జూన్ 2 టార్గెట్ అంటూ కొత్త హామీలు.. కానీ పాత గ్యారెంటీల పరిస్థితి ఏంటి?

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2ను లక్ష్యంగా పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత సంక్షేమ పథకాల అమలుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటనలు చేస్తోంది. ఆరు గ్యారెంటీల్లో భాగంగా కొత్త దరఖాస్తులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా, రెండు లక్షల కొత్త పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్లు, ప్రభుత్వ ఉద్యోగులకు క్యాష్‌లెస్ చికిత్స వంటి పథకాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. త్వరలో జరగనున్న క్యాబినెట్ సమావేశంలో వీటి విధి విధానాలను ఖరారు…

Read Full News

జలమండలి జీఎం ఇంట్లో కోట్ల ఖజానా.. ఏసీబీ దాడుల్లో కళ్లుచెదిరే ఆస్తులు!

హైదరాబాద్ జలమండలిలో పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారి ఇంట్లో ఏసీబీ దాడులు సంచలనం సృష్టించాయి. సాధారణ ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టిన వ్యవహారం బయటపడటంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. జలమండలి జనరల్ మేనేజర్ అనంత లక్ష్మీకుమార్ నివాసంతో పాటు ఆయన బంధువులు, స్నేహితులు, బినామీలకు సంబంధించిన పలు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీ మొత్తంలో నగదు, బంగారం, వెండి, భూముల పత్రాలు బయటపడినట్టు సమాచారం. ఏసీబీ…

Read Full News

కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ వివాదం.. “హైదరాబాద్‌ను మరో ఢిల్లీలా మార్చొద్దు” అంటూ యువత ఆందోళన

హైదరాబాద్ నగరంలో “సేవ్ కేబీఆర్” ఉద్యమం రోజురోజుకు మరింత ఉధృతమవుతోంది. కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఫ్లైఓవర్ నిర్మాణాల కోసం చెట్లను నరుకుతున్నారనే ఆరోపణలతో యువత, పర్యావరణ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు. ఈ క్రమంలో నిరసన తెలిపిన వారిపై కేసులు నమోదు చేయడం, అర్ధరాత్రి అరెస్టులు జరగడం మరింత చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కోర్టు 25 నుంచి 35 మీటర్ల పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని, వృక్షాలను నాశనం చేయరాదని స్టే ఆర్డర్ ఇవ్వడంతో ఉద్యమకారులు…

Read Full News

భగీరథ్ పోక్సో కేసులో కొత్త ట్విస్ట్.. స్నేహితుల విచారణ, కొత్త సెక్షన్లు నమోదు

కేంద్రమంత్రి Bandi Sanjay Kumar కుమారుడు Bandi Sai Bhagirath పై నమోదైన పోక్సో కేసు రోజురోజుకూ మరింత సంచలనంగా మారుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలుసెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు ఇప్పుడు విచారణను మరింత వేగవంతం చేశారు. ముఖ్యంగా భగీరథ్ స్నేహితుల పాత్రపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. బాధిత బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదులో, ఘటన జరిగిన సమయంలో భగీరథ్ స్నేహితులు కూడా అక్కడే ఉన్నారని, అనంతరం విషయం బయటకు రాకుండా…

Read Full News

సీలింగ్ భూముల్లో బటర్ఫ్లై సిటీ రెడీమిక్స్ ప్లాంట్.. అనుమతులు లేకుండా గలీజ్ దందా?

రంగారెడ్డి జిల్లాలో బటర్ఫ్లై సిటీ పేరుతో కొనసాగుతున్న రెడీమిక్స్ ప్లాంట్ వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీసింది. Fortune Infra Developers Private Limited ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ ప్రాజెక్ట్‌పై స్థానిక రైతులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కడ్తాల్ మండలం కొండ్రిగాని బోడు గ్రామ పంచాయతీ పరిధిలోని సీలింగ్ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా రెడీమిక్స్ ప్లాంట్ నిర్వహిస్తున్నారని వారు ఫిర్యాదు చేశారు. రైతుల కథనం ప్రకారం సర్వే నెంబర్ 790/39లో ఉన్న సుమారు 3.20 ఎకరాల భూమిని…

Read Full News

నాంపల్లి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం.. హైదరాబాద్-జైపూర్ స్పెషల్ ట్రైన్‌లో మంటలు

