రెండేళ్ల పాలన విజయాలపై అసెంబ్లీ చర్చా? సీఎం రేవంత్ ఆలోచనలపై విమర్శలు

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో, ప్రభుత్వ పాలనలో సాధించిన విజయాలను అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరించాలనే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నెలాఖరులో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి, రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలను చర్చించాలన్న ఆలోచనపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఈ ప్రతిపాదనపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. రెండు సంవత్సరాల పాలనలో ప్రభుత్వం సాధించిన “విజయాలు” ఏంటన్న ప్రశ్నలు ప్రజల్లో నుంచి వస్తున్నాయి….

Read Full News

ఫుట్‌బాల్ షోతో 200 కోట్ల ప్రశ్నలు: రేవంత్ రెడ్డి ప్రచారంపై తీవ్ర విమర్శలు

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఫుట్‌బాల్ షో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్న ఫుట్‌బాల్ కార్యక్రమం చుట్టూ భారీగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఆడలేని వ్యక్తి ఆడుతున్నట్టు బిల్డప్ ఇవ్వడం, పక్కన టీమ్ బాల్ తీసుకొచ్చి ఇస్తే ఒకచోట నిలబడి తన్నడం తప్ప నిజమైన ఆట లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఫుట్‌బాల్ ఈవెంట్‌కు సంబంధించి సుమారు 200 కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు అయిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఖర్చుపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానం…

Read Full News

పంచాయతీ ఎన్నికల తర్వాత రాజకీయ వేడి: బీఆర్‌ఎస్ పునరుజ్జీవనా? రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ షోపై ప్రశ్నలు, 19వ తేదీపై ఉత్కంఠ

గ్రామాలకు వెళ్లి ఓటు వేసి తిరిగి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా రహదారులు కిటకిటలాడాయి. హైదరాబాద్‌లో ఎన్నికల పట్ల కనిపించని ఆసక్తి, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం “మా ఊరు – మా సర్పంచ్” అనే భావోద్వేగంగా మారింది. ఇది ప్రజాస్వామ్యానికి మెచ్చుకోదగిన అంశమే. అధికార పార్టీ సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పైచేయి సాధిస్తుందన్న అంచనాల మధ్య కూడా, బీఆర్‌ఎస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోలేదనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ గ్రామస్థాయిలో బీఆర్‌ఎస్ గట్టి పోటీ…

Read Full News

రవీంద్రభారతిలో విగ్రహ వివాదం: తెలంగాణ సంస్కృతి అవమానమంటూ సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్ర ఆగ్రహం

తెలంగాణలో రవీంద్రభారతిలో ప్రతిపాదిత విగ్రహావిష్కరణ అంశం తీవ్ర రాజకీయ–సాంస్కృతిక వివాదానికి దారి తీసింది. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కళాకారులు, కవులు, మేధావులు, జర్నలిస్టులు తీవ్రంగా మండిపడుతున్నారు. రవీంద్రభారతి అనేది కేవలం ఒక భవనం కాదు, తెలంగాణ ఆత్మగౌరవానికి, సాంస్కృతిక పోరాటాలకు ప్రతీక అని వారు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో కానీ, కరువు–వలసలు–ఆత్మహత్యల వంటి ప్రజా సమస్యల సమయంలో కానీ తెలంగాణ ప్రజల కోసం గొంతెత్తని ఒక కమర్షియల్ ఆర్టిస్టుకు…

Read Full News

5 లక్షల కోట్ల భూ స్కామ్ నుంచి ఫోన్ ట్యాపింగ్ వరకూ – కాంగ్రెస్ సర్కార్‌పై చీకోటి ప్రవీణ్ సంచలన ఆరోపణలు

తెలంగాణలో భారీ స్థాయిలో 5 లక్షల కోట్ల భూ స్కామ్ నడుస్తోందని హిందుత్వవాది చీకోటి ప్రవీణ్ సంచలన ఆరోపణలు చేశారు. ఇండస్ట్రియల్ భూములను ఔటర్ రింగ్ రోడ్ అవతలికి తరలించే నెపంతో డబుల్ రిజిస్ట్రేషన్ విధానాన్ని తీసుకువచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ మాఫియాకు దారితీసిందని ఆయన విమర్శించారు. ఇండస్ట్రియల్ భూములను రెసిడెన్షియల్‌గా మార్చుకునే వెసులుబాటు వెనుక పెద్ద ఎత్తున భూ దందా జరుగుతోందన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ అవసరాల కోసమే ఈ స్కామ్‌ల ద్వారా డబ్బులు వసూలు…

