గ్రేటర్ ఎన్నికల్లో 22A ఎఫెక్ట్? ప్రైవేట్ భూముల రిజిస్ట్రేషన్లపై సీఎం కీలక నిర్ణయం

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 22A నిషేధిత జాబితా వ్యవహారం ఇప్పుడు రాజకీయంగానూ చర్చనీయాంశంగా మారుతోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు సైబరాబాద్, మేడ్చల్ ప్రాంతాల్లోని ఆస్తులపై ఈ ప్రభావం పడే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ప్రైవేట్ ఆస్తులు కూడా 22A జాబితాలోకి వచ్చాయని యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, లేఔట్లు, కమర్షియల్ ప్రాపర్టీలుగా ఉన్న ఆస్తుల రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపణలు…

Read Full News

కేబీఆర్ పార్క్ వద్ద కొత్త వన్‌వే రూట్.. మాదాపూర్, ఫిల్మ్‌నగర్ వైపు వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు!

హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ నియంత్రణ కోసం కొత్త వన్‌వే విధానం అమల్లోకి రావడంతో వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కేబీఆర్ పార్క్ చుట్టూ అండర్‌పాస్, ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించిన పనులు, ట్రాఫిక్ మళ్లింపుల నేపథ్యంలో ఈ మార్పులను అమలు చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ట్రాఫిక్ పోలీసులు కొత్త రూట్లు, మళ్లింపులపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రకటనలు, సైనేజ్‌లు ఏర్పాటు చేశారు. రెండు రోజులుగా ట్రయల్ రన్ నిర్వహించిన అనంతరం వన్‌వే విధానాన్ని అమలు చేశారు….

Read Full News

గ్రేటర్ హైదరాబాద్‌లో 22A షాక్.. లక్షల కోట్ల ఆస్తులు నిషేధిత జాబితాలోకి?

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆస్తుల యజమానుల్లో ఆందోళన పెరుగుతోంది. ప్రభుత్వ భూములు, ఎండోమెంట్, వక్ఫ్ తదితర వివాదాస్పద భూములను నిషేధిత జాబితాలో చేర్చే రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22A పరిధిలోకి ప్రైవేట్ ఆస్తులు కూడా వస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పటికే రిజిస్ట్రేషన్ పూర్తయిన ఇళ్లు, స్థలాలు, అపార్ట్‌మెంట్లు, కమర్షియల్ ప్రాపర్టీల యజమానులు అయోమయంలో పడుతున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, షేక్‌పేట్, అమీర్‌పేట్, ఖైరతాబాద్, పంజాగుట్ట, శ్రీనగర్ కాలనీ, ఎస్‌ఆర్ నగర్, ఎర్రగడ్డ, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్,…

Read Full News

రోడ్లు, డ్రైనేజీ సమస్యలతో బస్తీవాసుల అవస్థలు.. ఎన్నికల ముందు మాత్రమే నేతల హడావుడి!

హైదరాబాద్‌లోని ఓ బస్తీలో మౌలిక వసతుల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు, డ్రైనేజీలు, నీటి నిల్వలు, మురుగు కాలువల సమస్యలతో ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానికుల మాటల్లో చూస్తే.. ఎన్నికల సమయంలో మాత్రమే నాయకులు బస్తీల్లోకి వస్తారు.. ఆ తర్వాత తమ సమస్యలను పట్టించుకునే వారు కనిపించడం లేదనే అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది. ఏడాదిన్నరైనా…

Read Full News

ఎర్రగడ్డలో బస్తీ సమస్యలపై ఓకే టీవీ గ్రౌండ్ రిపోర్ట్.. ప్రభుత్వ పథకాలపై భిన్నాభిప్రాయాలు

హైదరాబాద్: నగరంలోని బస్తీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు నిర్వహిస్తున్న ‘బస్తీలలో కుస్తీ’ కార్యక్రమంలో భాగంగా ఓకే టీవీ బృందం ఎర్రగడ్డ డివిజన్‌లో పర్యటించింది. స్థానికులు, మున్సిపల్ సిబ్బంది, బస్తీవాసులతో మాట్లాడి రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, రేషన్, ఇళ్ల సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలుపై వారి అభిప్రాయాలను తెలుసుకుంది. ఎర్రగడ్డలో గతంలో ఉన్న కార్పొరేటర్ షీనా బేగం మృతి అనంతరం స్థానిక రాజకీయ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకున్నాయని స్థానికులు తెలిపారు. ప్రస్తుతం అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన…

Read Full News

గ్రేటర్ హైదరాబాద్ విభజన… మూడు కార్పొరేషన్ల ఏర్పాటు, స్పెషల్ ఆఫీసర్ల నియామకం

గ్రేటర్ హైదరాబాద్ నగర పరిపాలనలో కీలక మార్పులకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (TCUR) పరిధిని మూడు వేర్వేరు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో హైదరాబాద్ పరిపాలనను మరింత వికేంద్రీకరించాలనే లక్ష్యంతో కొత్త వ్యవస్థ అమల్లోకి వచ్చింది. ఈ పునర్వ్యవస్థీకరణలో భాగంగా హెచ్ఎండిఏ అర్బన్ డెవలప్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జెఎస్ రంజన్‌ను స్పెషల్ ఆఫీసర్‌గా నియమించారు. జిహెచ్ఎంసి కమిషనర్‌గా ఆర్వీ కర్ణన్ కొనసాగుతుండగా,…

Read Full News

జిహెచ్ఎంసీ పునర్వ్యవస్థీకరణపై అధ్యయనం — మేయర్ అవినీతి ఆరోపణలతో రాజకీయ ఉద్రిక్తతలు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసీ) భవిష్యత్తు రూపు ఎలా ఉండబోతుందో అనేది మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం తాజాగా జిహెచ్ఎంసీ విస్తరణలో భాగంగా ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని 27 అర్బన్ లోకల్ బాడీలను విలీనం చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనితో కొత్తగా ఒకే మెగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలా, లేదా రెండు మూడు కార్పొరేషన్లుగా విభజించాలా అనే అంశంపై ప్రభుత్వం మున్సిపల్ శాఖకు స్టడీ ఆదేశించింది. ఇందులో భాగంగా ఢిల్లీ మరియు…

Read Full News