కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ వివాదం.. “హైదరాబాద్‌ను మరో ఢిల్లీలా మార్చొద్దు” అంటూ యువత ఆందోళన

హైదరాబాద్ నగరంలో “సేవ్ కేబీఆర్” ఉద్యమం రోజురోజుకు మరింత ఉధృతమవుతోంది. కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఫ్లైఓవర్ నిర్మాణాల కోసం చెట్లను నరుకుతున్నారనే ఆరోపణలతో యువత, పర్యావరణ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు. ఈ క్రమంలో నిరసన తెలిపిన వారిపై కేసులు నమోదు చేయడం, అర్ధరాత్రి అరెస్టులు జరగడం మరింత చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కోర్టు 25 నుంచి 35 మీటర్ల పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని, వృక్షాలను నాశనం చేయరాదని స్టే ఆర్డర్ ఇవ్వడంతో ఉద్యమకారులు…

Read Full News

కేబీఆర్ పార్క్ చెట్ల నరికివేతపై సుప్రీం స్టే.. ఎకో సెన్సిటివ్ జోన్‌లో కీలక ఆదేశాలు

హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేత వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో చెట్ల తొలగింపుపై అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల 25 నుంచి 35 మీటర్ల పరిధిలో ఉన్న చెట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నరకరాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కాజల్ మహేశ్వరి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు ఈ మేరకు స్టే ఇచ్చింది. కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాలు…

Read Full News

పెట్రోల్ ధరలు పెరుగుతాయా..? యుద్ధ ప్రభావంతో సామాన్యుడిపై భారమా..?

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై మరోసారి చర్చ మొదలైంది. అంతర్జాతీయ యుద్ధ పరిస్థితులు, చమురు సరఫరా అంతరాయాలు, ప్రపంచ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరల మార్పులతో భారతదేశంపై ప్రభావం పడుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయిల్, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో పెట్రోల్ కొరత వస్తుందా..? ధరలు మరింత పెరుగుతాయా..? అనే భయం సామాన్యుల్లో కనిపిస్తోంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ “పెట్రోల్ వాడకం తగ్గించండి.. బంగారం కొనుగోలు ఒక సంవత్సరం తగ్గించండి” అంటూ చేసిన వ్యాఖ్యలు…

Read Full News

బక్రీద్ సందర్భంగా గోవుల అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి వినతి

హైదరాబాద్‌లో బక్రీద్ పండుగ సందర్భంగా గోవుల అక్రమ రవాణా జరుగుతోందని ఆరోపిస్తూ తెలంగాణ డీజీపీకి ఓ గౌరక్షణ సంస్థ ప్రతినిధులు లేఖ రాశారు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో గోవులను అక్రమంగా తరలిస్తున్నారని, ఈ అంశంపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. లేఖలో ముఖ్యంగా హైదరాబాద్‌లోని మెహందీపట్నం సహా పలు ప్రాంతాల్లో గోవుల రవాణా జరుగుతోందని ఆరోపించారు. గోవుల రక్షణ కోసం పనిచేస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారని, అదే సమయంలో అక్రమ రవాణాపై…

Read Full News

సనత్‌నగర్ టిమ్స్ ఆస్పత్రి కేసీఆర్ విజన్‌కు నిదర్శనం: బీఆర్ఎస్

సనత్‌నగర్ టిమ్స్ ఆస్పత్రి కేసీఆర్ విజన్‌కు నిదర్శనం: బీఆర్ఎస్ హైదరాబాద్ నగరంలో అత్యాధునిక వైద్య సేవలను పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్న మాజీ ముఖ్యమంత్రి K. Chandrashekar Rao విజన్‌కు సనత్‌నగర్ టిమ్స్ ఆస్పత్రి నిదర్శనమని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. 1200 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మితమైన ఈ ఆస్పత్రి తెలంగాణ వైద్య రంగంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం కొనసాగి ఉంటే ఈ ప్రాజెక్టు రెండేళ్ల క్రితమే పూర్తయ్యేదని, కానీ…

