2025లో కాంగ్రెస్ పాలనపై తీవ్ర అసంతృప్తి.. పంచాయతీలు, పాలనా వైఫల్యాలు, ప్రజల ప్రశ్నలు

2025 సంవత్సరం తెలంగాణ రాజకీయాల్లో అన్ని పార్టీలకూ చేదు అనుభవాలనే మిగిల్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బిఆర్ఎస్, బిజెపీల తర్వాత కాంగ్రెస్ పార్టీ పాలన కూడా తీవ్ర విమర్శలకు లోనైంది. ముఖ్యంగా కాంగ్రెస్‌లో బీసీ వర్సెస్ రెడ్డి రాజకీయాలు తెరపైకి రావడం, అంతర్గత పంచాయతీలు రోడ్ల మీదకు రావడం పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీశాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ పంచాయతీలకు “కేర్ ఆఫ్ అడ్రస్” అన్నట్టుగా పరిస్థితి మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక మంత్రి మరో…

Read Full News

మూడు కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ విభజన కరారు? 300 డివిజన్లతో ఎన్నికలకు సర్కార్ సన్నాహాలు

హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ)ని మూడు కార్పొరేషన్లుగా విభజించే ప్రక్రియ దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజగిరి అనే మూడు మున్సిపల్ కార్పొరేషన్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే కీలక స్థాయి సమావేశాలు నిర్వహించగా, విభజనపై పూర్తి నివేదిక ప్రభుత్వానికి అందినట్లు సమాచారం. ఔటర్ రింగ్ రోడ్ వరకు 2071 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను మూడు భాగాలుగా విభజించనున్నారు. ప్రస్తుతం…

Read Full News

GHMC మూడు కార్పొరేషన్లుగా విభజన..? హైదరాబాద్‌పై రేవంత్ సర్కార్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!

GHMC: మూడు కార్పొరేషన్లుగా హైదరాబాద్ మహానగరం.. రేవంత్ సర్కార్ వ్యూహం ఇదేనా?హైదరాబాద్ మహానగరం త్వరలో మూడు భాగాలుగా ఏర్పాటు కానుంది. రెండు వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఏర్పాటైన ఈ హైదరాబాద్‌ను మూడు కార్పొరేషన్లుగా మార్చాలని గ్రేటర్‌ హైదరాబాద్‌ పాలక మండలి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ మహా నగరం అభివృద్ధి చెందడంతో ఇంకా విస్తీర్ణం పెంచేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఓఆర్‌ఆర్ వరకు ఉన్న అన్ని ప్రాంతాలను…

Read Full News

గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి బాధ్యతలు జేఎస్ రంజన్‌కు: 24 మంది ఐఏఎస్‌ల బదిలీలు

గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి బాధ్యతలు జేఎస్ రంజన్‌కు: 24 మంది ఐఏఎస్‌ల బదిలీలు హైదరాబాద్‌ను మరింత సమగ్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనంతో అతి పెద్ద నగరంగా మారిన గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి బాధ్యతలను ప్రత్యేకంగా పర్యవేక్షించేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ (జేఎస్ రంజన్)కు బాధ్యతలు అప్పగించింది. రాష్ట్ర మెట్రోపాలిటన్ పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA)కి సంబంధించిన…

Read Full News

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆగ్రహం.. 10 వేల కోట్లు వెంటనే చెల్లించాలి: ఎస్. దుర్గయ్యగౌడ్

బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్ ఎస్. దుర్గయ్యగౌడ్ ఆరోపించారు. హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద సుమారు రూ.10 వేల కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. నిన్న ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.365.75 కోట్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారని, అయితే…

Read Full News

కాంగ్రెస్‌లో అంతర్గత అగ్నిపరీక్ష: మంత్రుల అహంకారంపై సొంత పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటు, సీఎం రేవంత్ రెడ్డికి తలనొప్పి

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు మరోసారి బహిరంగ చర్చకు వచ్చాయి. ఇటీవల జరిగిన ప్రెస్ మీట్‌లో బయటపడ్డ అంశాలు పార్టీని తీవ్ర అసౌకర్యంలోకి నెట్టాయి. మంత్రులను కలవడానికి వెళ్తే అవహేళనగా మాట్లాడుతున్నారని, గంటల తరబడి వేచిచూసేలా చేస్తున్నారని, నియోజకవర్గ సమస్యలపై స్పందన లేదని సొంత పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది విపక్షాల విమర్శ కంటే కూడా ప్రమాదకరమైన పరిణామంగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. సాధారణంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మంత్రులపై అసహనం వ్యక్తం…

Read Full News

పంచాయతీ ఎన్నికల ఫలితాలే 2029 అసెంబ్లీ ఎన్నికలకు నాంది: సీఎం రేవంత్ రెడ్డి

2029లో కూడా ఇదే రీతిలో ఫలితాలు పునరావృతం అవుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ విజయాన్ని అందించిన ప్రజలకు, అలాగే కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12,702 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగగా, అందులో 7,527 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు, 808 పంచాయతీల్లో కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థులు విజయం సాధించారని సీఎం వెల్లడించారు. రెబెల్స్‌తో కలిపి మొత్తం 8,335 పంచాయతీల్లో కాంగ్రెస్…

Read Full News

ఉపాధి హామీపై కేంద్ర బిల్లు పిడికిలి: తెలంగాణపై ఏటా ₹1,733 కోట్ల అదనపు భారం

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్‌రేగా) విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త మార్పులు తెలంగాణ రాష్ట్రంపై భారీ ఆర్థిక భారం మోపనున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లెక్కల ప్రకారం, ఈ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా సుమారు ₹1,733.90 కోట్ల అదనపు భారం భరించాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం, ఉపాధి హామీ పథకంలో కూలీల వేతనాలను కేంద్ర ప్రభుత్వమే 100 శాతం చెల్లిస్తోంది. అలాగే…

Read Full News

త్వరలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ?: పొన్నం, కొండా సురేఖ తొలగింపు వార్తలపై మహేష్ గౌడ్ స్పష్టీకరణ

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందనే ప్రచారం నేపథ్యంలో, మంత్రి పొన్నం ప్రభాకర్, కొండా సురేఖలను మంత్రివర్గం నుంచి తొలగిస్తారనే వార్తలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇద్దరూ బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రులని, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నేతలని ఆయన కితాబు ఇచ్చారు. అయితే శాఖల మార్పులు లేదా మంత్రివర్గంలో ఇతర మార్పులు ఉంటాయా అనే అంశంపై…

Read Full News

ఉప్పల్‌లో మెస్సీ సందడి: గ్లోబల్ ఇమేజ్ పేరుతో ప్రజాధన దుర్వినియోగమా?

ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్‌కు రావడంతో రాష్ట్రంలో ఫుట్‌బాల్ ఫీవర్ నెలకొంది. శనివారం ఉప్పల్ స్టేడియంలో జరిగే ప్రత్యేక ఈవెంట్‌ను చూసేందుకు దేశవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కోల్కత్తా పర్యటన అనంతరం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునే మెస్సీ, అక్కడి నుంచి తాజ్ ఫలక్నామా ప్యాలెస్‌లో జరిగే ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అయితే ఈ ఈవెంట్ చుట్టూ ఉత్సాహంతో పాటు తీవ్ర వివాదం కూడా చెలరేగింది. మెస్సీతో సెల్ఫీ దిగాలంటే ఒక్కొక్కరికి…

Read Full News