కరీంనగర్ దాడి ఘటన.. నాయకుల మాటలతో కార్యకర్తల భవిష్యత్తు బలి?

కరీంనగర్‌లో చోటుచేసుకున్న బిఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడి ఘటన తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన డ్రగ్స్ వ్యాఖ్యలు, వాటికి బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఘాటు కౌంటర్ తర్వాత రాజకీయ ఉద్రిక్తత ఒక్కసారిగా హింసాత్మకంగా మారిన పరిస్థితి కనిపించింది. ఈ ఘటనలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంపై దాడి జరగడం, వాహనాలు ధ్వంసం కావడం, రాళ్లు కర్రలతో దాడులు…

Read Full News

ముఖ్యమంత్రి స్థాయిలో గన్‌మన్‌పై దాడి దారుణం – కాంగ్రెస్ నేతల తీరు తీవ్ర విమర్శలపాలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గన్‌మన్‌పై చేయి చేసుకున్న ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా ప్రవర్తించడం సిగ్గుచేటని పలువురు తీవ్రంగా విమర్శిస్తున్నారు. అధికారం చేతికి వచ్చాక ఆగ్రహం, అసహనం పెరిగి ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయా అనే ప్రశ్నలు ప్రజల్లో ఉత్పన్నమవుతున్నాయి. ముఖ్యమంత్రి గన్‌మన్‌ను కొట్టడం ఏ రకమైన ఆనందమని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. గ్రామ స్థాయిలో ఓడిపోయిన సర్పంచులు ప్రత్యర్థులపై దాడులు చేస్తున్న పరిస్థితులకు, ముఖ్యమంత్రి ప్రవర్తనే ప్రేరణగా…

Read Full News

బీజేపీ పార్టీ కార్యాలయంలో ఘర్షణ: మీడియాపై దాడి, నేతల మధ్య ఆధిపత్య పోరు

బీజేపీ పార్టీ కార్యాలయంలో తీవ్ర ఉద్రిక్తత: మీడియాపై దాడి, నేతల మధ్య బహిరంగ ఘర్షణ బీజేపీ పార్టీ కార్యాలయం ఒక్కసారిగా రణరంగాన్ని తలపించింది. ఆరో వార్డు అంశం, పార్టీ కార్యక్రమాల నిర్వహణ విషయంలో మొదలైన వివాదం చివరకు నేతలు–కార్యకర్తల మధ్య బహిరంగ ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో మీడియాపై దాడి జరగడం తీవ్ర కలకలం రేపింది. పార్టీ కార్యాలయంలో సమావేశం జరుగుతున్న సమయంలో కొందరు నేతలు ఒకరిపై ఒకరు మాటల దాడికి దిగారు. మాటల వాగ్వాదం కాస్తా…

Read Full News

నల్గొండ బీజేపీలో ఆధిపత్య పోరు: వాజ్‌పేయి జయంతి వేదికగా నాయకుల మధ్య ఘర్షణ

నల్గొండ బీజేపీలో ఆధిపత్య పోరు: వాజ్‌పేయి జయంతి వేదికగా నాయకుల మధ్య ఘర్షణ నల్గొండ జిల్లాలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి జయంతి సందర్భంగా గురువారం నల్గొండలో నిర్వహించిన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం ఘర్షణకు దిగారు. చొక్కాలు పట్టుకోవడం, కుర్చీలు విసరుకోవడం, ఒక దశలో పిడిగుద్దుల వరకు పరిస్థితి చేరుకోవడంతో అక్కడ…

Read Full News

పోలీసులు స్పందించకపోతే మేమే డ్యూటీ చేయాల్సి వస్తుంది: రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక

రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా పోలీస్ యంత్రాంగానికి మరోసారి హెచ్చరిక చేస్తున్నామని రాజకీయ నేతలు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినప్పటికీ, రాష్ట్రంలో అరాచక పరిస్థితులు కొనసాగుతున్నాయని తీవ్ర విమర్శలు చేశారు. నల్లగొండ జిల్లాలో మల్లయ్య యాదవ్ హత్య ఉదంతాన్ని గుర్తు చేస్తూ, మొదటి విడత పోలింగ్‌కు ముందే దుర్మార్గంగా హత్య జరిగిందని ఆరోపించారు. అంతేకాకుండా నల్లగొండ నియోజకవర్గంలో ఓ బీసీ సోదరుడిని నామినేషన్ వేయొద్దంటూ బెదిరించి, దాడి చేసి, చివరకు కిడ్నాప్ చేసి…

Read Full News

నామినేషన్ వేయమంటే భర్తను కిడ్నాప్ చేశారు” — మహిళ అభ్యర్థి కన్నీటి వేదన

మా ఆయన బయటకు వెళ్లిన 10 నిమిషాలకే ఫోన్ స్విచ్‌ఆఫ్ అయింది. ఆ క్షణం నుంచి నా జీవితం భయంతోనే గడిచింది.” — అంటూ కన్నీరుముక్కలు పెట్టుకున్నారు నామినేషన్ వేసిన మహిళా అభ్యర్థి. సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానిక రాజకీయాల్లో కలకలం రేపింది. “మేము ముందే బ్యాంక్ అకౌంట్లు తెరిచాం, పేపర్లు రెడీగా పెట్టుకున్నాం. చాలా సంతోషంగా నామినేషన్ వేయడానికి బయలుదేరాం. కానీ 9:10కి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్…

Read Full News

బీసీ రిజర్వేషన్ల హామీ ఎక్కడ? కామారెడ్డిలో ఉద్రిక్తత – మాజీ మావోయిస్టు YouTube ఇంటర్వ్యూతో దారుణ హత్య!

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తతలు, వివాదాలు తలెత్తుతున్నాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేయకపోవడంతో విమర్శలు చెలరేగుతున్నాయి. బీసీ సంఘాలు, ప్రజా సంస్థలు వీలైనంత త్వరగా ఆ హామీ నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాయి. అదే సమయంలో కామారెడ్డి పట్టణంలో జాగృతి కార్యకర్తలు రైలురోకో ప్రయత్నం చేయగా, పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటనలో జాగృతి అధ్యక్షురాలు కవిత స్వల్ప గాయాలతో ఆసుపత్రికి తరలించబడ్డారు. ఆమె అరెస్టు, పోలీసులు వ్యవహరించిన…

Read Full News

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో రిగ్గింగ్ ఆరోపణలు – ప్రజాస్వామ్యం ఎక్కడ?

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో జరిగిన పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఓటేయని వారిని డబ్బులు తిరిగి ఇవ్వమని పార్టీ కార్యకర్తలు ఒత్తిడి చేయడం, బూత్ కమిటీ సభ్యులు ఓటర్ల లిస్టులు పరిశీలించి ఎవరు ఓటు వేయలేదో గుర్తించడం వంటి ఘటనలు తీవ్రంగా విమర్శించబడుతున్నాయి. ఒకే ఇంట్లో 18 ఓట్లు ఉంటే కేవలం నలుగురే ఓటు వేసారన్న సమాచారం బయటకు రావడం, మిగిలినవారిపై రికవరీ ప్రయత్నాలు చేయడం ఎన్నికల ప్రక్రియపై తీవ్ర అనుమానాలు కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రిగ్గింగ్…

Read Full News