నీట్ లీకేజీ నిరసనలు: మైనర్ విద్యార్థుల విడుదలకు సుప్రీంకోర్టు ఆదేశం.. రాష్ట్రాలకు నోటీసులు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై జరిగిన నిరసనల నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నిరసనల్లో పాల్గొని అరెస్టు లేదా నిర్బంధానికి గురైన మైనర్ విద్యార్థులు, అలాగే నేర చరిత్ర లేని విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని మంగళవారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. శాంతియుతంగా ఆందోళన చేసిన విద్యార్థులపై అనవసరంగా కఠిన చర్యలు తీసుకోరాదని స్పష్టం చేసింది. ఢిల్లీలోని జంతర్ మంతర్తో పాటు పలు రాష్ట్రాల్లో నీట్ లీకేజీకి…

