ప్రభుత్వ చేతికి హైదరాబాద్ మెట్రో?.. ఎల్ అండ్ టీకి రూ.15 వేల కోట్ల బదలాయింపుపై ప్రశ్నలు
హైదరాబాద్ మెట్రో రైల్ వ్యవస్థపై కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. జూన్ 1 నుంచి హైదరాబాద్ మెట్రో పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతుండగా, ఎల్ అండ్ టీకి సుమారు రూ.15 వేల కోట్ల మేర బదలాయింపులు జరిగినట్లు వస్తున్న వార్తలు పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి. ప్రజా వర్గాల్లో ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న ఏమిటంటే — “ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని చెప్పే పరిస్థితిలో ఇంత…

