రాజాసాబ్ టికెట్ ధరల పెంపుపై హైకోర్టు ఆగ్రహం.. జీవో 120పై పునఃసమీక్ష కోరిన ధర్మాసనం

ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ సినిమా టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా టికెట్ ధరల పెంపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై శుక్రవారం విచారణ చేపట్టిన జస్టిస్ శ్రవణ్ రావు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. సినిమా టికెట్ ధరల పెంపుపై ఇకపై ఎలాంటి మెమోలు జారీ చేయొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజాసాబ్ సినిమా టికెట్ ధరల పెంపుకు సంబంధించిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది….

Read Full News

రెవెన్యూ పేరుతో యూనివర్సిటీలను రియల్ ఎస్టేట్ హబ్‌లుగా మార్చే ప్రయత్నం: మౌలానా ఆజాద్ యూనివర్సిటీ విద్యార్థుల ఆగ్రహం

తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ జనరేషన్ పేరుతో విద్యాసంస్థల భూములపై కన్నేయడం తక్షణమే ఆపాలని మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులు, పరిశోధకులు డిమాండ్ చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలంటే క్యాంపస్ బయట చేయాలని, యూనివర్సిటీ భూములను తాకొద్దని ప్రభుత్వానికి స్పష్టమైన హెచ్చరిక ఇచ్చారు. ఇది కేవలం రొటీన్ సర్వే అంటూ టూరిజం మంత్రి చేసిన వ్యాఖ్యలను విద్యార్థులు ఖండించారు. ఇదే తరహా ప్యాటర్న్‌ను గతంలో బిజినెస్ స్కూల్స్, సెంట్రల్ యూనివర్సిటీల విషయంలో కూడా…

Read Full News

యూనివర్సిటీ భూములపై కాంగ్రెస్ కన్ను.. రియల్ ఎస్టేట్ బ్రోకర్‌లా ప్రభుత్వ వ్యవహారం: కేటీఆర్ తీవ్ర విమర్శలు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహారం ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్‌ను తలపిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. విద్యాసంస్థలు, యూనివర్సిటీల అభివృద్ధి కంటే భూములు లాక్కోవడంపైనే ప్రభుత్వ దృష్టి ఉందని మండిపడ్డారు. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ భూములపై ప్రభుత్వం కన్నేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ రెండున్నరేళ్లలో మారిపోతుందని, ఆ తర్వాత కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి యూనివర్సిటీ విస్తరణకు కావాల్సిన నిధులు రాష్ట్ర ప్రభుత్వమే…

Read Full News

నిరుద్యోగుల అరెస్టులు కుట్ర కాదంటున్న కాంగ్రెస్.. ఉద్యోగాలపై చరణ్ కౌశిక్ క్లారిటీ

తెలంగాణలో నిరుద్యోగుల అంశం మరోసారి రాజకీయ వేడెక్కుతోంది. రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు రోడ్లెక్కి ఆందోళనలు చేపడుతుండగా, పోలీసులు అరెస్టులు చేస్తూ కట్టడి చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఓకే టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంగ్రెస్ నేత చరణ్ కౌశిక్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేయడం ప్రతి ఒక్కరి హక్కేనని, అయితే ప్రభుత్వ లేదా ప్రైవేట్ కార్యక్రమాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పరిస్థితి ఏర్పడితే అరెస్టులు జరగడం సహజ ప్రక్రియేనని…

Read Full News

రాజకీయాలకే పరిమితమవుతున్న పాలన.. మున్సిపల్ ఎన్నికలు, అంతర్జాతీయ పరిణామాలపై విమర్శలు

రాజకీయ నాయకులు ఎన్నికలపై పూర్తి దృష్టి పెట్టి పాలనను విస్మరిస్తున్నారని విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ వేగంగా కొనసాగుతుండగా, ఓటర్ జాబితా సవరణకు మరో రెండు రోజుల గడువు మాత్రమే మిగిలి ఉంది. వార్డు వారీగా తుది ఓటర్ జాబితాను ఈ నెల 12న ప్రకటించనుండగా, 16న పోలింగ్ కేంద్రాల వారీ జాబితా విడుదల కానుంది. ఎన్నికలన్నింటినీ ఒకేసారి పూర్తి చేయాలనే తొందరలో ప్రభుత్వం వ్యవహరిస్తోందని, దీనివల్ల పరిపాలనపై ప్రభావం పడుతోందని ప్రతిపక్షాలు…

Read Full News

ప్రశ్నించని ప్రజలే పాలకుల బలం..! తెలంగాణలో ప్రజాస్వామ్యం ఎటు పోతుంది?

