హైదరాబాద్లో కామన్ టికెట్ సిస్టమ్.. మెట్రో, ఎంఎంటీఎస్, బస్సులకు ఒకే టికెట్
హైదరాబాద్ నగర ప్రజా రవాణాలో భారీ మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఇకపై ఎంఎంటీఎస్ రైళ్లు, మెట్రో రైలు, టీజీఎస్ఆర్టీసీ బస్సులకు ఒకే టికెట్ విధానం తీసుకురావడానికి ప్రభుత్వం సమగ్ర ప్రణాళిక సిద్ధం చేస్తోంది. నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడం, ప్రజా రవాణా వినియోగాన్ని పెంచడం, ప్రయాణికులకు సులభతరం చేయడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎంఎంటీఎస్, మెట్రో, బస్సులు వేర్వేరుగా పనిచేస్తుండటంతో ప్రయాణికులు ఒక్కో సేవకు ఒక్కో టికెట్ తీసుకోవాల్సిన పరిస్థితి…

