అక్రమాలకు చెక్‌.. ఒకే గొడుగు కింద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్? అవినీతి తగ్గాలంటే అధికారులు మారాలా?

నమస్తే.. వెల్కమ్ టు ఓకే టీవీ. రాష్ట్రంలో వివిధ శాఖల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలను కట్టడి చేయడానికి ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. సివిల్ సప్లైస్, కమర్షియల్ ట్యాక్స్, మైనింగ్ శాఖల్లో ప్రస్తుతం విడివిడిగా పనిచేస్తున్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. త్వరలో దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూడు శాఖల్లో విజిలెన్స్ వ్యవస్థలు వేర్వేరుగా…

Read Full News

తెలంగాణలో మైనింగ్ మాఫియా దందా.. వేల కోట్ల అక్రమాలపై సంచలన ఆరోపణలు

తెలంగాణలో మైనింగ్ మాఫియా దందాపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. గత ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని మైనింగ్ శాఖ ప్రాథమిక విచారణలో వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. గ్రానైట్, ఇసుక, క్వార్జ్ అక్రమ తవ్వకాలు, నకిలీ వేబిల్లులు, తప్పుడు నివేదికలతో భారీ స్థాయిలో ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లోని కొన్ని ప్రముఖ గ్రానైట్ క్వారీల్లో నిబంధనలకు విరుద్ధంగా వేల టన్నుల గ్రానైట్ అక్రమ రవాణా జరిగినట్లు…

Read Full News