పేదవాడి ఆత్మగౌరవానికి కాంగ్రెస్ అండ: నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం, ఇంకా మూడు విడతలు ఇస్తాం – మంత్రి స్పష్టం

గత రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పేదవాడికి అండదండలుగా నిలిచే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి స్పష్టం చేశారు. గత పాలనలో పేదవాడికి ఆత్మగౌరవంగా ఉండే ఇంటిని కూడా ఇవ్వలేకపోయారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో లక్షల కోట్ల కమిషన్ల రాజకీయాలు జరిగాయే తప్ప పేదవాడికి ఇల్లు ఇవ్వలేదని ఆరోపించారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలోనే నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లను…

Read Full News

మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి వెన్నుపోటు భయం: టిక్కెట్లు దక్కని నేతల అసంతృప్తి, చీకటి ఒప్పందాలపై హాట్ టాక్

మున్సిపల్ ఎన్నికల వేళ బీజేపీకి అంతర్గత వెన్నుపోటు భయం పట్టుకున్నట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ టిక్కెట్లు దక్కని నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొనడంతో పలుచోట్ల బీజేపీ ప్రచారం బలహీనంగా కనిపిస్తున్నదని సమాచారం. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో వార్డుల వారీగా పోటీ స్పష్టమైందీ, అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అయితే బీజేపీ అభ్యర్థులకు మాత్రం సొంత పార్టీ నేతల నుంచే ప్రమాదం పొంచి ఉందనే టాక్ వినిపిస్తోంది. ఏళ్ల తరబడి పార్టీ కోసం…

Read Full News

అస్తం, సుత్తి–కొడవలి–నక్షత్రం గుర్తులకు ఓటేయండిపేదల ప్రభుత్వాన్ని మరింత బలపర్చండి: మంత్రి పిలుపు

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి ప్రజలకు ఓటింగ్‌పై స్పష్టమైన విజ్ఞప్తి చేశారు. 23వ పరిధిలోని మూడు డివిజన్లలో ‘అస్తం’ గుర్తుకు, 21వ డివిజన్‌లో సీపీఎం పార్టీ గుర్తైన ‘సుత్తి–కొడవలి–నక్షత్రం’కు అత్యధిక ఓట్లు వేసి మంచి మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. రెండు సంవత్సరాల క్రితం ప్రజల కష్టఫలితంగా తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఇందిరమ్మ రాజ్యంలో పేదవాడికి అండగా నిలిచే అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని గుర్తు చేశారు….

Read Full News

మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి పవన్ అవసరమా?పక్క రాష్ట్ర డిప్యూటీ సీఎం వచ్చి ప్రచారం చేస్తేనే గెలుపా? – మహేష్ కుమార్ గౌడు

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నట్లు బీజేపీ బుధవారం ప్రకటించింది. బీజేపీ–జనసేన అభ్యర్థుల తరపున ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని, అయితే పవన్ పర్యటన తేదీలు, పర్యటించే మున్సిపాలిటీల వివరాలను త్వరలో వెల్లడిస్తామని పార్టీ నేతలు తెలిపారు. రెండు రోజుల క్రితం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు పవన్ కళ్యాణ్‌ను కలిసి ఎన్నికల్లో మద్దతు కోరిన విషయం తెలిసిందే. బీజేపీ…

Read Full News

స్పీకర్ తీర్పు రాజ్యాంగానికి గొడ్డలి : రేవంత్ పాలన చేతకాకే మురికి ప్రచారం – కేటీఆర్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన పూర్తిగా విఫలమైందని, అందుకే మురికి భాషతో విషప్రచారానికి దిగుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. బుధవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ వరుసగా తిరస్కరిస్తున్న తీరు రాజ్యాంగానికే సవాల్‌గా మారిందని కేటీఆర్ అన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి స్వయంగా జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌కు కండువా కప్పి కాంగ్రెస్‌లో చేర్చుకున్న ఫోటోలు, వీడియోలు ప్రజల కళ్ల…

Read Full News

పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ నిర్ణయంపై వివాదం – జగిత్యాల ఎమ్మెల్యేపై కవిత ప్రశ్నలు, జీవన్ రెడ్డి కౌంటర్

