హారర్ కామెడీ చిత్రాలతో, ప్రేక్షకులను అలరించిన రాఘవ లారెన్స్, మళ్లీ తన హిట్ ఫ్రాంచైజీ ‘కాంచన’తో, ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. హీరోగానే కాదు, దర్శకుడిగా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లారెన్స్, ఇప్పుడు ‘కాంచన 4’ను అత్యంత, భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. ‘ముని’తో మొదలైన ఈ హారర్ సిరీస్ ఇప్పటివరకు, మూడు భాగాలుగా వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇప్పుడు నాల్గో భాగం సెట్స్ పైకి, వెళ్లి షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ నోరా ఫతేహీ కీలక పాత్రలో కనిపించనుంది. ఇది నోరా ఫతేహీకి తమిళ్ సినిమా రంగంలో డెబ్యూ అవుతోంది.
లారెన్స్ ఈ సారి ‘కాంచన 4’ను దాదాపు వంద కోట్ల, భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నాడు. మొదటి భాగాల కంటే విజువల్స్, టెక్నికల్ స్టాండర్డ్స్, స్కేల్ అన్నీ చాలా పెద్ద స్థాయిలో ఉండనున్నాయి. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సాటిలైట్, డిజిటల్ రైట్స్ అద్భుతమైన ధరలకు అమ్ముడయ్యాయి. సమాచారం ప్రకారం, డిజిటల్ రైట్స్ 60 కోట్ల రూపాయలు, సాటిలైట్ రైట్స్ 50 కోట్ల రూపాయలకి విక్రయమైనట్టు, చెన్నై సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ రైట్స్ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫార్మ్, సన్ నెక్ట్స్ సొంతం చేసుకున్నదని తెలుస్తోంది. అంటే సినిమా థియేటర్లకు రాకముందే, దాదాపు బడ్జెట్ మొత్తాన్ని నాన్ థియేట్రికల్ రైట్స్, రూపంలో మేకర్స్ తిరిగి సాధించారు అని చెప్పాలి. సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత, ఎనిమిది వారాలకి ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేలా, డీల్ క్లోజ్ చేసినట్టు తెలుస్తోంది. హిందీ వెర్షన్ను భారీ స్థాయిలో, రిలీజ్ చేయడానికి కూడా టీమ్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఇకపోతే, ‘కాంచన 4’ కథ వివరాలు, ప్రస్తుతం రహస్యంగా ఉంచారు. కానీ ఈ సినిమా మునుపటి భాగాల కంటే, ఇంకా ఎక్కువ ఎంటర్టైన్మెంట్, హారర్, కామెడీతో ఉండబోతుందనే అంచనాలు ఉన్నాయి. లారెన్స్ కూడా ఈ సినిమా ద్వారా వచ్చిన, రెమ్యునరేషన్తో తన మొదటి ఇంటిని స్కూల్గా, మార్చాలని భావిస్తున్నట్టు తెలిపారు. సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీలో భాగంగా వస్తున్న, ‘కాంచన 4’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. లారెన్స్ హారర్ మ్యాజిక్, మళ్లీ రిపీట్ అవుతుందో లేదో చూడాలి.

