ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఫెయిల్ అయ్యారా? 1000 రోజులపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మరోసారి ముదిరింది. ప్రతిపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజల్లోకి రావడం లేదంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్‌కు భద్రత, వేతనాలు, ఇతర సదుపాయాల కోసం ప్రభుత్వ ఖజానా నుంచి భారీగా ఖర్చు చేస్తున్నప్పటికీ.. ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలపై ఒక్కరోజైనా పోరాడారా అని ప్రశ్నించారు. ముసారాంబాగ్ బ్రిడ్జి ప్రారంభోత్సవం సందర్భంగా అంబర్‌పేట్ మైదానంలో…

Read Full News

కాంగ్రెస్‌లో నేతల అసంతృప్తి.. కొండా సురేఖ ఎపిసోడ్‌తో పార్టీకి కొత్త తలనొప్పి?

తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత అసంతృప్తి మరోసారి చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలే పార్టీ వ్యవహారాలు, పదవులు, నిర్ణయాలపై బహిరంగంగా విమర్శలు చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. రాజగోపాల్ రెడ్డి నుంచి జీవన్ రెడ్డి వరకు, తాజాగా కొండా సురేఖ వరకు నేతల అసంతృప్తి వివిధ సందర్భాల్లో బయటపడుతున్న నేపథ్యంలో పార్టీ అంతర్గత వ్యవహారాలపై చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో కొండా సురేఖ పదవి కోల్పోతారని, ఆమె కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు…

Read Full News

పాలిటెక్నిక్ విద్యార్థుల నుంచి స్కూళ్ల వరకు.. తెలంగాణలో ఏం జరుగుతోంది?

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం విద్య, వైద్యం, విద్యార్థుల సమస్యలు ప్రధాన చర్చనీయాంశాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలు, విద్యా విధానాలపై వస్తున్న విమర్శలు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులపై ప్రశ్నలు రాజకీయంగా వేడి పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు హేమ తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. విద్య, వైద్యం ప్రజల ప్రాథమిక హక్కులని, ఈ రెండు రంగాలపై ప్రభుత్వాలు మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆమె వ్యాఖ్యానించారు. “ప్రజల…

Read Full News

నాడు జీవన్ రెడ్డి.. నేడు చిన్నారెడ్డి! తెలంగాణ కాంగ్రెస్‌లో పాత–కొత్త పోరు ఎటు? అసంతృప్తి నేతలంతా ఒక్కటవుతున్నారా?

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో పాత–కొత్త నేతల మధ్య విభేదాలు మరోసారి తెరపైకి వస్తున్నాయి. ఒకప్పుడు జగిత్యాల నియోజకవర్గంలో నెలకొన్న పాత–కొత్త నేతల వివాదంతో మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్‌లో చేరిన విషయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పుడు అదే జగిత్యాల నియోజకవర్గంలో మరోసారి అసంతృప్తి స్వరాలు వినిపిస్తుండటంతో కాంగ్రెస్‌లో అంతర్గత సమన్వయంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జీవన్ రెడ్డి తనకు పార్టీలో తగిన గుర్తింపు, పదవి లభించలేదని అసంతృప్తి వ్యక్తం చేసిన తర్వాత కాంగ్రెస్‌కు…

Read Full News

22A జాబితాపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.. వివాదం లేని భూములకు విముక్తి? ఈ వారంలోనే కొత్త లిస్ట్!

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భూములు, ఇళ్లు, ఫ్లాట్లు, ప్రైవేట్ ఆస్తులను నిషేధిత ఆస్తుల జాబితా 22Aలో చేర్చడంతో తలెత్తిన వివాదానికి త్వరలోనే పరిష్కారం లభించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలు 22A జాబితాను సమీక్షించే ప్రక్రియను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. ఈ వారంలోనే సవరించిన జాబితాను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. సీఎం ఆదేశాలతో 22A జాబితాపై కసరత్తు 22A నిషేధిత ఆస్తుల జాబితాలో వివాదం లేని…

Read Full News

కాంగ్రెస్‌లో తిరుగుబాటు స్వరాలు.. కళ్లెం వేసే నాయకుడు ఎవరు? పాత–కొత్త నేతల మధ్య ముదురుతున్న ఆధిపత్య పోరు