పార్టీ ఫిరాయింపుల అంశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కు స్పీకర్ క్లీన్ షీట్ ఇవ్వడంపై రాజకీయ దుమారం చెలరేగింది. ఈ నిర్ణయం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కలవకుంట్ల కవిత తీవ్రంగా విమర్శించారు. బుధవారం ‘ఎక్స్’ వేదికగా స్పందించిన ఆమె, స్పీకర్ కాంగ్రెస్ నాయకుడిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గాంధీ భవన్‌కు వెళ్లి కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొన్న విషయం స్పీకర్‌కు తెలియదా అని కవిత ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో…

Read Full News

పిఓబి నిషేధిత జాబితా ఎవరి బాధ్యత? రెవెన్యూ అధికారుల గందరగోళం, ప్రభుత్వ తీరు పై ప్రజల్లో ఆందోళన

రాష్ట్రంలో పిఓబి (నిషేధిత) భూముల జాబితా రూపకల్పనపై తీవ్ర గందరగోళం నెలకొంది. అసలు ఈ జాబితా తయారు చేయాల్సిన బాధ్యత ఎవరిది? భూములను గుర్తించాల్సింది ఎవరు? అనే ప్రశ్నలకు ఇప్పటికీ స్పష్టత లేదు. రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై పట్టాదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూములను గుర్తించి పిఓబి నిషేధిత జాబితా రూపొందించాల్సిన బాధ్యత రెవెన్యూ శాఖదే. కానీ తహసీల్దారులు మాత్రం సబ్‌ రిజిస్ట్రార్లకు లేఖలు రాస్తూ వివరాలు అడగడం చర్చనీయాంశంగా మారింది. వివరాలు ఇవ్వాల్సిన…

Read Full News

వికారాబాద్‌లో బీజేపీ బలం పెరుగుతోంది: బిఆర్ఎస్ జిల్లా నాయకత్వంపై ఘాటు విమర్శలు, రాబోయే ఎన్నికల్లో గెలుపు మా దేనంటూ బీజేపీ నేతల ధీమా

వికారాబాద్ జిల్లాలో బీజేపీ బలం రోజు రోజుకు పెరుగుతోందని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులకు గౌరవ చేవేల పార్లమెంట్ సభ్యులు వికారాబాద్ జిల్లాలో సన్మాన కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం అనంతరం బీజేపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ రాజకీయ పరిణామాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో తాము బిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఉద్యమ కాలం నుంచి గ్రామస్థాయిలో కష్టపడి సర్పంచులను…

Read Full News

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి బెదిరింపులు అప్రజాస్వామికం – కాంగ్రెస్ ముట్టడిని తీవ్రంగా ఖండించిన బీజేపీ

తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన రాష్ట్ర అధ్యక్షులు, ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ కార్యాలయంపై దాడి చేస్తామంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఈ వ్యాఖ్యలను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండిస్తూ, ఇది ప్రజాస్వామ్య విలువలకు పూర్తిగా విరుద్ధమని స్పష్టం చేశారు. ఏదైనా టెక్నికల్ ఇష్యూ గానీ, విధానపరమైన అంశాలపై గానీ నిరసన తెలిపే హక్కు ప్రతి రాజకీయ పార్టీకి ఉందని, కానీ ఒక పార్టీ కార్యాలయాన్ని…

Read Full News

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి బెదిరింపులు ప్రజాస్వామ్యానికి విరుద్ధం – కాంగ్రెస్ ముట్టడిని తీవ్రంగా ఖండించిన బీజేపీ

తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, దేశంలోనే అతి పెద్ద పార్టీ కార్యాలయమైన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంపై దాడి చేస్తామంటూ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఇది ప్రజాస్వామ్యానికి పూర్తిగా విరుద్ధమని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. టెక్నికల్ ఇష్యూలపై లేదా ప్రజా సమస్యలపై నిరసన తెలిపే హక్కు ప్రతి రాజకీయ పార్టీకి ఉందని, కానీ ఒక పార్టీ కార్యాలయంపై దాడి చేస్తామని బహిరంగంగా హెచ్చరించడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ…

Read Full News