రేవంత్ రెడ్డి ఎందుకు పరేషాన్లో ఉన్నారు? విదేశీ పర్యటన, ఫ్లెక్సీలు, ద్వంద్వ ప్రమాణాలపై ప్రశ్నలు

ఎందుకు పరేషాను పరేషానురా” అన్న పాట బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించేలా, ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిస్థితి అలాగే ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అసలు రేవంత్ రెడ్డి ఎందుకు పరేషాన్లో ఉన్నారు? తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతోంది? విదేశీ పర్యటన నుంచి వచ్చాక రాష్ట్రంలో కనిపిస్తున్న పరిణామాలు ఈ ప్రశ్నలకు దారి తీస్తున్నాయి. విదేశాలకు వెళ్లి చదువుకుని వచ్చినట్లుగా, ఏదో గొప్ప ఘనకార్యం చేసి వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ నేతలు ఫ్లెక్సీలు, బ్యానర్లు పెట్టడం…

Read Full News

ఫోన్ టాపింగ్ కేసు: సిట్ విచారణకు హాజరైన కేసీఆర్, నందీనగర్‌లో కీలక భేటీలు

ఫోన్ టాపింగ్ కేసులో ఆదివారం సిట్ విచారణ ఉండటంతో ఉదయం 11 గంటలకు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి బయలుదేరిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా నందీనగర్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. అక్కడ బీఆర్ఎస్ ముఖ్యనేతలతో కలిసి లంచ్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనపై నమోదైన కేసులు, సిట్ విచారణ తీరు, భవిష్యత్ వ్యూహాలపై పార్టీ నేతలతో ఆయన చర్చించినట్లు సమాచారం. సిట్ విచారణ అనంతరం కేటీఆర్, హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌తో పాటు…

Read Full News

ఎలక్టోరల్ బాండ్స్ వెనుక బ్లాక్‌మేయిల్ రాజకీయాలా? వ్యాపారవేత్తలు–రాజకీయ నాయకుల నెక్సస్‌పై తీవ్ర విమర్శలు

ఎలక్టోరల్ బాండ్స్ వ్యవహారం దేశ రాజకీయాల్లో పెను దుమారంగా మారుతోంది. బ్లాక్‌మేయిల్ చేసి ఎలక్టోరల్ బాండ్స్ వసూలు చేశారా? అనే ప్రశ్న ఇప్పుడు ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. సంధ్య కన్వెన్షన్ శ్రీధర్ రావు ద్వారా కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ ఎలా వచ్చాయి? ఆయన నిజంగా నీతిమంతుడా, లేక పెద్ద స్థాయి అవినీతి వ్యవస్థలో భాగమా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎలక్టోరల్ బాండ్స్ లేని పార్టీ ఏదైనా ఉందా? అని ప్రశ్నిస్తే సమాధానం స్పష్టంగా “లేదు”…

Read Full News

నందీనగర్ విచారణ, బీఆర్ఎస్ ఆందోళనలు: కాంగ్రెస్ వైఫల్యాలపై మళ్లీ మంట పెట్టిన కేసీఆర్ అంశం

ఫోన్ టాపింగ్ కేసు విచారణలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ఫార్మ్ హౌస్ నుంచి నందీనగర్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ భారీ నిరసనలు చేపట్టింది. అన్ని జిల్లాల్లో పార్టీ శ్రేణులు రోడ్లపైకి వచ్చి కేసీఆర్‌కు సంఘీభావం ప్రకటించాయి. నందీనగర్‌లో కొన్ని గంటల పాటు విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారని సమాచారం. తెలంగాణ ఉద్యమానికి రూపకల్పన చేసిన ఇదే ఇంట్లో, ఇదే గదిలో విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని…

Read Full News

మిడిల్ క్లాస్‌కు ఊరటనిచ్చిన కేంద్ర బడ్జెట్‌.. నిర్మలా సీతారామన్‌పై పెరుగుతున్న విశ్వాసం

