ప్రచార రాజకీయాలే ప్రధానమా? సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై పెరుగుతున్న విమర్శలు

ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో చర్చల దిశ పూర్తిగా మారిపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పాలన, ప్రజల అవసరాలు, అభివృద్ధి అంశాలపై మాట్లాడాల్సిన నాయకులు కేవలం ప్రచారాల కోసమే వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రజల్లో భావన బలపడుతోంది. ఒక సినిమా పాట ప్రచారంలో భాగంగా పాడామని చెప్పి కేసులు ఎదుర్కొన్న ఘటనల మాదిరిగానే, ఇప్పుడు రాజకీయ నాయకుల మాటలు కూడా కేవలం ఫ్రంట్ పేజీ వార్తల కోసమే అన్నట్టుగా కనిపిస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేసీఆర్‌ను విమర్శించవద్దని ఎవరూ చెప్పడం లేదని, కానీ…

Read Full News

కేటీఆర్ రాచరిక పోకడలు మార్చుకోకపోతే బీఆర్ఎస్‌ను ఎవరు కాపాడలేరు: కవిత వ్యాఖ్యలపై తీవ్ర రాజకీయ విశ్లేషణ

కేటీఆర్ తన రాచరిక పోకడలను మార్చుకోకపోతే బీఆర్ఎస్‌ను ఎవరు కాపాడలేరని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. ఫోన్ ట్యాపింగ్ కేసు, మున్సిపల్ ఎన్నికలు, కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ అంతర్గత వ్యవహారాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు వంటి కుటుంబ సభ్యులపై మాట్లాడినప్పుడే మీడియా, సోషల్ మీడియాలో హైలైట్ అవుతుందని కవితకు తెలుసని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే ఉద్దేశపూర్వకంగా…

Read Full News

తెలంగాణ రాజకీయాల్లో అంతర్గత యుద్ధం: మీడియా గ్యాంగులు, స్కాములు, ఫోన్ ట్యాపింగ్ డైవర్షన్‌లపై సంచలన ఆరోపణలు

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు తీవ్ర గందరగోళ స్థితికి చేరుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో లేని సమయంలో క్యాబినెట్ సమావేశం నిర్వహించడమే కాకుండా, కాంగ్రెస్ పార్టీలోనే నాయకుల మధ్య తీవ్ర అసమన్వయం బయటపడిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోమటిరెడ్డి వర్గం, ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గం, భట్టి విక్రమార్క వర్గం మధ్య స్పష్టమైన విభేదాలు ఉన్నాయని వ్యాఖ్యలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా, తెలంగాణలో మీడియా రెండు శిబిరాలుగా చీలిపోయిందన్న ఆరోపణలు కూడా తెరపైకి వచ్చాయి….

Read Full News

మత విద్వేష వ్యాఖ్యలు: పాడి కౌశిక్ రెడ్డి పై హెచ్ఆర్సిలో ఫిర్యాదు

యావత్తు ముస్లిం సమాజాన్ని అవమానించిన వ్యాఖ్యలు” – ఫైం ఖుర్షి ఆరోపణ 24 గంటల్లో సస్పెండ్ చేయకపోతే వ్యాఖ్యలను సమర్థించినట్టే: బీఆర్ఎస్ నేతలకు హెచ్చరిక హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన మత విద్వేష వ్యాఖ్యలపై రాష్ట్ర మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ వైస్ చైర్మన్ ఫైం ఖుర్షి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (HRC)లో ఫిర్యాదు చేశారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఓ నిజాయితీగల ఐపీఎస్ అధికారిని మతం పేరుతో దూషించడమే కాకుండా, యావత్తు…

Read Full News

మత విద్వేష వ్యాఖ్యలు: పాడి కౌశిక్ రెడ్డి పై హెచ్ఆర్సిలో ఫిర్యాదు, 20లోగా రిపోర్ట్ ఇవ్వాలంటూ డిజీపీకి ఆదేశం

పార్టీ స్థాయిలో చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ ఫిర్యాదు అనంతరం మీడియాతో మాట్లాడిన ఫైం ఖుర్షి, మత విద్వేష వ్యాఖ్యలు చేసిన పాడి కౌశిక్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లను డిమాండ్ చేశారు. ముస్లింలపై ద్వేషం పెంచే నాయకులను బీఆర్ఎస్ పార్టీ ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. ఇటువంటి నేతలకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. బీఆర్ఎస్‌కు మైనస్‌గా మారుతున్న నాయకత్వం? ఈ సందర్భంగా రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చ మొదలైంది. ఇటీవల…