Read Full News

సత్యానికి–అసత్యానికి మధ్య పోరాటం: ఓట్ చోరీపై కాంగ్రెస్ మెగా ర్యాలీ, ఈసీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు

దేశంలో సత్యానికి–అసత్యానికి మధ్య పోరాటం నడుస్తోందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింస మార్గంలోనే పోరాడి నరేంద్ర మోదీ–ఆర్ఎస్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ డీఎన్‌ఏలోనే ఓట్ చోరీ ఉందని, కాంగ్రెస్ డీఎన్‌ఏలో మాత్రం సత్యం, అహింస ఉన్నాయని రాహుల్ గాంధీ అన్నారు. ఆదివారం న్యూఢిల్లీలోని రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన “ఓట్ చోరీ – గద్దీ చోడ్”…

Read Full News

త్వరలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ?: పొన్నం, కొండా సురేఖ తొలగింపు వార్తలపై మహేష్ గౌడ్ స్పష్టీకరణ

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందనే ప్రచారం నేపథ్యంలో, మంత్రి పొన్నం ప్రభాకర్, కొండా సురేఖలను మంత్రివర్గం నుంచి తొలగిస్తారనే వార్తలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇద్దరూ బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రులని, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నేతలని ఆయన కితాబు ఇచ్చారు. అయితే శాఖల మార్పులు లేదా మంత్రివర్గంలో ఇతర మార్పులు ఉంటాయా అనే అంశంపై…

Read Full News

టాస్ మాత్రమే వేశాను.. అసలైన టెస్ట్ మ్యాచ్ ముందుంది: కాంగ్రెస్, బీజేపీ నేతలపై కవిత సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి పుట్టేలా బీఆర్ఎస్ నేత, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఇంతకాలం బయట పెడితే తెలంగాణ సిగ్గుపోతుందనే ఊరుకున్నా. ఇప్పటివరకు టాస్ మాత్రమే వేశాను. అసలైన టెస్ట్ మ్యాచ్ ఇంకా ముందుంది” అంటూ కాంగ్రెస్, బీజేపీ నేతలను ఉద్దేశించి ఘాటైన హెచ్చరికలు చేశారు. శుక్రవారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కవిత.. తన భర్తపై నిరాధార ఆరోపణలు చేస్తూ దుష్ప్రచారం సాగిస్తే తీవ్రంగా ప్రతిస్పందిస్తానని…

Read Full News

ఉప్పల్‌లో మెస్సీ సందడి: గ్లోబల్ ఇమేజ్ పేరుతో ప్రజాధన దుర్వినియోగమా?

ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్‌కు రావడంతో రాష్ట్రంలో ఫుట్‌బాల్ ఫీవర్ నెలకొంది. శనివారం ఉప్పల్ స్టేడియంలో జరిగే ప్రత్యేక ఈవెంట్‌ను చూసేందుకు దేశవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కోల్కత్తా పర్యటన అనంతరం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునే మెస్సీ, అక్కడి నుంచి తాజ్ ఫలక్నామా ప్యాలెస్‌లో జరిగే ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అయితే ఈ ఈవెంట్ చుట్టూ ఉత్సాహంతో పాటు తీవ్ర వివాదం కూడా చెలరేగింది. మెస్సీతో సెల్ఫీ దిగాలంటే ఒక్కొక్కరికి…

Read Full News

గ్లోబల్ సమ్మిట్ నిర్వహణపై రేవంత్ రెడ్డికి రాజకీయ వర్గాల విమర్శలు, పరిపాలనపై ప్రశ్నలు

తెలంగాణలో జరిగిన ఫోర్త్ సిటీ గ్లోబల్ సమ్మిట్ పై ఇప్పుడు తీవ్ర రాజకీయ చర్చ మొదలైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహణ శైలి, కార్యక్రమంలో ఏర్పాట్లు, మీడియా వ్యాఖ్యలు, అతిథుల సమన్వయం వంటి అంశాలపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమిట్ సందర్భంలో రేవంత్ రెడ్డి చేసిన ఇంగ్లీష్ వ్యాఖ్యలు, ప్రసంగం, రాజకీయ ప్రత్యర్థుల చేత విమర్శలకు గురయ్యాయి. “ఇంగ్లీష్ రాకపోవడం తప్పు కాదు కానీ పరిపాలన మాత్రం రావాలి” అని ప్రతిపక్షం వ్యాఖ్యానించింది. ముఖ్యమంత్రి కేవలం కుర్చీలో…

Read Full News