రైతు బంధు, 24 గంటల ఉచిత కరెంట్, రైతు బీమాను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది” – బీఆర్ఎస్ విమర్శలు

తెలంగాణలో రైతుల సంక్షేమం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేసింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసిన రైతు సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా బలహీనపరుస్తూ రైతులను ఇబ్బందుల్లోకి నెట్టిందని ఆరోపించింది. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని పేర్కొంటూ, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మూడు గంటల విద్యుత్ సరిపోతుందనే దిశగా రైతులను తీసుకెళ్తోందని విమర్శించింది. రైతు కమిషన్ ఛైర్మన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, రైతు డిస్కం…

Read Full News

కేంద్రం కొన్నంతే ధాన్యం కొనుగోలు.. రైతుల్లో ఆందోళన రేపుతున్న సర్కార్ నిర్ణయం

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి కేంద్ర ప్రభుత్వం ఎంత మేర ధాన్యం, ఇతర పంటలను కొనుగోలు చేస్తే అంత మేరకే రాష్ట్రం కూడా రైతుల నుంచి సేకరణ చేపడుతుందని ప్రకటించడం రైతుల్లో ఆందోళనకు దారితీస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఇన్ఫార్మల్ క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రులు వెల్లడించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రం నిర్దేశించిన విధి విధానాల ప్రకారం పంటల కొనుగోళ్లు…

Read Full News

కౌలు రైతుల కష్టాలు తీరేదెప్పుడు? యూరియా కొరత, నష్టపరిహారం లేక అన్నదాతల ఆవేదన

కష్టం కౌలు రైతులది.. భరోసా భూ యజమానులదేనా? యూరియా కోసం మళ్లీ లైన్ల బాటలో అన్నదాతలు తెలంగాణలో కౌలు రైతుల పరిస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోంది. పంట పండించేది కౌలు రైతులే అయినప్పటికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు, నష్టపరిహారం, బ్యాంకు రుణాలు మాత్రం ఎక్కువగా భూ యజమానులకే పరిమితమవుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కష్టమంతా కౌలు రైతులదైతే, భరోసా మాత్రం భూ యజమానులకే దక్కుతోందా అనే ప్రశ్న ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. కౌలు రైతుల గుర్తింపు సాధన…

Read Full News

వరి కొనుగోళ్లలో తెలంగాణ నంబర్-1.. రైతుల చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం హామీ

తెలంగాణలో వరి కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తోందని, రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపిస్తూ, దేశంలోనే వరి ఉత్పత్తి మరియు వరి కొనుగోళ్లలో తెలంగాణ రాష్ట్రం నంబర్-1 స్థానంలో ఉందని పేర్కొంది. ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి, కొనుగోళ్లు నమోదయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు…

Read Full News

రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోంది: కొనుగోలు కేంద్రాల వద్ద బీఆర్ఎస్ ఆందోళన

రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆరోపిస్తూ భారత రాష్ట్ర సమితి నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన బీఆర్ఎస్ నాయకులు రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుబంధు సకాలంలో ఇవ్వలేదని, అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి రైతులను మోసం చేసిందని ఆరోపించారు. వరి, మొక్కజొన్న, తెల్లజొన్న, శనిగలు వంటి పంటల…

Read Full News

రైతుల ధాన్యం తడిసిపోతుంటే ప్రభుత్వం నిద్రలోనే – కొనుగోలు కేంద్రాల తాత్సారం పై బీజేపీ ఆగ్రహం

రాష్ట్రంలో ఇప్పటికే పంటలు సిద్ధంగా ఉండగా, ఇంకా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం రైతుల్లో ఆగ్రహాన్ని రేపుతోంది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షాలతో రైతుల ధాన్యం తడిసి ముద్దయిపోయింది. అయినా సరే, రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ప్రొక్యూర్‌మెంట్‌ సెంటర్లను ప్రారంభించకపోవడం రైతులపై నిర్లక్ష్యాన్ని చూపుతోందని భారతీయ జనతా పార్టీ నాయకులు ఆరోపించారు. బీజేపీ నాయకులు వ్యాఖ్యానిస్తూ — “రైతుల పంటలు తడిసిపోతుంటే ప్రభుత్వం మాత్రం ఎలక్షన్ రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తోంది….

Read Full News