Nampally Railway Station లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్టేషన్‌లో ఆగి ఉన్న హైదరాబాద్–జైపూర్ స్పెషల్ ట్రైన్‌లోని ఓ ఏసీ కోచ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. శుక్రవారం సాయంత్రం 7:50 గంటలకు బయలుదేరాల్సిన Hyderabad Jaipur Special Train లో సుమారు 6:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. మొదట ఒక ఏసీ కోచ్‌లో ప్రారంభమైన మంటలు కొద్దిసేపటికే పక్క భోగీలకు వ్యాపించాయి. మంటలు చెలరేగడాన్ని గమనించిన ప్రయాణికులు…

Read Full News

బండి భగీరథ్‌కు కోర్టులో షాక్.. అరెస్ట్ నుంచి రక్షణకు నో చెప్పిన న్యాయస్థానం

పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్‌కు కోర్టులో ఊరట లభించలేదు. అరెస్ట్ నుంచి మధ్యంతర రక్షణ కల్పించాలంటూ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం తక్షణ ఉపశమనం ఇవ్వడానికి నిరాకరించింది. రాత్రి 9 గంటల నుంచి 11:40 గంటల వరకు ఇరు వర్గాల న్యాయవాదులు సుదీర్ఘ వాదనలు వినిపించగా, కోర్టు తీర్పును గురువారానికి వాయిదా వేసింది. ఈ కేసులో బండి భగీరథ్ విచారణకు సహకరిస్తానని, రెండు రోజుల్లో హాజరవుతానని తెలిపినప్పటికీ ఇప్పటికీ…

Read Full News

బండి సంజయ్ కొడుకు కేసుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. విచారణ ఎదుర్కోాలని సూచన

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న బండి సంజయ్ కుమారుడికి సంబంధించిన కేసుపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. “నీ కొడుకుని తీసుకొచ్చి పోలీసులకు అప్పగించు.. విచారణను ధైర్యంగా ఎదుర్కో” అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ కేసులో తన పేరు ప్రస్తావించొద్దని, తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని కేంద్ర మంత్రి Bandi Sanjay Kumar అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో సీఎం స్పందించారు….

Read Full News

యూటర్న్లు ఎందుకు? ట్రాఫిక్‌పై డీజీపీ సీవీ ఆనంద్ క్లారిటీ.. డ్రగ్స్ తెలంగాణకు పెద్ద ముప్పు

హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యలు, యూటర్న్ల వ్యవస్థ, రోడ్డు భద్రత, డ్రగ్స్ ముప్పు, సైబర్ నేరాలపై తెలంగాణ డీజీపీ C. V. Anand కీలక వ్యాఖ్యలు చేశారు. వెయిట్ న్యూస్ కాన్క్లేవ్‌లో పాల్గొన్న ఆయన, ప్రజల్లో ఉన్న అనేక సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. హైదరాబాద్‌లో రోజురోజుకూ జనాభా, వాహనాల సంఖ్య పెరుగుతుండటంతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారిందని వ్యాఖ్యాత ప్రశ్నించగా, యూటర్న్ల వ్యవస్థ వెనుక ట్రాఫిక్ శాస్త్రం ఉందని డీజీపీ వివరించారు. “ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ ఊరికే యూటర్న్లు పెట్టదు….

Read Full News

హైడ్రా నెక్స్ట్ 10 ఇయర్స్ బ్లూప్రింట్.. హైదరాబాద్ చెరువుల రంగనాథ్ ఐపీఎస్ భారీ ప్రణాళిక

హైదరాబాద్ నగర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని హైడ్రా సంస్థ వచ్చే పదేళ్లకు భారీ బ్లూప్రింట్ సిద్ధం చేస్తోందని హైడ్రా కమిషనర్ Ranganath వెల్లడించారు. వేటు న్యూస్ కాంక్లేవ్ 2026లో “హైడ్రా బ్లూప్రింట్ ఫర్ ది నెక్స్ట్ డికేడ్” అంశంపై మాట్లాడిన ఆయన, నగరంలో పెరుగుతున్న జనాభా, భూములపై ఒత్తిడి, చెరువుల ఆక్రమణలు, వాతావరణ మార్పులు వంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు హైడ్రా కీలకంగా పనిచేస్తోందన్నారు. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీగా హైడ్రా రెండు ప్రధాన…

Read Full News