నీళ్ల పైపులా? పైసల పైపులా?” – ఎల్బీనగర్ డ్రైనేజ్ పనులపై తీవ్ర ఆరోపణలు, కాంట్రాక్టర్లపై ప్రజా ఆగ్రహం

హైదరాబాద్‌లోని ఎల్బీనగర్–సరూర్‌నగర్ ప్రాంతాల్లో జరుగుతున్న డ్రైనేజ్ పైప్‌లైన్ పనులపై స్థానికుల ఆగ్రహం వ్యక్తమవుతోంది. పైపులు వేయాల్సిన కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, ఇప్పటికే ఉన్న నీటి పైపులను ధ్వంసం చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. “మీకు పైపులు వేయడానికి కాంట్రాక్ట్ ఇచ్చారా? లేక ఇరగదీయడానికి ఇచ్చారా?” అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు జరుగుతున్న ప్రాంతంలో వర్క్ ఇన్‌స్పెక్టర్లు, ఇంజినీర్లు ఎవరూ కనిపించడం లేదని, కేవలం కాంట్రాక్టర్లు మాత్రమే పనులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. కొంతమంది స్థానికులు ఈ…

Read Full News

లోటస్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్ వివాదం.. బఫర్ జోన్‌లో నిర్మాణాలకు అనుమతులా? నష్టపోయేది ఫ్లాట్ కొనుగోలుదారులేనా?

లోటస్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్ వివాదం.. బఫర్ జోన్‌లో నిర్మాణాలకు అనుమతులా? నష్టపోయేది ఫ్లాట్ కొనుగోలుదారులేనా? హైదరాబాద్‌లోని పటేల్ చెరువు పరిధిలో ఉన్న లోటస్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్ మరోసారి వివాదంలో నిలిచింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి బఫర్ జోన్ నిబంధనల ఉల్లంఘన, అనుమతుల జారీ, సామాన్య ఫ్లాట్ కొనుగోలుదారుల భవిష్యత్తుపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇరిగేషన్ శాఖ అభ్యంతరం.. జీహెచ్‌ఎంసీ అనుమతులు? ఆరోపణల ప్రకారం, ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన భూమిలో కొంత భాగం ఇరిగేషన్ శాఖ పరిధిలోని బఫర్…

Read Full News

ఫ్యూచర్ సిటీని అడ్డుకునేవాళ్లు రద్దయిపోయిన వెయ్యి నోట్ల లాంటివాళ్లు’.. ప్రతిపక్షాలపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

‘ఫ్యూచర్ సిటీని అడ్డుకునేవాళ్లు రద్దయిపోయిన వెయ్యి నోట్ల లాంటివాళ్లు’.. ప్రతిపక్షాలపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ హైదరాబాద్ నగర చరిత్ర, అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకునే శక్తులపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ నగరానికి గొప్ప చరిత్ర ఉందని, కులీ కుతుబ్ షాహీలు, నిజాం నవాబులు నగరాన్ని విస్తరించడంతో ప్రపంచ పటంలో…

Read Full News

20 నిమిషాల వర్షానికే హైదరాబాద్ అస్తవ్యస్తం.. హైడ్రాపై సీఎం వ్యాఖ్యలు ఇప్పుడు ట్రోల్!

20 నిమిషాల వర్షానికే హైదరాబాద్ అస్తవ్యస్తం.. హైడ్రాపై సీఎం వ్యాఖ్యలు ఇప్పుడు ట్రోల్! నిన్న కురిసిన కేవలం 20 నిమిషాల వర్షపాతం హైదరాబాద్ నగరాన్ని అతలాకుతలం చేసింది. ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. గచ్చిబౌలి, హైటెక్ సిటీ, రాయదుర్గం మెట్రో స్టేషన్, ట్యాంక్‌బండ్, యూసఫ్‌గూడ వంటి ప్రాంతాలు నీట మునిగిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ స్తంభించిపోగా, వాహనాలు నీటిలో చిక్కుకుపోయాయి. కొన్నిచోట్ల చెట్లు విరిగి వాహనాలపై పడగా, మరికొన్ని ప్రాంతాల్లో విద్యుత్ షాక్‌ల కారణంగా ప్రాణనష్టం…

Read Full News

ఆర్‌అండ్‌బీ చీఫ్ ఇంజనీర్ ఇంట్లో వందల కోట్ల అక్రమాస్తులు?.. కట్టల కొద్ది నగదు, కిలోల కొద్దీ బంగారం స్వాధీనం

రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖలో భారీ అవినీతి ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వ నిర్మాణ పనుల్లో కీలక బాధ్యతలు నిర్వహించే ఆర్‌అండ్‌బీ శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్ జే. మోహన్ నాయక్ నివాసాలు, కార్యాలయాలు, బంధువులు, బినామీలు, అనుచరుల ఇళ్లపై ఏసీబీ అధికారులు నిర్వహించిన మెరుపు దాడుల్లో కళ్లు చెదిరే అక్రమాస్తులు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వ రహదారులు, వంతెనలు, ఫ్లైఓవర్లు, భవనాల నిర్మాణాలకు సంబంధించిన భారీ టెండర్లు ఈ శాఖ పరిధిలోనే జరుగుతుంటాయి. ప్రజాధనం వేల కోట్ల రూపాయలు ఖర్చయ్యే…

Read Full News

సెక్రటేరియట్ ముందు సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన నిరసనకారుడు.. రైతుల హామీలపై సమాధానం చెప్పాలని డిమాండ్

సెక్రటేరియట్ ముందు సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన నిరసనకారుడు.. రైతుల హామీలపై సమాధానం చెప్పాలని డిమాండ్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎదుట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ ఓ నిరసనకారుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆరోపిస్తూ రైతుల సమస్యలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. “చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఈరోజు రైతులు…

Read Full News

20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వాలి.. లేకపోతే డీజీపీ కార్యాలయం ముట్టడిస్తాం: నిరుద్యోగ అభ్యర్థుల హెచ్చరిక

20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వాలి.. లేకపోతే డీజీపీ కార్యాలయం ముట్టడిస్తాం: నిరుద్యోగ అభ్యర్థుల హెచ్చరిక హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయం వద్ద పోలీస్ నియామక నోటిఫికేషన్ కోసం నిరుద్యోగ యువత ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం 5 వేల పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయాలనే ఆలోచనలో ఉందనే ప్రచారాన్ని వ్యతిరేకిస్తూ, కనీసం 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆందోళనలో పాల్గొన్న అభ్యర్థులు మాట్లాడుతూ, గత నాలుగేళ్లుగా…

Read Full News

ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ మోహన్ నాయక్‌పై ఏసీబీ మెరుపు దాడులు.. 11 ప్రాంతాల్లో సోదాలు

ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ మోహన్ నాయక్‌పై ఏసీబీ మెరుపు దాడులు.. 11 ప్రాంతాల్లో సోదాలు తెలంగాణలో మరోసారి అవినీతి ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో భారీగా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. రోడ్లు మరియు భవనాల శాఖ (ఆర్‌అండ్‌బీ)లో కీలక అధికారిగా పనిచేస్తున్న ఇంజినీర్-ఇన్-చీఫ్ (స్టేట్ రోడ్స్) మోహన్ నాయక్ నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన పలు ప్రాంతాల్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఏకకాలంలో దాడులు చేపట్టింది. సమాచారం ప్రకారం, మియాపూర్ కేంద్రంగా మొత్తం 11…

Read Full News

ఫీజుల దోపిడీపై బీఆర్ఎస్ ముట్టడి.. ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణ చట్టం తీసుకురావాలని తల్లిదండ్రుల డిమాండ్

ఫీజుల దోపిడీపై బీఆర్ఎస్ ముట్టడి.. ప్రైవేట్ విద్యాసంస్థలపై నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల పెంపుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. తల్లిదండ్రుల సమస్యలను పట్టించుకోకుండా పోలీసులు వ్యవహరించారని, మహిళల పట్ల కూడా దౌర్జన్యంగా ప్రవర్తించారని తెలంగాణ రక్షణ సేన నేతలు తీవ్రంగా విమర్శించారు. “మహిళలను కూడా చూడకుండా పోలీసులు వ్యవహరించడం దారుణం. ప్రతి వర్గానికి ఈ ప్రభుత్వంలో అన్యాయం జరుగుతోంది. రేపు అధికారంలోకి వచ్చేది…

Read Full News

టీజీపీఎస్సీ కార్యాలయం ముందు జనసేన నేత భీమ నరేందర్ రెడ్డి ఆందోళన.. ఉద్యోగాల భర్తీపై రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీత

హైదరాబాద్‌లోని టీజీపీఎస్సీ కార్యాలయం ముందు జనసేన నేత భీమ నరేందర్ రెడ్డి నిరసనకు దిగారు. తెలంగాణలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని, ప్రభుత్వం ప్రకటిస్తున్న ఉద్యోగాల భర్తీ గణాంకాలపై స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాష్ట్రంలో భారీ స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య అధికంగా ఉందని, యువతలో నిరుద్యోగ శాతం 8.9 శాతంగా ఉందని…

Read Full News