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన తాజా కేంద్ర బడ్జెట్ మిడిల్ క్లాస్, సామాన్య వర్గాలకు ఊరటనిచ్చేదిగా ఉందని రాజకీయ, ఆర్థిక వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. బీజేపీ పార్టీ, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా నిర్మలా సీతారామన్‌పై పెట్టుకున్న నమ్మకాన్ని ఆమె ఎప్పుడూ ఒమ్ము చేయలేదన్న అభిప్రాయం బలపడుతోంది. భారతదేశ ఆర్థిక పునాదులు బలంగా నిలబడటానికి మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్థిక శాఖ మంత్రిగా చేసిన కృషి…

Read Full News

ఫోన్ ట్యాపింగ్ విచారణలో కక్షసాధింపు లేదు.. చట్టం తన పని తాను చేస్తుంది: కాంగ్రెస్ స్పష్టం

గత పదేళ్ల పాలనలో జరిగిన తప్పిదాల నుంచి తప్పించుకునేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై దుష్ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశమైన ఫోన్ ట్యాపింగ్, డ్రోన్ ట్రాఫిక్ వ్యవహారాలపై చట్టబద్ధంగా విచారణ కొనసాగుతున్న తరుణంలో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎవరిపైనా వ్యక్తిగత కక్ష సాధింపుల ఆలోచన లేదని, గతంలో ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా పనిచేసిన వారిపట్ల…

Read Full News

హార్వర్డ్ నుంచి లీడర్షిప్ సర్టిఫికేట్: సీఎం రేవంత్ రెడ్డిపై వ్యంగ్య విమర్శలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హార్వర్డ్ యూనివర్సిటీ కెనడీ స్కూల్‌లో “లీడర్షిప్ ఇన్ 21వ శతాబ్దం” కోర్స్ పూర్తి చేసి సర్టిఫికేట్ పొందడంపై రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో వ్యంగ్య విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి అయిన తర్వాత లీడర్‌గా ఎదిగానని నిరూపించుకోవాలన్న భావనతోనే ఈ సర్టిఫికేట్ తీసుకొచ్చినట్లుగా విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒక విద్యార్థి ఇంటర్మీడియట్ పూర్తిచేసి సర్టిఫికేట్ చేతిలో పెట్టుకున్నట్టుగా సీఎం ఫోటోలు కనిపిస్తున్నాయని, ఇకపై ఎవరైనా “నువ్వు లీడర్ కాదురా” అని అడిగితే ఈ సర్టిఫికేట్…

Read Full News

కేసీఆర్‌ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? బీజేపీ ప్రశ్నలపై తిరిగి బీజేపీకే ప్రశ్నలు

ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావు ప్రశ్నించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. విచారణ పేరుతో కాలయాపన జరుగుతోందని, కాంగ్రెస్–బీఆర్ఎస్ పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ఆయన ఆరోపించారు. అయితే ఇదే ప్రశ్నను బీజేపీపై వేసుకుంటే పరిస్థితి ఎలా ఉందన్న ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో సీబీఐ విచారణకు అప్పగించాలంటూ డిమాండ్ చేసిన బీజేపీ, చివరకు…

Read Full News

వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు వ్యతిరేక సంకేతాలా? రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై అంతర్గత అసంతృప్తి బయటపడుతోందా?

ఇటీవల ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీల ఫీజుల దోపిడీపై వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆయన మాట్లాడిన తీరు చూస్తే, అది కేవలం విద్యా వ్యవస్థపై విమర్శగా కాకుండా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలపై పరోక్ష విమర్శగా కూడా కనిపిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. “నేను గనుక విద్యాశాఖ మంత్రిని అయితే ప్రైవేట్ కాలేజీల ఫీజులను కచ్చితంగా నియంత్రించేవాడిని, కాలేజీలను మూసివేసే వరకు వెళ్తాను” అని వెంకట్ రెడ్డి చెప్పడం, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి…

Read Full News

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు మరోసారి సిట్ నోటీసులు – నందినగర్ నివాసంలోనే విచారణకు ఆదేశం

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మరోసారి నోటీసులు జారీ చేసింది. రేపు మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్ నందినగర్‌లోని ఆయన అధికారిక నివాసంలోనే విచారణకు హాజరు కావాలని స్పష్టంగా ఆదేశించింది. ఇటీవల సిట్ నోటీసులకు స్పందించిన కేసీఆర్, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడిగా తనపై బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంటూ, మరొక అనుకూలమైన తేదీ ఇవ్వాలని లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో…

Read Full News