మేడ్చల్‌లో విజన్ వివికే గ్రీన్ పార్క్ విల్లాస్ ప్రారంభం.. 350 ప్రీమియం విల్లాలతో మెగా గేటెడ్ కమ్యూనిటీకి శ్రీకారం

మేడ్చల్ రియల్ ఎస్టేట్ రంగంలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది విజన్ వివికే హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. మేడ్చల్ సమీపంలోని గిర్మాపురం వద్ద సంస్థ చైర్మన్, ఎండీ వి. విజయ్ కుమార్ ఆధ్వర్యంలో “గ్రీన్ పార్క్” పేరుతో అత్యాధునిక గేటెడ్ విల్లా కమ్యూనిటీని ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ప్రముఖ సినీ నటి మెహరీన్ పీర్జాదా ముఖ్య అతిథిగా హాజరై ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులో మొత్తం 350 ప్రీమియం డూప్లెక్స్ మరియు…

Read Full News

తెలంగాణ ఓటరు జాబితా డిజిటలైజేషన్ నత్తనడక.. 49.28% మాత్రమే పూర్తి? గడువు పొడిగించాలని డిమాండ్

తెలంగాణలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (Special Intensive Revision – SIR) ప్రక్రియలో భాగంగా చేపట్టిన డిజిటలైజేషన్ ఆశించిన వేగంతో సాగడం లేదనే చర్చ జరుగుతోంది. అధికారులు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ దాదాపు పూర్తయిందని చెబుతున్నప్పటికీ, ఓటర్ల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియ మాత్రం ఇంకా సగం దశలోనే ఉందని సమాచారం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం, రాష్ట్రంలోని మొత్తం 3,38,26,448 మంది ఓటర్లలో ఇప్పటివరకు 1,66,70,610 మంది వివరాలు మాత్రమే డిజిటలైజేషన్…

Read Full News

ఒకే ఇంటి నంబర్‌పై వందల ఓట్లు.. తెలంగాణ ఓటరు జాబితాలో సంచలన అక్రమాలు?

తెలంగాణలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకే ఇంటి నంబర్‌పై వందలాది ఓటర్లు నమోదవడం, ఖాళీగా ఉన్న ఫ్లాట్ల చిరునామాలపై కూడా భారీ సంఖ్యలో ఓటర్లు ఉండటం అధికారులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి వంటి పట్టణ ప్రాంతాల్లో ఈ తరహా అక్రమాలు ఎక్కువగా బయటపడుతున్నాయని తెలుస్తోంది. గతంలో సరైన భౌతిక పరిశీలన లేకుండానే రెవెన్యూ, మున్సిపల్ అధికారులు…

Read Full News

పూలమ్మిండు పాలమ్మిండు ఎకరాల కబ్జా? — మల్లారెడ్డి‌పై కవిత సీరియస్ ఆరోపణలు

తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. బంగారు తెలంగాణ బ్యాచ్ నేతల్లో ఒకరైన ఎమ్మెల్యే మల్లారెడ్డి‌పై మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. ఇటీవల మేడ్చల్ జిల్లా పర్యటనలో మాట్లాడిన ఆమె, మల్లారెడ్డి వేల ఎకరాల భూములను కబ్జా చేశారని, ప్రజల కోసం మాత్రం ఒక్క పని కూడా చేయలేదని విమర్శించారు. “పూలమ్మిండు, పాలమ్మిండు—వేల ఎకరాలు కబ్జా పెట్టిండు మల్లారెడ్డి. పేదల కోసం ఆయన చేసినది ఏమీ లేదు” అని కవిత వ్యాఖ్యానించారు….

Read Full News