గ్లోబల్ సమ్మిట్ నిర్వహణపై రేవంత్ రెడ్డికి రాజకీయ వర్గాల విమర్శలు, పరిపాలనపై ప్రశ్నలు

తెలంగాణలో జరిగిన ఫోర్త్ సిటీ గ్లోబల్ సమ్మిట్ పై ఇప్పుడు తీవ్ర రాజకీయ చర్చ మొదలైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహణ శైలి, కార్యక్రమంలో ఏర్పాట్లు, మీడియా వ్యాఖ్యలు, అతిథుల సమన్వయం వంటి అంశాలపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమిట్ సందర్భంలో రేవంత్ రెడ్డి చేసిన ఇంగ్లీష్ వ్యాఖ్యలు, ప్రసంగం, రాజకీయ ప్రత్యర్థుల చేత విమర్శలకు గురయ్యాయి. “ఇంగ్లీష్ రాకపోవడం తప్పు కాదు కానీ పరిపాలన మాత్రం రావాలి” అని ప్రతిపక్షం వ్యాఖ్యానించింది. ముఖ్యమంత్రి కేవలం కుర్చీలో…

Read Full News

ఇంటర్ బోర్డు అవకతవకలపై హైకోర్టు ఆగ్రహం – ప్రైవేట్ కళాశాలల దందాపై తీవ్ర వ్యాఖ్యలు

రాష్ట్ర ఇంటర్ బోర్డు వ్యవహారశైలిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్టీఐ కింద సమాచారం ఇవ్వాలని ఉన్నప్పటికీ, కోర్టు ఆదేశాలను కూడా పాటించలేదని సంబంధిత అధికారులు, ముఖ్యంగా కొంతమంది IAS అధికారుల పనితీరుపై కోర్టు అసంతృప్తి తెలిపింది. ఈ నేపధ్యంలో ఇలంబర్తి మరియు ఆర్వి కర్ణన్‌కు నోటీసులు జారీ చేస్తూ, వచ్చే నెల 26లోగా వివరణ సమర్పించాలని ఆదేశించారు. మరోవైపు, తెలంగాణలోని ప్రైవేట్ ఇంటర్ కళాశాలల్లో జరుగుతున్న అక్రమాలు, అవకతవకలపై ఫిర్యాదులు పెరుగుతున్నాయి. అనుమతులు ఒకచోట…

Read Full News

ప్రైవేట్ కళాశాలల అక్రమాలు, ఇంటర్ బోర్డు చర్యలపై విమర్శలు – ఓయులో రేవంత్ రెడ్డి పర్యటనపై చర్చ

స్వదేశీ పరిశ్రమలను రక్షించాలనే దృష్టితో కేంద్రం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు, చైనా–ఇండియా వంటి దేశాలపై ఆధారాన్ని తగ్గించే విధానాల ప్రభావం భారత ఆటోమొబైల్ రంగంపై పడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో, తెలంగాణలో ఇంటర్ బోర్డు పర్యవేక్షణలో నడుస్తున్న ప్రైవేట్ కళాశాలల్లో అవకతవకల ఆరోపణలు మళ్లీ ముందుకు వచ్చాయి. హైదరాబాద్ పరిధిలో పలు కళాశాలల్లో అడ్మిషన్‌ల దందా, అనుమతుల్లో అనుసరణల సమస్యలు, డబుల్ మేనేజ్‌మెంట్ వంటి అంశాలపై అనేక ఫిర్యాదులు వచ్చినప్పటికీ, అధికారులు నోటీసుల దశలోనే ఆగిపోతున్నారని…

Read Full News

రేవంత్ పర్యటన ముందు విద్యార్థుల అరెస్టులు… ఉస్మానియా క్యాంపస్‌లో టెన్షన్!

ఉస్మానియా యూనివర్శిటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ముందుగా విద్యార్థుల అరెస్టులు, కాల్స్, ఇంటి దగ్గర విజిలెన్స్ పెరగడం వంటివి తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలను వినిపించడానికి ప్రయత్నించిన వారిని పోలీసులు ముందుగానే అడ్డుకుంటున్నారనే ఆరోపణలు తీవ్ర స్థాయిలో వినిపిస్తున్నాయి. విద్యార్థి నాయకురాలు ఆస్మా మరోసారి అక్రమ అరెస్టుల బెడదను ఎదుర్కొంటుండగా, ఆమె ఇంటికి పోలీసులు వెళ్లి “స్టేషన్‌కి రండి” అంటూ ఒత్తిడి చేయడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. గతంలో కూడా ఆమెను స్ట్రీట్‌లో తీసుకెళ్లి…

Read Full News

ప్రభుత్వం హామీలు నెరవేర్చాలి: ఆటో డ్రైవర్ల ఆగ్రహ దీక్ష – 15 రోజుల్లో చర్యలు లేకపోతే అసెంబ్లీ ముట్టడి”

హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లు మళ్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎనిమిది నెలలుగా ప్రభుత్వ ఆఫీసులు, అధికారులను కలిసినా సమస్యలు పరిష్కారం కాలేదని జాయింట్ యాక్షన్ కమిటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ బోర్డ్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, “2012 తర్వాత ఇప్పటివరకు ఆటో మీటర్ రేట్లు పెరగలేదు. పెట్రోల్, రోడ్డు టాక్స్, జరిమానాలు అన్ని పెరిగాయి కానీ మా ఆదాయం పెరగలేదు. బస్సులకు, ఇతర సేవలకు ధరలు పెంచి ఆటో డ్రైవర్ల సమస్యలను…

