కాక్రోచ్ జనతా పార్టీ ధర్ణతో కేంద్రానికేనా షాక్? తెలంగాణ విద్యా వ్యవస్థపై కూడా లేవాల్సిన ప్రశ్నలివే!

హైదరాబాద్: నీట్, సీబీఎస్ఈ పరీక్షల పేపర్ లీకేజీలు, పెరుగుతున్న విద్యా ఫీజులు, నిరుద్యోగ యువత భవిష్యత్తుపై నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో “కాక్రోచ్ జనతా పార్టీ” పేరిట కొనసాగుతున్న ఉద్యమం ఇప్పుడు హైదరాబాద్‌కు చేరుకుంది. ఆదివారం ఇందిరా పార్క్ ధర్ణా చౌక్ వద్ద విద్యార్థులు, నిరుద్యోగ యువత, సామాజిక కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసనలో ప్రధానంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో వరుసగా జరుగుతున్న…

Read Full News

టీజీపీఎస్సీ అప్లికేషన్ ఫీజులపై 400% పెంపు.. నిరుద్యోగ యువతకు రేవంత్ సర్కార్ భారీ షాక్

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగ యువతకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు అదే నిరుద్యోగులపై అప్లికేషన్ ఫీజుల రూపంలో అదనపు భారం మోపిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) తాజాగా విడుదల చేసిన ఐదు ఉద్యోగ నోటిఫికేషన్లలో దరఖాస్తు రుసుములను భారీగా పెంచడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గతంలో…

Read Full News

కాక్రోచ్ జనతా పార్టీ: యువత ఆవేదనకు వేదికా? లేక సోషల్ మీడియా సంచలనమా?

దేశ రాజకీయాల్లో ఇటీవల వినిపిస్తున్న కొత్త పేరు “కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)”. పేరు వినగానే చాలామందికి ఇది రాజకీయ పార్టీనా, సోషల్ మీడియా ట్రెండా, లేక వ్యంగ్య ఉద్యమమా అనే సందేహం కలుగుతోంది. అయితే ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన భారీ నిరసన కార్యక్రమంతో ఈ పేరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వేలాది మంది విద్యార్థులు, నిరుద్యోగ యువకులు, ఉద్యోగార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని పరీక్షల నిర్వహణలో జరుగుతున్న అక్రమాలు, పేపర్ లీకేజీలు,…

Read Full News

నీట్ పరీక్షల వివాదం మళ్లీ రగిలింది.. ఎన్టీఏ రద్దు చేయాలంటూ ఎస్ఎఫ్ఐ డిమాండ్

దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్షలపై మరోసారి వివాదం చెలరేగింది. నీట్ పరీక్ష నిర్వహణలో భారీ లోపాలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తీవ్ర విమర్శలు చేశారు. మే 3న దేశవ్యాప్తంగా జరిగిన నీట్ పరీక్షను రద్దు చేయాలని, అలాగే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ను పూర్తిగా రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా సుమారు 22 లక్షలకుపైగా విద్యార్థులు ఈ పరీక్ష రాశారని, ఇప్పుడు పరీక్ష రద్దు నిర్ణయం…

Read Full News

రెవెన్యూ పేరుతో యూనివర్సిటీలను రియల్ ఎస్టేట్ హబ్‌లుగా మార్చే ప్రయత్నం: మౌలానా ఆజాద్ యూనివర్సిటీ విద్యార్థుల ఆగ్రహం

తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ జనరేషన్ పేరుతో విద్యాసంస్థల భూములపై కన్నేయడం తక్షణమే ఆపాలని మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులు, పరిశోధకులు డిమాండ్ చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలంటే క్యాంపస్ బయట చేయాలని, యూనివర్సిటీ భూములను తాకొద్దని ప్రభుత్వానికి స్పష్టమైన హెచ్చరిక ఇచ్చారు. ఇది కేవలం రొటీన్ సర్వే అంటూ టూరిజం మంత్రి చేసిన వ్యాఖ్యలను విద్యార్థులు ఖండించారు. ఇదే తరహా ప్యాటర్న్‌ను గతంలో బిజినెస్ స్కూల్స్, సెంట్రల్ యూనివర్సిటీల విషయంలో కూడా…

Read Full News

యూనివర్సిటీ భూములపై కాంగ్రెస్ కన్ను.. రియల్ ఎస్టేట్ బ్రోకర్‌లా ప్రభుత్వ వ్యవహారం: కేటీఆర్ తీవ్ర విమర్శలు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహారం ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్‌ను తలపిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. విద్యాసంస్థలు, యూనివర్సిటీల అభివృద్ధి కంటే భూములు లాక్కోవడంపైనే ప్రభుత్వ దృష్టి ఉందని మండిపడ్డారు. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ భూములపై ప్రభుత్వం కన్నేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ రెండున్నరేళ్లలో మారిపోతుందని, ఆ తర్వాత కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి యూనివర్సిటీ విస్తరణకు కావాల్సిన నిధులు రాష్ట్ర ప్రభుత్వమే…

Read Full News

తెలంగాణ తొలి మహిళా యూనివర్సిటీలో షూటింగ్స్ దందా?చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో భద్రతా లోపాలు, విద్యార్థినుల ఆందోళన

తెలంగాణలో తొలి మహిళా యూనివర్సిటీగా పేరుగాంచిన చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ (కోటి మహిళా కళాశాల) లో జరుగుతున్న పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. గతంలో ఎన్నో సినిమా షూటింగ్స్ జరిగినప్పటికీ, ఎప్పుడూ కూడా కళాశాల నడుస్తున్న సమయంలో షూటింగ్స్‌కు అనుమతి ఇవ్వలేదని పూర్వ విద్యార్థినులు స్పష్టం చేస్తున్నారు. కోటి మహిళా కళాశాల పూర్వ విద్యార్థినిగా, అలాగే అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) నాయకురాలిగా ఉన్న రోజుల్లో ఒక్క విద్యార్థినికీ అన్యాయం జరగకుండా చూసుకున్నామని…

Read Full News

సీఎం ఓయు పర్యటనకు ముందే విద్యార్థులు–నిరుద్యోగుల అరెస్టులు: “మేము సైలెంట్‌గా ఉన్నా ఎందుకు అరెస్టు?” అనడిగిన బాధ

సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ పర్యటనకు ముందు విద్యార్థులు, నిరుద్యోగులపై పోలీసులు చేపట్టిన అరెస్టులు తీవ్ర ఆగ్రహానికి దారితీశాయి. ఎలాంటి ఆందోళనలు చేయబోమని ముందురోజే ప్రకటించినప్పటికీ, అకస్మాత్తుగా పోలీసులు ఇళ్లకు చేరుకుని విద్యార్థులను స్టేషన్‌లకు తరలించడం వివాదాస్పదమైంది. ఒక నిరుద్యోగి యువతి ఆవేదన ఇలా వ్యక్తం చేసింది: “మేము సైలెంట్‌గా ఉన్న వాళ్లం. ఎలాంటి ప్లాన్ లేదు. వినతిపత్రం ఇస్తామంటే అదే చెప్పాం. మరి పైనుంచి ఆర్డర్లు లేకుండా పోలీసులు వస్తారా? నిన్ననే చెప్పారు, ‘న్యూసెన్స్…

Read Full News