మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి పవన్ అవసరమా?పక్క రాష్ట్ర డిప్యూటీ సీఎం వచ్చి ప్రచారం చేస్తేనే గెలుపా? – మహేష్ కుమార్ గౌడు

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నట్లు బీజేపీ బుధవారం ప్రకటించింది. బీజేపీ–జనసేన అభ్యర్థుల తరపున ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని, అయితే పవన్ పర్యటన తేదీలు, పర్యటించే మున్సిపాలిటీల వివరాలను త్వరలో వెల్లడిస్తామని పార్టీ నేతలు తెలిపారు. రెండు రోజుల క్రితం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు పవన్ కళ్యాణ్‌ను కలిసి ఎన్నికల్లో మద్దతు కోరిన విషయం తెలిసిందే. బీజేపీ…

Read Full News

స్పీకర్ తీర్పు రాజ్యాంగానికి గొడ్డలి : రేవంత్ పాలన చేతకాకే మురికి ప్రచారం – కేటీఆర్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన పూర్తిగా విఫలమైందని, అందుకే మురికి భాషతో విషప్రచారానికి దిగుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. బుధవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ వరుసగా తిరస్కరిస్తున్న తీరు రాజ్యాంగానికే సవాల్‌గా మారిందని కేటీఆర్ అన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి స్వయంగా జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌కు కండువా కప్పి కాంగ్రెస్‌లో చేర్చుకున్న ఫోటోలు, వీడియోలు ప్రజల కళ్ల…

Read Full News

పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ నిర్ణయంపై వివాదం – జగిత్యాల ఎమ్మెల్యేపై కవిత ప్రశ్నలు, జీవన్ రెడ్డి కౌంటర్

పార్టీ ఫిరాయింపుల అంశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కు స్పీకర్ క్లీన్ షీట్ ఇవ్వడంపై రాజకీయ దుమారం చెలరేగింది. ఈ నిర్ణయం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కలవకుంట్ల కవిత తీవ్రంగా విమర్శించారు. బుధవారం ‘ఎక్స్’ వేదికగా స్పందించిన ఆమె, స్పీకర్ కాంగ్రెస్ నాయకుడిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గాంధీ భవన్‌కు వెళ్లి కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొన్న విషయం స్పీకర్‌కు తెలియదా అని కవిత ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో…

Read Full News

పిఓబి నిషేధిత జాబితా ఎవరి బాధ్యత? రెవెన్యూ అధికారుల గందరగోళం, ప్రభుత్వ తీరు పై ప్రజల్లో ఆందోళన

రాష్ట్రంలో పిఓబి (నిషేధిత) భూముల జాబితా రూపకల్పనపై తీవ్ర గందరగోళం నెలకొంది. అసలు ఈ జాబితా తయారు చేయాల్సిన బాధ్యత ఎవరిది? భూములను గుర్తించాల్సింది ఎవరు? అనే ప్రశ్నలకు ఇప్పటికీ స్పష్టత లేదు. రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై పట్టాదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూములను గుర్తించి పిఓబి నిషేధిత జాబితా రూపొందించాల్సిన బాధ్యత రెవెన్యూ శాఖదే. కానీ తహసీల్దారులు మాత్రం సబ్‌ రిజిస్ట్రార్లకు లేఖలు రాస్తూ వివరాలు అడగడం చర్చనీయాంశంగా మారింది. వివరాలు ఇవ్వాల్సిన…

Read Full News

వికారాబాద్‌లో బీజేపీ బలం పెరుగుతోంది: బిఆర్ఎస్ జిల్లా నాయకత్వంపై ఘాటు విమర్శలు, రాబోయే ఎన్నికల్లో గెలుపు మా దేనంటూ బీజేపీ నేతల ధీమా

వికారాబాద్ జిల్లాలో బీజేపీ బలం రోజు రోజుకు పెరుగుతోందని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులకు గౌరవ చేవేల పార్లమెంట్ సభ్యులు వికారాబాద్ జిల్లాలో సన్మాన కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం అనంతరం బీజేపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ రాజకీయ పరిణామాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో తాము బిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఉద్యమ కాలం నుంచి గ్రామస్థాయిలో కష్టపడి సర్పంచులను…