Read Full News

రాజకీయాల్లో రిటైర్మెంట్ కావాలి: యువతకు అవకాశం ఇవ్వాలని తీవ్ర డిమాండ్

తెలంగాణ రాజకీయాల్లో కొత్త తరం నాయకత్వం అవసరం ఉందని ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు, ఉద్యోగాల్లో రిటైర్మెంట్ ఉన్నప్పటికీ, రాజకీయ నేతలకు రిటైర్మెంట్‌ వ్యవస్థ లేకపోవడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వృద్ధ నేతలు ఫీల్డ్‌లో తిరగలేని స్థితిలో ఉన్నప్పటికీ, పదవులు మాత్రం కావాలని, జీతాలు, సౌకర్యాలు, ప్రోటోకాల్‌లను ఆస్వాదిస్తూ కూర్చోవడం ప్రజాస్వామ్యానికి నష్టం అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. “రాజకీయాల్లో కూడా వయస్సు పరిమితి ఉండాలి. పార్లమెంట్‌లో బిల్లు పెట్టే ధైర్యం ఉంటే పెట్టండి”…

Read Full News

హిల్ట్ పాలసీపై బీఆర్‌ఎస్ ఆరోపణలు నిరాధారాలు: పొంగులేటి

హిల్ట్ పాలసీ విషయంలో బీఆర్‌ఎస్ చేస్తున్న విమర్శలు విషపూరితం తప్ప నిజం కావని హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.శుక్రవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, హిల్ట్ పాలసీలోని రెండు ముఖ్య అంశాలు బీఆర్‌ఎస్ ప్రభుత్వ కాలంలోనే వచ్చాయని, ఆ ఫైల్‌పై సంతకం చేసిన వ్యక్తి కూడా కేటీఆర్‌నే అని స్పష్టం చేశారు. “కోకాపేట్, నియా పాలసీ సమయంలో వేలాది కోట్లు విలువైన ఫ్లాట్లు, భూములు వేలానికి పెట్టింది ఎవరు?…

Read Full News

ఇందిరమ్మ ఇండ్ల ప్రగతి: వచ్చే మార్చిలో లక్ష గృహ ప్రవేశాలు – మంత్రి పొంగులేటి

రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో గృహ నిర్మాణ శాఖ రెండు సంవత్సరాల ప్రగతిని వివరించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఇప్పటివరకు దాదాపు నాలుగు లక్షల ఇండ్లను మంజూరు చేశామని, ఇంకా మూడు లక్షల ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయని మంత్రి తెలిపారు. వచ్చే ఏడాది మార్చి నాటికి లక్ష ఇండ్లకు గృహ ప్రవేశాలు నిర్వహిస్తామని, జూన్ నాటికి మరో రెండు లక్షల…

Read Full News

మాటలే నాయకుడి గౌరవం” – రేవంత్ వ్యాఖ్యలపై విమర్శలు, ధార్మిక ఉదాహరణలతో కౌంటర్

సంఘటన, వ్యాఖ్యలు, స్పందనలు — ఏది జరిగినా నాయకుడి మాటలే ఆయన స్థాయిని నిర్ణయిస్తాయి.అయితే తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీశాయి. కొంతమంది ప్రజలు, ధార్మిక విశ్వాసాలను ఉదాహరణగా తీసుకుంటూ ఆయన వ్యాఖ్యలపై కఠిన విమర్శలు చేశారు.. 🔹 “నా స్థానం దేవుని దయతోనే” — ప్రజల భావోద్వేగ స్పందన ప్రజల్లో ఒకరు భావోద్వేగంగా ఇలా తెలిపారు: “కొద్దో గొప్పో ఉన్నా, దైవ సంకల్పం ఉండబట్టే…

Read Full News

జిహెచ్ఎంసి వార్డుల విభజనలో భారీ మార్పులు – 300కు పైగా వార్డులే లక్ష్యం

జిహెచ్ఎంసిలో వార్డుల పునర్విభజన ప్రక్రియ వేగం పెంచింది. ప్రస్తుతం ఉన్న 150 వార్డులను 300కు పైగా పెంచే దిశగా ప్రభుత్వం, అర్బన్ డెవలప్మెంట్ శాఖ, జిహెచ్ఎంసి అధికారులు కసరత్తు చేస్తున్నారు. గత మూడు రోజులుగా టౌన్ ప్లానింగ్ అధికారుల సమీక్షలు, డేటా ఆధారంగా కొత్త ప్రతిపాదనలు సిద్ధం అవుతున్నాయి. ప్రస్తుతం 27 మున్సిపాలిటీలు మరియు 7 మున్సిపల్ కార్పొరేషన్లు జిహెచ్ఎంసిలో విలీనం కానున్న నేపథ్యంలో మొత్తం పరిధి, జనాభా పరిమాణం గణనీయంగా పెరగనుంది. లక్ష్యంగా ప్రభుత్వం ఓటర్ల…

Read Full News