Read Full News

ఫోన్ టాపింగ్ కేసు: సిట్ విచారణకు హాజరైన కేసీఆర్, నందీనగర్‌లో కీలక భేటీలు

ఫోన్ టాపింగ్ కేసులో ఆదివారం సిట్ విచారణ ఉండటంతో ఉదయం 11 గంటలకు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి బయలుదేరిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా నందీనగర్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. అక్కడ బీఆర్ఎస్ ముఖ్యనేతలతో కలిసి లంచ్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనపై నమోదైన కేసులు, సిట్ విచారణ తీరు, భవిష్యత్ వ్యూహాలపై పార్టీ నేతలతో ఆయన చర్చించినట్లు సమాచారం. సిట్ విచారణ అనంతరం కేటీఆర్, హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌తో పాటు…

Read Full News

విచారణను తప్పు పట్టడం ఎందుకు? ఫోన్ టాపింగ్ వాస్తవాలపై రాజకీయ డ్రామా

విచారణను తప్పు పట్టడం ఎందుకు? ఫోన్ టాపింగ్ వాస్తవం కాదా? తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్న విచారణలను తప్పు పట్టడం ఒక కొత్త రాజకీయ ఫ్యాషన్ అయిపోయింది.విచారణ అంటేనే కక్షపూరిత చర్య అని కొందరు చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.కానీ అసలు ప్రశ్న ఇది — విచారణ జరుగుతుంటే భయపడాల్సిన అవసరం ఎందుకు వస్తోంది? ఫోన్ టాపింగ్ జరిగిందా? జరిగింది ఇది ఆరోపణ కాదు.ఇది అనుమానం కాదు.ఇది రాజకీయ వ్యాఖ్య కాదు. ఫోన్ టాపింగ్ జరిగింది — అది వాస్తవం.పోర్ట్ టాపింగ్…

Read Full News

నోటీసుల హడావుడి… అరెస్టులేవీ లేవు: బిఆర్ఎస్ హై డ్రామా రాజకీయాలు

కేంద్ర–రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం సాగుతున్న పరిణామాలు చూస్తే బిఆర్ఎస్ వ్యవహారం మొత్తం ఒక హై డ్రామా స్క్రిప్ట్లా కనిపిస్తోంది. విచారణ నోటీసులు వస్తే చాలు, అరెస్టులు జరిగిపోతున్నట్లుగా వాతావరణం సృష్టించడం, ర్యాలీలు, నినాదాలు, బెటాలియన్‌లా కార్యకర్తల గుంపులు—ఇవన్నీ చూస్తే నిజంగా ఏదో పెద్ద తుఫాన్ వచ్చిందన్న భావన కలుగుతోంది. కానీ వాస్తవానికి ఏమవుతోంది అంటే, నోటీసులు తప్ప అరెస్టులు లేవు, చర్యలు లేవు. మొదట హరీష్ రావుకు నోటీసులు వచ్చాయి. ఆయన విచారణకు వెళ్లారు, సాయంత్రానికి తిరిగి…

Read Full News

పచ్చి అబద్ధాలతో వ్యక్తిత్వ హననం: నమస్తే తెలంగాణ, కేటీఆర్, హరీష్ రావుపై కాంగ్రెస్ నేత ఫిర్యాదు

పచ్చి అబద్ధాలతో తనపై మరియు కాంగ్రెస్ పార్టీపై కుట్రపూరితంగా బురద జల్లే ప్రయత్నం చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ నేత నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. జేసీబీ ఓనర్ల మధ్య జరిగిన చిన్న ఘటనను వక్రీకరించి, తనపై రూ.8 కోట్ల డిమాండ్ చేసినట్లు తప్పుడు కథనం ప్రచురించారని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ నెల మొదటి వారంలో జరిగిన ఒక సంఘటనను ఆసరాగా తీసుకుని, టీఆర్‌ఎస్ (బీఆర్‌ఎస్) పార్టీకి చెందిన నమస్తే తెలంగాణ పత్రికలో…

Read Full News

ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో రాజకీయ సీరియల్: ఆరోపణలు మాత్రమే, అరెస్టులు శూన్యం

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు మరోసారి రాజకీయ దుమారానికి దారి తీసింది. ఒకవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తుండగా, మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ విచారణను పూర్తిగా రాజకీయ పంచాయతీగా అభివర్ణించారు. ఆధారాలు ఉన్నాయని చెబుతున్నప్పటికీ ఇప్పటివరకు ఒక్క కీలక అరెస్టు కూడా జరగలేదని ఇరు పక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనను విచారణకు పిలిచారని, దాదాపు ఏడు నుంచి ఎనిమిది…

Read Full News