కరీంనగర్ దాడి ఘటన.. నాయకుల మాటలతో కార్యకర్తల భవిష్యత్తు బలి?
కరీంనగర్లో చోటుచేసుకున్న బిఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడి ఘటన తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన డ్రగ్స్ వ్యాఖ్యలు, వాటికి బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఘాటు కౌంటర్ తర్వాత రాజకీయ ఉద్రిక్తత ఒక్కసారిగా హింసాత్మకంగా మారిన పరిస్థితి కనిపించింది. ఈ ఘటనలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంపై దాడి జరగడం, వాహనాలు ధ్వంసం కావడం, రాళ్లు కర్రలతో దాడులు…

