పరిమితమవుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కష్టమంతా కౌలు రైతులదైతే, భరోసా మాత్రం భూ యజమానులకే దక్కుతోందా అనే ప్రశ్న ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. కౌలు రైతుల గుర్తింపు సాధన…

Read Full News

కాళ్లు మొక్కుత బాంచన్… ఒక్క యూరియా బస్త ఇప్పించండి సార్” – అధికారి కాళ్లు పట్టుకున్న రైతులు

కాళ్లు మొక్కుత బాంచన్… ఒక్క యూరియా బస్త అయినా ఇప్పించండి సార్” అంటూ రైతులు వ్యవసాయ అధికారి కాళ్లు పట్టుకొని వేడుకున్న హృదయవిదారక ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. నరసింహులపేట మండలంలో జరిగిన ఈ ఘటన అక్కడున్న వారందరినీ కలచివేసింది. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలంలోని రైతు వేదిక వద్ద ఆదివారం యూరియా కొరత తీవ్రంగా కనిపించింది. పంటను కాపాడుకునేందుకు వచ్చిన రైతులకు యూరియా అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం, ఆవేదన వ్యక్తమైంది. ఈ క్రమంలో నరసింహులపేట…

Read Full News