తెలంగాణలో 22A భూముల కలకలం.. అసలు ఏంటి ఈ నిషేధిత జాబితా? లక్షల ఎకరాలపై ఎందుకీ వివాదం?

హైదరాబాద్: తెలంగాణలో గత కొంతకాలంగా భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన 22A నిషేధిత జాబితా వ్యవహారం తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఒకప్పుడు ప్రభుత్వ భూములు, వివాదాస్పద భూములు, అసైన్డ్ ల్యాండ్స్, దేవాదాయ, వక్ఫ్ తదితర భూముల రక్షణ కోసం ఉపయోగించిన నిబంధన ఇప్పుడు సామాన్య భూయజమానులకు కూడా ఆందోళన కలిగించే అంశంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో తమకు స్పష్టమైన పట్టాలు, పాస్‌బుక్స్, పహాణీలు, రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నప్పటికీ భూములు నిషేధిత జాబితాలో కనిపిస్తున్నాయని భూయజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు….

Read Full News

భూదందాల ఆరోపణలు.. డిప్యూటీ కలెక్టర్ రాము నాయక్ సస్పెన్షన్, ఇద్దరు సూపరింటెండెంట్లపై చర్యలు

తెలంగాణ రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న రాము నాయక్‌పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. గతంలో హౌసింగ్ బోర్డులో డిప్యూటేషన్‌పై భూసేకరణ అధికారిగా పనిచేసిన సమయంలో భూదందాలు, అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలడంతో ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు మంత్రి Ponguleti Srinivasa Reddy ప్రకటించారు. రాము నాయక్‌కు సహకరించిన సూపరింటెండెంట్ వివేకానందను విధుల నుంచి శాశ్వతంగా తొలగించగా, మరో సూపరింటెండెంట్ బోనా నాయక్‌ను సస్పెండ్ చేసినట్లు మంత్రి వెల్లడించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో…

Read Full News