అస్తం, సుత్తి–కొడవలి–నక్షత్రం గుర్తులకు ఓటేయండిపేదల ప్రభుత్వాన్ని మరింత బలపర్చండి: మంత్రి పిలుపు

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి ప్రజలకు ఓటింగ్‌పై స్పష్టమైన విజ్ఞప్తి చేశారు. 23వ పరిధిలోని మూడు డివిజన్లలో ‘అస్తం’ గుర్తుకు, 21వ డివిజన్‌లో సీపీఎం పార్టీ గుర్తైన ‘సుత్తి–కొడవలి–నక్షత్రం’కు అత్యధిక ఓట్లు వేసి మంచి మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. రెండు సంవత్సరాల క్రితం ప్రజల కష్టఫలితంగా తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఇందిరమ్మ రాజ్యంలో పేదవాడికి అండగా నిలిచే అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని గుర్తు చేశారు….

Read Full News

మున్సిపల్ ఎన్నికలపై మంత్రుల అనాశక్తి: క్షేత్ర స్థాయికి దూరంగా కాంగ్రెస్ ప్రభుత్వం?

తెలంగాణలో రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తి స్వరాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మంత్రుల అనాశక్తి, క్షేత్ర స్థాయికి వెళ్లేందుకు ఆసక్తి లేకపోవడం పార్టీకి పెద్ద సవాలుగా మారిందన్న నివేదికలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వానికి అందిన నిఘా వర్గాల నివేదికల ప్రకారం, లోక్‌సభ నియోజకవర్గాల వారిగా ఇంచార్జీలుగా నియమించిన మంత్రుల్లో సగం మంది ఇప్పటికీ ఫీల్డ్‌లోకి అడుగుపెట్టలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నెల 18న మేడారంలో జరిగిన క్యాబినెట్ సమావేశం తర్వాత మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై…

Read Full News

ఇందిరమ్మ ఇండ్ల ప్రగతి: వచ్చే మార్చిలో లక్ష గృహ ప్రవేశాలు – మంత్రి పొంగులేటి

రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో గృహ నిర్మాణ శాఖ రెండు సంవత్సరాల ప్రగతిని వివరించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఇప్పటివరకు దాదాపు నాలుగు లక్షల ఇండ్లను మంజూరు చేశామని, ఇంకా మూడు లక్షల ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయని మంత్రి తెలిపారు. వచ్చే ఏడాది మార్చి నాటికి లక్ష ఇండ్లకు గృహ ప్రవేశాలు నిర్వహిస్తామని, జూన్ నాటికి మరో రెండు లక్షల…

Read Full News