ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు రానున్నాయా? ఆర్బీఐ ప్రతిపాదనలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ట్రయల్ ప్రింటింగ్కు సిద్ధం
దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీ నోట్ల మన్నికను మరింత పెంచేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా పాలిమర్ (ప్లాస్టిక్ ఆధారిత) కరెన్సీ నోట్లను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టే ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు సమాచారం. ప్రారంభ దశలో ₹10, ₹20 నోట్లను ట్రయల్ ప్రాతిపదికన ముద్రించి క్షేత్రస్థాయిలో పరీక్షించనున్నారు. ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంటులో వెల్లడించిన వివరాల ప్రకారం, ఒక్కో డినామినేషన్కు 100 కోట్ల చొప్పున…