Read Full News

తెలంగాణలో శాంతిభద్రతలు ఆందోళనకరం”.. పోలీసింగ్‌పై ప్రభుత్వానికి హెచ్చరికలు

తెలంగాణలో ప్రస్తుతం శాంతిభద్రతల పరిస్థితిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఒకప్పుడు దేశంలోనే అత్యుత్తమ పోలీసింగ్ వ్యవస్థగా గుర్తింపు పొందిన తెలంగాణ పోలీస్ శాఖ ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న నేర ఘటనలు, మహిళల భద్రతపై వస్తున్న ప్రశ్నలు, రాజకీయ వేదింపుల ఆరోపణలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితులపై ఆందోళన పెంచుతున్నాయి. విమర్శకులు మాట్లాడుతూ.. “తెలంగాణ సాధించుకున్నది కేవలం భౌగోళిక రాష్ట్రం కోసం కాదు.. ప్రశాంతమైన సమాజం,…

Read Full News

హైదరాబాద్‌లో లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్”.. డీజీపీ భార్య హత్య ఘటనపై ప్రభుత్వంపై విమర్శలు

హైదరాబాద్‌లో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందా?.. డీజీపీ భార్య హత్య ఘటనపై రాజకీయ దుమారం హైదరాబాద్ నగరంలో జరిగిన మాజీ డీజీపీ కుటుంబానికి చెందిన మహిళ హత్య కేసు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. నగర నడిబొడ్డున ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి భార్య హత్యకు గురికావడం, నిందితులు ఇంకా పట్టుబడకపోవడం పై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని తీవ్రంగా టార్గెట్ చేస్తున్నాయి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా కుప్పకూలిందని ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ…..

Read Full News

గాంజా మహమ్మారిపై జనగర్జన.. యువతను కాపాడాలంటే సమాజం మొత్తం ముందుకు రావాలి

గాంజా అనే మత్తు పదార్థం యువత జీవితాలను నాశనం చేస్తోందని, దీనిపై ప్రభుత్వం మాత్రమే కాకుండా సమాజం మొత్తం పోరాడాలని సామాజిక కార్యకర్త నాగరాజు అన్నారు. గాంజా నియంత్రణపై నిర్వహించిన “జనగర్జన” కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గాంజా సాగు దశలోనే అరికట్టగలిగితే మార్కెట్ దాకా రాకుండా నియంత్రించవచ్చని చెప్పారు. గాంజా అనేది సాధారణంగా పొలాలు, తోటల్లో రహస్యంగా పండిస్తారని, కొన్ని ప్రాంతాల్లో మిరప పంటల మధ్య సాగు చేస్తూ వాసన బయటపడకుండా చూస్తారని ఆయన వివరించారు. పక్క…

Read Full News

రిటైర్డ్ ఉద్యోగుల ఆవేదన.. “మా డబ్బులే ఇవ్వట్లేదు, ప్రభుత్వం చిట్‌ఫండ్‌లా వ్యవహరిస్తోంది”

తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల సమస్య మరింత తీవ్రరూపం దాల్చుతోంది. రిటైర్మెంట్ అనంతరం నెలల తరబడి తమకు రావాల్సిన జీపీఎఫ్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, పీఆర్సీ అరియర్స్, గ్రాట్యుటీ తదితర బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ బకాయల సాధన కమిటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దేవదాసు మాట్లాడుతూ, “నేను ఏప్రిల్ 2025లో రిటైర్ అయ్యాను. రిటైర్ అయ్యి ఏడాది పూర్తవుతోంది. జూన్‌లోనే అన్ని బిల్లులు…

Read Full News

రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలపై ఆగ్రహం.. తెలంగాణలో ఆర్థిక అత్యవసర పరిస్థితి ఉందంటూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బకాయిల అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత ఎనిమిది నెలలుగా పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్, కమిటెడ్ ఎక్స్‌పెండిచర్, పెండింగ్ బిల్లులు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని పలువురు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. సాధారణంగా ఉద్యోగి రిటైర్ అయ్యే నెల రోజుల ముందే అన్ని బకాయిలు సిద్ధం చేసి, రిటైర్మెంట్ అనంతరం చెల్లించాల్సి ఉంటుందని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఇటీవల రిటైర్డ్ ఆర్ఎస్ఐ భిక్షపతి మరణం ఈ…

Read Full News