యాదగిరిగుట్ట దేవస్థానం పాలకమండలి ఏర్పాటు.. చైర్మన్‌గా ఎంఎస్‌ఎన్ ఫార్మా అధినేత ఎం. సత్యనారాయణ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పాలకమండలిని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 18 మంది సభ్యులతో కూడిన ఈ పాలకమండలికి ఎంఎస్‌ఎన్ ఫార్మా అధినేత ఎం. సత్యనారాయణ రెడ్డిని చైర్మన్‌గా నియమించింది. ఈ పాలకమండలి పదవీకాలం రెండేళ్లు ఉంటుంది. ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారం, పాలకమండలిలో మొత్తం 18 మంది సభ్యులు ఉంటారు. వీరిలో 11 మంది వివిధ రంగాలకు చెందిన సభ్యులు కాగా, మరో ఏడుగురు ప్రభుత్వ అధికారులు…

Read Full News

జగిత్యాల–కరీంనగర్ అభివృద్ధి బాధ్యత కాంగ్రెస్‌దే – రోడ్లు, స్కూళ్లు, ఆలయాలు, పర్యాటకం అన్నీ చేస్తాం: కాంగ్రెస్ నేత

ఎమ్మెల్యేలతోనూ, మంత్రులతోనూ పని చేయించుకోలేని నాయకత్వంతో అభివృద్ధి సాధ్యం కాదని, అందుకే జగిత్యాల మున్సిపాలిటీ అభివృద్ధి బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం భుజాన వేసుకుందని కాంగ్రెస్ నేత స్పష్టం చేశారు. జగిత్యాలలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, డాక్టర్ సంజయ్ సూచనల మేరకు పట్టణ ప్రధాన రహదారుల విస్తరణతో పాటు మౌలిక వసతుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. జగిత్యాల నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు వచ్చాయని, వాటిని తప్పకుండా అమలు చేస్తామని…

Read Full News