కొర్రెముల కబ్జాలపై కొరడా.. 150 ఎకరాల ప్రభుత్వ భూమి రక్షణకు చర్యలు
మేడ్చల్ మల్కాజగిరి జిల్లా కొర్రెముల్లలో ప్రభుత్వ భూముల కబ్జాల వ్యవహారం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తోంది. వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కాపాడేందుకు అధికార యంత్రాంగం కదిలింది. దిశా దినపత్రిక వరుస కథనాల తర్వాత రెవెన్యూ శాఖ, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చర్యలకు దిగినట్లు సమాచారం. పోచారం మున్సిపల్ పరిధిలోని కొర్రెముల్ల రెవెన్యూ గ్రామంలో సర్వే నెంబర్ 867తో పాటు పలు సర్వే నెంబర్లలో ఉన్న సుమారు 150 ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా…

