ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు: మేడారంలో క్యాబినెట్ కీలక నిర్ణయాలు

ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు: క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ మేడారంలో చారిత్రకంగా 27వ మంత్రివర్గ భేటీ – కీలక నిర్ణయాలు వెల్లడి తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆదివారం ములుగు జిల్లా మేడారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన 27వ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహచర మంత్రులు కోమటరెడ్డి వెంకట్ రెడ్డి, దాసరి సీతక్కలతో కలిసి మీడియాకు…

Read Full News

ప్రభుత్వ ఉద్యోగులు, టెండర్లు, మంత్రుల మధ్య విభేదాలు.. కాంగ్రెస్ పాలనపై ఘాటు విమర్శలు

ప్రభుత్వ ఉద్యోగుల నుంచి మంత్రుల వరకూ: తెలంగాణ పాలనపై పెరుగుతున్న ప్రశ్నలు తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు ఈ మధ్య రాజకీయ చర్చల్లో ప్రధాన అంశంగా మారాయి. డీఏ (DA) అంశంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తున్నాయి. ఇచ్చిన డీఏకే 36 నెలల గడువు పెట్టడం, ఎన్నికల భయంతో ఉద్యోగులను మౌనంగా ఉంచే ప్రయత్నం జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి మరింత దయనీయంగా ఉందని…

Read Full News

మేడారం జాతర ముందే భక్తజనంతో కిక్కిరిసిన అడవులు.. రాజకీయ వేదికపై వేడెక్కిన వ్యాఖ్యలు

మేడారం వైపు భక్తజనం పోటెత్తింపు – రాజకీయ రంగంలో వేడి వ్యాఖ్యలు మేడారం మహాజాతరకు ఇంకా 12 రోజులు మాత్రమే ఉండగానే భక్తజనం భారీగా తరలివస్తోంది. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు, అనంతరం సమ్మక్క–సారలమ్మ దర్శనానికి క్యూలలో నిలుస్తున్నారు. గట్టమ్మ ఆలయం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ తీవ్రంగా మారింది. భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని కొంతమంది స్థానికులు బకెట్ వేడినీళ్లను రూ.50కి విక్రయించడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా, ఖమ్మంలో జరగనున్న కమ్యూనిస్టు పార్టీ…

Read Full News

ట్రాఫిక్ చలాన్లపై ఇక డిస్కౌంట్లు లేవు: నేరుగా బ్యాంక్ ఖాతాల నుంచే వసూలు చేయాలన్న సీఎం రేవంత్ ఆదేశాలు

ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై ఇకపై ఎలాంటి రాయితీలు ఉండవని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్లు ఇవ్వకూడదని, చలాన్లు పడిన వెంటనే వాహన యజమానుల బ్యాంక్ ఖాతాల నుంచే నేరుగా జరిమానా మొత్తాన్ని వసూలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ యూసఫ్‌గూడలోని విజయభాస్కర్ ఇండోర్ స్టేడియంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రతా కార్యక్రమంలో సీఎం పాల్గొని ఈ కీలక…

Read Full News

మేడారంలో చరిత్రాత్మక క్యాబినెట్ భేటీ: 18న మంత్రివర్గ సమావేశం, మున్సిపల్ ఎన్నికలపై కీలక నిర్ణయాలు?

తెలంగాణ చరిత్రలో తొలిసారిగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం హైదరాబాద్‌కు దూరంగా, ములుగు జిల్లా మేడారంలో నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 18న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమ్మక్క–సారలమ్మ మేడారం జాతర ప్రాంతంలో క్యాబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ క్యాబినెట్ సమావేశంలో ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి డెడికేటెడ్ కమిషన్ నివేదికకు ప్రభుత్వ ఆమోదం తెలిపే అవకాశం ఉందని…

Read Full News

సెక్రెటేరియట్‌లోనే సస్పెన్స్ థ్రిల్లర్.. సినిమా టికెట్ రేట్ల వెనుక కనిపించని శక్తి ఎవరు? – హరీష్ రావు ఫైర్

రాష్ట్రంలో ఇప్పుడు థియేటర్ల కంటే సచివాలయంలోనే పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తోందని బీఆర్‌ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్ ధరల పెంపు వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఒకవైపు సినిమా టికెట్ ధరలు పెంచుతూ జీవోలు విడుదలవుతుంటే, మరోవైపు ఆ శాఖకు బాధ్యత వహించాల్సిన సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తనకు ఈ…

Read Full News

సెక్రెటేరియట్‌లోనే సస్పెన్స్ థ్రిల్లర్.. సినిమా టికెట్ రేట్ల వెనుక కనిపించని శక్తి ఎవరు? – హరీష్ రావు ఫైర్

రాష్ట్రంలో ఇప్పుడు థియేటర్ల కంటే సచివాలయంలోనే పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తోందని బీఆర్‌ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్ ధరల పెంపు వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఒకవైపు సినిమా టికెట్ ధరలు పెంచుతూ జీవోలు విడుదలవుతుంటే, మరోవైపు ఆ శాఖకు బాధ్యత వహించాల్సిన సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తనకు ఈ…

Read Full News

రేవంత్ రెడ్డికి గెలుపా..? జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తేలిపోతుంది: బీఆర్ఎస్ ఫైర్

రేవంత్ రెడ్డి నిజంగా గెలవాలనుకుంటున్నారా? లేక మాటలకే పరిమితమా? అన్న ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలే ప్రజల తీర్పు ఏమిటో స్పష్టంగా చెప్పబోతున్నాయని బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ నాయకులు జీహెచ్ఎంసీపై తమకే విజయం ఖాయమంటూ చేస్తున్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ తీవ్రంగా స్పందించింది. “సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 60 శాతం వచ్చినా, మాకు 40 శాతం వచ్చింది. బీజేపీ పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు….

Read Full News

ఆ హీరోయిన్‌కు కేటీఆర్ వంద కోట్లు ఇచ్చారంటూ కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం సంచలన ఆరోపణలు

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ (పీసీపీ) నాయకుడు గజ్జెల కాంతం సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన, కేటీఆర్‌పై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ రాజకీయ వర్గాల్లో కలకలం రేపారు. గజ్జెల కాంతం మాట్లాడుతూ, 2022 జనవరి 24న ఓ కాంట్రాక్టర్, జ్యువెలరీ షాప్ యజమాని ఖాతాల నుంచి ఓ హీరోయిన్‌కు కేటీఆర్ రూ.100 కోట్లు పంపించారని ఆరోపించారు. ఆ డబ్బు మూలం ఏమిటో ప్రజలకు సమాధానం చెప్పాలని…

Read Full News

సినిమా టికెట్ల వివాదంపై సీఎం భేటీకి నిర్మాతలు.. నీటి వివాదాలపై ‘వివాదాలు కాదు.. నీళ్లే కావాలి’ అని రేవంత్ రెడ్డి స్పష్టం

సంక్రాంతి పండుగ నేపథ్యంలో తెలంగాణలో సినిమా టికెట్ల ధరల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాతలు, హీరోలు, దర్శకులు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవనున్నారు. సినిమా టికెట్ల ధరలు పెంచుకునేందుకు అవకాశం కల్పించాలని, బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలపై విధించిన పరిమితులను సడలించాలని వారు ప్రభుత్వాన్ని కోరనున్నట్లు సమాచారం. ప్రధానంగా ‘రాజాసాబ్’ సినిమాకు సంబంధించి తెలంగాణలో బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలుకు అనుమతి లభించకపోవడం, అలాగే జీఓ…

Read Full News