ప్రైవేట్ మెడికల్ కాలేజీల ఫీజు దోపిడీ.. నాలుగేళ్ల కోర్సుకు ఐదేళ్ల ఫీజు!

ప్రైవేట్ మెడికల్ కాలేజీల ఫీజు దోపిడీపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎంబీబీఎస్ కోర్సు కాల పరిమితి నాలుగున్నర సంవత్సరాలు మాత్రమే ఉన్నప్పటికీ, కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు బి, సి కేటగిరీ విద్యార్థుల నుంచి ఐదేళ్లకు ఫీజు వసూలు చేస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా అదనంగా వసూలు చేసిన ఫీజును తిరిగి చెల్లించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళనల నేపథ్యంలో తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ నాలుగేళ్లకే ఫీజు వసూలు…

Read Full News

స్టైఫండ్ పెంచాలి.. AYUSH పీజీ విద్యార్థుల సమ్మె.. ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి

తెలంగాణలో ఆయుష్ (ఆయుర్వేదం, హోమియోపతి, యునానీ, సిద్ధ, నేచురోపతి) పీజీ, యూజీ విద్యార్థులు స్టైఫండ్ పెంపు కోసం ఆందోళన బాట పట్టారు. పదేళ్లుగా తమ స్టైఫండ్‌లో సరైన పెంపు లేదని, జీవన వ్యయం భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రస్తుతం ఇస్తున్న మొత్తం సరిపోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీజీ విద్యార్థులకు ప్రస్తుతం సుమారు రూ.30 వేల స్టైఫండ్, హౌస్ సర్జన్లకు రూ.18 వేల వరకు మాత్రమే అందుతోందని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోనే అత్యల్ప…

Read Full News

ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఫీజుల దందా: నాలుగున్నర ఏండ్ల కోర్సుకు ఐదేళ్ల ఫీజు వసూల్!

వరంగల్‌లో ప్రైవేట్ మెడికల్ కాలేజీల ఫీజుల దందా మరోసారి వెలుగులోకి వచ్చింది. నాలుగున్నర ఏండ్ల ఎంబీబీఎస్ కోర్సుకు ఐదేళ్ల ఫీజు వసూలు చేస్తున్నారంటూ మెడికో పేరెంట్స్ అసోసియేషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వరంగల్ కాలేజీ యూనివర్సిటీ ఎదుట తల్లిదండ్రులు నిరసన చేపట్టి తమ గోడును వెల్లగక్కారు. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) మార్గదర్శకాల ప్రకారం ఎంబీబీఎస్ కోర్సు వ్యవధి నాలుగున్నర సంవత్సరాలు మాత్రమే. అనంతరం ఒక సంవత్సరం ఇంటర్న్‌షిప్ ఉంటుంది. ఈ ఇంటర్న్‌షిప్ సమయంలో విద్యార్థులు…

Read Full News