నీట్ పేపర్ లీక్‌పై కేంద్రం కీలక చర్చలు.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ఇంకా నిర్ణయం లేదు, విద్యా వ్యవస్థలో సంస్కరణలపై విద్యార్థుల డిమాండ్

నీట్ (NEET) పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు నిరసనలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘాల ప్రతినిధులతో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ కాన్స్టిట్యూషనల్ క్లబ్ ఆఫ్ ఇండియాలో సమావేశమయ్యారు. సమావేశంలో విద్యార్థి సంఘాలు మూడు ప్రధాన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వానికి వినిపించాయి. అందులో రెండు డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తామని తెలిపింది….

Read Full News

రాహుల్, ప్రియాంక గాంధీ అరెస్టులపై హైదరాబాద్‌లో కాంగ్రెస్ ఆందోళన.. నీట్ వివాదంపై కేంద్రాన్ని టార్గెట్ చేసిన నేతలు

హైదరాబాద్: ఢిల్లీలో నీట్ పరీక్షకు సంబంధించిన నిరసనల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటనపై హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ శాంతియుత నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. రాజ్‌భవన్ ముట్టడికి పిలుపునిస్తూ టీపీసీసీ నేతలు, విద్యార్థి సంఘాలు, కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. నిరసనలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, నీట్ పరీక్ష నిర్వహణలో జరిగిన అవకతవకలు, పేపర్ లీక్ ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ…

Read Full News

నీట్ యూజీ రద్దుపై రేవంత్ రెడ్డి ఫైర్.. “మోదీ సర్కార్ పూర్తిగా ఫెయిల్”

దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన నీట్ యూజీ 2026 పరీక్ష రద్దుపై తెలంగాణ సీఎం Revanth Reddy తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వ వైఫల్యాల కారణంగానే నీట్ యూజీ పరీక్షను రద్దు చేయాల్సి వచ్చిందని ఆయన విమర్శించారు. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నియంతృత్వ, నిరంకుశ నిర్ణయమని మండిపడ్డారు. గత పదేళ్లలో ప్రధాని Narendra Modi హయాంలో దేశవ్యాప్తంగా 93 పేపర్ లీకేజీలు జరిగాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ పరిణామాలతో రెండు కోట్లకు…

Read Full News

నీట్ పేపర్ లీక్ కలకలం.. 22 లక్షల విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడారా?

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీక్ వ్యవహారం ఇప్పుడు విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యా వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు ఎంతో కష్టపడి, ఎన్నో ఆశలతో రాసిన పరీక్ష ఒక్కసారిగా రద్దవ్వడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. రాజస్థాన్‌లో పేపర్ లీక్ జరిగినట్టు వచ్చిన నివేదికల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నీట్ పరీక్షను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై సమగ్ర…

Read Full News

నీట్ పరీక్షల వివాదం మళ్లీ రగిలింది.. ఎన్టీఏ రద్దు చేయాలంటూ ఎస్ఎఫ్ఐ డిమాండ్

దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్షలపై మరోసారి వివాదం చెలరేగింది. నీట్ పరీక్ష నిర్వహణలో భారీ లోపాలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తీవ్ర విమర్శలు చేశారు. మే 3న దేశవ్యాప్తంగా జరిగిన నీట్ పరీక్షను రద్దు చేయాలని, అలాగే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ను పూర్తిగా రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా సుమారు 22 లక్షలకుపైగా విద్యార్థులు ఈ పరీక్ష రాశారని, ఇప్పుడు పరీక్ష రద్దు నిర్ణయం…

Read Full News