తెలంగాణలో గత పదేళ్ల టీఆర్ఎస్ పాలన అనేక అవకాశాలను కోల్పోయిన కాలంగా మిగిలిపోయిందని కాంగ్రెస్ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. వేట న్యూస్ కాన్క్లేవ్ 2026లో పాల్గొన్న ఆయన, తెలంగాణకు అపారమైన సామర్థ్యం ఉన్నప్పటికీ గత ప్రభుత్వం ఆ అవకాశాలను సక్రమంగా వినియోగించుకోలేకపోయిందన్నారు.
తాను దాదాపు ఏడేళ్లుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నానని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు తెలంగాణ అసెంబ్లీకి వరుసగా ఆరు సార్లు ఎన్నికయ్యానని తెలిపారు. ఒకసారి లోక్సభకు కూడా ఎన్నికైనట్లు గుర్తుచేసుకున్నారు. రాజకీయాల్లోకి రాకముందు భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్గా పనిచేశానని, నేషనల్ డిఫెన్స్ అకాడమీ గ్రాడ్యుయేట్నని చెప్పారు. భారత రాష్ట్రపతితో కలిసి కూడా పనిచేసిన అనుభవం ఉందన్నారు.
2023 డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టే సమయానికి తెలంగాణ తీవ్ర ఆర్థిక భారంతో ఉందని చెప్పారు. భారీ అప్పులు, పాత ప్రభుత్వ నిర్ణయాల ప్రభావం కారణంగా పరిమితుల మధ్య పని చేయాల్సి వచ్చిందన్నారు. అయినప్పటికీ అనేక అంశాల్లో కోర్స్ కరెక్షన్ చేయగలిగామని, మరో రెండున్నరేళ్లలో ప్రజలకు మరింత మెరుగైన పరిపాలన అందిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.
టీఆర్ఎస్ పాలనలో ప్రజాస్వామ్య వ్యవస్థలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయని, మీడియా, డిజిటల్ మీడియాపై ఆంక్షలు ఉండేవని ఆరోపించారు. ప్రతిపక్షాన్ని రాజకీయంగా అణచివేయడానికి ప్రయత్నించారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మరింత ప్రజాస్వామ్య వాతావరణాన్ని కల్పించిందని, ప్రజలు ఇప్పుడు స్వేచ్ఛగా అభిప్రాయాలు వ్యక్తం చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు.
ప్రత్యేకంగా సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ ప్రభుత్వంపై భారీ ఆర్థిక భారం మోపిందని అన్నారు. భారీగా ఖర్చు చేసినా ప్రాజెక్ట్ ఆశించిన ప్రయోజనాలు అందించలేకపోయిందన్నారు. ప్రాజెక్ట్లో కీలకమైన బ్యారేజీలే సమస్యాత్మకంగా మారాయని పేర్కొన్నారు.
“ప్రాజెక్ట్కు గుండెకాయలాంటిది బ్యారేజ్. అక్కడి నుంచే నీటిని ఎత్తిపోతల చేస్తారు. కానీ ఆ భాగమే కుప్పకూలింది. కేవలం ఒక పిల్లర్ కాదు, మొత్తం ఫౌండేషన్పైనే అనుమానాలు ఉన్నాయి” అని తెలిపారు. దేశంలోని పలు శాస్త్రీయ సంస్థల నివేదికలు పరిశీలించిన తర్వాత కూడా ఏ సంస్థ బ్యారేజీల ఫౌండేషన్ను సర్టిఫై చేయడానికి ముందుకు రావడం లేదన్నారు.
కేంద్ర జల సంఘం, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, సీడబ్ల్యూఫ్ఆర్ఎస్తో పాటు అంతర్జాతీయ సంస్థలను కూడా సంప్రదించినట్లు వెల్లడించారు. అయినప్పటికీ మూడు బ్యారేజీల భద్రతపై ఇప్పటికీ స్పష్టమైన ధృవీకరణ రాలేదన్నారు.
కేంద్ర జల సంఘం, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, సీడబ్ల్యూఫ్ఆర్ఎస్తో పాటు అంతర్జాతీయ సంస్థలను కూడా సంప్రదించినట్లు వెల్లడించారు. అయినప్పటికీ మూడు బ్యారేజీల భద్రతపై ఇప్పటికీ స్పష్టమైన ధృవీకరణ రాలేదన్నారు.
“మూడేళ్లలోనే కుప్పకూలిపోయేలా ఒక ప్రాజెక్ట్ను రూపకల్పన చేసి నిర్మిస్తే, ప్రపంచంలోని మరే రాష్ట్రంలోనైనా లేదా దేశంలోనైనా తీవ్ర చర్యలు తీసుకునేవారు” అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల డబ్బుతో నిర్మించిన ప్రాజెక్ట్పై సమగ్ర సమీక్ష అవసరమని పేర్కొన్నారు.