హైదరాబాద్: తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో అంతర్గత అసంతృప్తి క్రమంగా బహిర్గతమవుతున్నదనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. దశాబ్దం తర్వాత రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్‌కు ప్రతిపక్షాల కంటే సొంత పార్టీ నేతల నుంచే ఎక్కువ ఇబ్బందులు ఎదురవుతున్నాయా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పదవులు దక్కలేదని కొందరు, పార్టీలో గుర్తింపు లేదని మరికొందరు, అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఇంకొందరు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పాత–కొత్త నేతల మధ్య…

Read Full News

ఇంద్రేశం మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాల ఆరోపణలు.. ఫ్లాట్ నం.124లో నిర్మాణంపై దుమారం! అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు

సంగారెడ్డి జిల్లా: అనుమతులు లేకుండా నిర్మాణాలు జరుగుతున్నాయనే ఆరోపణలతో సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలంలోని ఇంద్రేశం మున్సిపాలిటీ మరోసారి వార్తల్లోకి వచ్చింది. మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్లు 162, 163, 164, 166 నుంచి 173, 181లోని ఫ్లాట్ నంబర్ సి-124లో జరుగుతున్న నిర్మాణంపై స్థానికులు, సామాజిక కార్యకర్తలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణానికి అవసరమైన అనుమతులు ఉన్నాయా? మున్సిపల్ నిబంధనలకు అనుగుణంగానే నిర్మాణం జరుగుతోందా? అనే అంశాలపై స్పష్టత ఇవ్వాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఫ్లాట్…

Read Full News

ప్రతి కుటుంబానికి ఎకరం భూమి.. కవిత సంచలన హామీ | Telangana Bhoomilakshmi Scheme

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక హామీ చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ‘భూలక్ష్మి’ పథకాన్ని ప్రతిపాదించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని భూమిలేని ప్రతి పేద కుటుంబానికి ఒక ఎకరం భూమి పంపిణీ చేస్తామని ప్రకటించారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కవిత.. తెలంగాణలో సామాజిక న్యాయం సాధించాలంటే భూమి పంపిణీ అవసరమని అన్నారు. భూమి లేని పేద కుటుంబాలకు భూమి అందించడం ద్వారా…

Read Full News

TIMS హాస్పిటల్ సందర్శనకు సబితా ఇంద్రారెడ్డిని అడ్డుకున్న పోలీసులు.. BRS వర్సెస్ కాంగ్రెస్ వార్!

నమస్తే.. వెల్కమ్ టు OKTV. ప్రస్తుతం మనం హైదరాబాద్‌లోని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసం వద్ద ఉన్నాం. ఇక్కడ ప్రస్తుతం రాజకీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సబితా ఇంద్రారెడ్డిని పోలీసులు బయటకు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు కారణం ఏమిటంటే.. సనత్‌నగర్‌లోని TIMS హాస్పిటల్ సందర్శనకు BRS నేతలు ప్రయత్నించడం. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆసుపత్రిని ప్రారంభించింది. అయితే BRS నేతలు మాత్రం ఈ ఆసుపత్రి నిర్మాణం తమ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమైందని,…

Read Full News

కొల్లాపూర్ అభివృద్ధిపై మంత్రి జూపల్లి కృష్ణారావుకు స్థానిక కార్యకర్త నిలదీత.. ‘ముందు సొంత ఊరిని చూసుకోండి’ అంటూ ప్రశ్నలు

కొల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రి జూపల్లి కృష్ణారావుకు స్థానికంగా ప్రశ్నలు ఎదురయ్యాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో, మంత్రి పాల్గొన్న కార్యక్రమంలోనే ఓ సీనియర్ కార్యకర్త, సర్పంచ్ ప్రభాకర్ తన గ్రామంలోని సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ముందుగా సొంత ప్రాంతంలోని సమస్యలను పరిష్కరించిన తర్వాత ఇతర ప్రాంతాల అభివృద్ధి గురించి మాట్లాడాలని కోరారు. వనపర్తి జిల్లా ఏదుల మండలం సింగాయిపల్లిలో జరిగిన కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు…

Read Full News