ఈటల ఫ్లెక్సీ వివాదంలో ట్విస్ట్: బీజేపీ అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయా?

తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలపై మరోసారి చర్చకు దారితీసే పరిణామం చోటుచేసుకుంది. ఎంపీ ఈటల రాజేందర్, ఎంపీ ధర్మపురి అరవింద్‌లను లక్ష్యంగా చేసుకుని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వ్యవహారం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసు దర్యాప్తులో బీజేపీకి చెందిన నాయకుల పేర్లు వెలుగులోకి రావడంతో పార్టీ అంతర్గత పరిస్థితులపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. పోలీసుల దర్యాప్తు ప్రకారం ఫ్లెక్సీల వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ మాజీ వైస్ ప్రెసిడెంట్ జన్యావుల రామకృష్ణ…

Read Full News

తెలంగాణ రాజకీయాల్లో మార్పుల సంకేతాలు.. బీజేపీ, కాంగ్రెస్‌పై పెరుగుతున్న అసంతృప్తి

తెలంగాణ రాజకీయాల్లో భారీ మార్పులకు సంకేతాలు కనిపిస్తున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణ రాజకీయాలపై కూడా పడే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అంతర్గత పరిస్థితులు, ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. రాజకీయ విశ్లేషకుడు లింగాల రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ బలపడే అవకాశాలను పార్టీ నాయకులే దెబ్బతీస్తున్నారని వ్యాఖ్యానించారు. “బీజేపీని నిలబెట్టే ప్రయత్నం చేయాల్సిన నాయకులు, పార్టీని…

Read Full News

ఇంకెన్నాళ్లు ఇతరుల పెళ్లిళ్లకు డాన్సులు?”.. తెలంగాణ బీజేపీ నేతలపై రాజాసింగ్ ఫైర్

తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఇతర రాష్ట్రాల్లో బీజేపీ విజయాలపై సంబరాలు చేసుకుంటున్న నేతల తీరుపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఇంకెన్నాళ్లు ఇతరుల పెళ్లిళ్లకు వెళ్లి డాన్సులు చేస్తారు.. అసలు తెలంగాణలో బీజేపీని ఎప్పుడు అధికారంలోకి తీసుకొస్తారు?” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం స్పందించిన రాజాసింగ్.. అస్సాం, పుదుచ్చేరి, బెంగాల్‌లో గెలిచామని చెప్పుకుంటున్న…

Read Full News

తెలంగాణ బీజేపీ పతనం: పార్టీ మార్పులు, నిర్లక్ష్యం, నమ్మకం కోల్పోయిన నాయకత్వం

తెలంగాణలో బీజేపీ పరిస్థితి రోజురోజుకీ దయనీయంగా మారుతోంది. ఒకప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగాల్సిన పార్టీ, ఇప్పుడు అంతర్గత నిర్లక్ష్యం, నాయకత్వ వైఫల్యంతో తన స్థానం తానే కోల్పోతున్నట్టుగా కనిపిస్తోంది. ఇటీవలి పరిణామాల్లో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మళ్లీ బీఆర్ఎస్ గూటికి చేరబోతున్నారన్న వార్తలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. గతంలో బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన, బీజేపీలో చేరిన తర్వాత ఆశించిన స్థాయిలో గుర్తింపు, పదవులు రాకపోవడంతో తిరిగి సొంత గూటికే వెళ్లాలని…

Read Full News

శంషాబాద్‌లో 100 పడకల ఈఎస్ఐ హాస్పిటల్‌కు కేంద్ర ఆమోదం – లీకుల వ్యవహారం, బీజేపీ అంతర్గత విభేదాలపై కిషన్ రెడ్డి ఆగ్రహం

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం రాయికొండ గ్రామంలో 100 పడకల ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ఆసుపత్రి కోసం సుమారు రూ.16 కోట్ల విలువైన భూసేకరణకు కూడా అనుమతి ఇచ్చినట్లు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మాన్‌సుఖ్ మండవియా అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం సనత్‌నగర్ ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, నాచారం, రామచంద్రపురం, సిర్పూర్ కాగజ్‌నగర్, వరంగల్ ప్రాంతాల్లో ఈఎస్ఐ ఆసుపత్రులు కార్మికులకు వైద్య సేవలు…

Read Full News