NEET పేపర్ లీకేజ్పై ఆందోళనలు.. విద్యార్థులతో చర్చలకు కేంద్రం సిద్ధం, దేశవ్యాప్త నిరసనలకు పిలుపు
NEET పేపర్ లీకేజ్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు చర్యలు తీసుకున్నారంటూ ఆరోపణలు వెలువడిన నేపథ్యంలో, పలు విద్యార్థి సంఘాలు దేశవ్యాప్తంగా శాంతియుత నిరసనలకు పిలుపునిచ్చాయి. ప్రతి జిల్లా కేంద్రంలో ఒకరోజు నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని, విద్యార్థి సంఘాలు, పౌరసంఘాలు, ఇతర సంస్థలు ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరాయి. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానించింది. కేంద్ర…