Read Full News

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి బెదిరింపులు అప్రజాస్వామికం – కాంగ్రెస్ ముట్టడిని తీవ్రంగా ఖండించిన బీజేపీ

తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన రాష్ట్ర అధ్యక్షులు, ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ కార్యాలయంపై దాడి చేస్తామంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఈ వ్యాఖ్యలను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండిస్తూ, ఇది ప్రజాస్వామ్య విలువలకు పూర్తిగా విరుద్ధమని స్పష్టం చేశారు. ఏదైనా టెక్నికల్ ఇష్యూ గానీ, విధానపరమైన అంశాలపై గానీ నిరసన తెలిపే హక్కు ప్రతి రాజకీయ పార్టీకి ఉందని, కానీ ఒక పార్టీ కార్యాలయాన్ని…

Read Full News

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి బెదిరింపులు ప్రజాస్వామ్యానికి విరుద్ధం – కాంగ్రెస్ ముట్టడిని తీవ్రంగా ఖండించిన బీజేపీ

తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, దేశంలోనే అతి పెద్ద పార్టీ కార్యాలయమైన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంపై దాడి చేస్తామంటూ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఇది ప్రజాస్వామ్యానికి పూర్తిగా విరుద్ధమని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. టెక్నికల్ ఇష్యూలపై లేదా ప్రజా సమస్యలపై నిరసన తెలిపే హక్కు ప్రతి రాజకీయ పార్టీకి ఉందని, కానీ ఒక పార్టీ కార్యాలయంపై దాడి చేస్తామని బహిరంగంగా హెచ్చరించడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ…

Read Full News

జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌పై హోరాహోరీ: “హైదరాబాద్‌కు అన్యాయం” అంటూ బీజేపీ నిరసనలు

జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌పై వివాదం: “ఇది అభివృద్ధి కాదు, హైదరాబాద్‌కు అన్యాయం” – బీజేపీ కార్పొరేటర్ల ఆందోళన హైదరాబాద్ నగరంలో ప్రతిపాదిత జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ అంశం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. దాదాపు 300 డివిజన్లుగా విభజన చేసే యోచనపై కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుండటాన్ని బీజేపీ కార్పొరేటర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ డీలిమిటేషన్ వెనుక అభివృద్ధి లక్ష్యం కంటే, ఎంఐఎం కి అనుకూలంగా రాజకీయ లెక్కలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నది ఒక్కటే—“మేము…

Read Full News

రెవంత్‌రెడ్డికి బీజేపీ సవాల్: హామీల అమలుపై ఓపెన్ డిబేట్‌కి రావాలి!

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన భారీ సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపించాయి. సభ ప్రారంభం నుంచే భారత మాతాకి జై, వందే మాతరం, భారతీయ జనతా పార్టీ జిందాబాద్ నినాదాలతో వేదిక సందడిగా మారింది. పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువత, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. వేదిక మీద బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ కొమరయ్య, ఎమ్మెల్యే కోటిపల్లి వెంకటరమణా రెడ్డి సహా పలువురు…

Read Full News

జూబ్లీ హిల్స్‌లో నవీన్ యాదవ్ చారిత్రక ఆధిక్యం: కాంగ్రెస్ శిబిరంలో సంబరాలు ఉప్పొంగిన వేళ

జూబ్లీ హిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ శిబిరంలో ప్రస్తుతం పండుగ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సుమారు 12,000 ఓట్ల భారీ ఆధిక్యంతో ముందంజలో ఉండటంతో పార్టీ కార్యకర్తలు పాటలు, డ్యాన్సులు చేస్తూ సంబరాల్లో మునిగిపోయారు. పార్టీ ఆఫీస్, యూసఫ్‌గూడా ప్రాంతం, అలాగే నవీన్ యాదవ్ స్వగృహం—మొత్తం ప్రాంతం విజయోత్సాహంతో కిక్కిరిసిపోయింది. క్యాంపెయిన్‌లో కీలకంగా పనిచేసిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ టీమ్ సభ్యులు కూడా ఈ విజయోత్సవాల్లో పాల్గొన్నారు. అలాగే మూడు రాష్ట్ర…

Read Full News