హాయ్ హలో అందరికీ నమస్తే…ఇది రాజకీయ విమర్శ కాదు – ఇది ఒక సాధారణ పౌరుడి ప్రశ్న. ఈరోజు మనం చూస్తున్న మీడియా, రాజకీయాలు, పాలన అన్నీ కలిపి చూస్తే ఒకే విషయం స్పష్టంగా అర్థమవుతుంది – ప్రజా సమస్యలు వార్తలే కావడం లేదు. ఎవరు ఎవరిని తిట్టారు, ఎవరు ఎవరిపై కామెంట్ చేశారు అన్నదే హెడ్‌లైన్. కానీ రోడ్లు, నిరుద్యోగం, జీతాలు, రైతుల సమస్యలు మాత్రం ఎక్కడా కనిపించడంలేదు. నాలుగో స్థంభం ఎవరికి పనిచేస్తోంది? నిష్పక్షపాతంగా…

Read Full News

కవిత స్థానంలో అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీ పదవి.. కాంగ్రెస్‌లో కదలికలు

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన ఎమ్మెల్సీ పదవికి చేసిన రాజీనామాను శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తాజాగా ఆమోదించారు. దీంతో నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ స్థానం అధికారికంగా ఖాళీ అయ్యింది. 2021లో నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి కవిత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అయితే బీఆర్‌ఎస్‌ పార్టీతో విభేదాలు తలెత్తిన నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆమెను సస్పెండ్ చేశారు….

Read Full News

కొత్త ఉపాధి హామి బిల్లుతో గ్రామీణాభివృద్ధి దిశగా అడుగు.. కాంగ్రెస్ వ్యతిరేకతపై రాజకీయ వేడి

పార్లమెంట్ సమావేశాలు ఇటీవలే ముగియగా, త్వరలో బడ్జెట్ సెషన్ ప్రారంభం కానుంది. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులు, పథకాలు ఆమోదం పొందాయి. వాటిలో అత్యంత ముఖ్యమైనదిగా కొత్త ఉపాధి హామి బిల్ నిలుస్తోంది. ఈ బిల్ ద్వారా దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలిక లాభం చేకూరుతుందని పాలక వర్గాలు చెబుతున్నాయి. ఉపాధి హామి భావన కొత్తది కాదని, బ్రిటిష్ కాలం నుంచే వివిధ రూపాల్లో అమలులో ఉందని రాజకీయ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. కరువు కాలంలో…

Read Full News

రాహుల్ గాంధీ – రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు.. దిగజారుతున్న రాజకీయ భాషపై తీవ్ర విమర్శలు

తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత దిగజారుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని తెలంగాణపైకి “వదిలాడ”ని వ్యాఖ్యానించిన కేటీఆర్.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వరంగల్ అశోక్ నగర్ సభల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని…

Read Full News

తెలంగాణ అస్తిత్వం పేరుతో కవిత కొత్త పార్టీ.. ప్రజలు నమ్ముతారా? అనుమానాల మధ్య రాజకీయ ప్రయాణం

తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే పార్టీ కావాలంటూ.. సామాజిక తెలంగాణ సాధన కోసం కలిసి నడుద్దామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ జాగృతి విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నట్టు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఇప్పటికే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కవితకు ఆమోదం కూడా లభించినట్టు సమాచారం. బంజారాహిల్స్‌లో నిర్వహించిన తెలంగాణ జాగృతి సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యచరణ, ప్రజా సమస్యల గుర్తింపు, పరిష్కార దిశగా కమిటీల ఏర్పాటు…

Read Full News