Headlines

శివ చౌహాన్ క్లారిటీ: మైక్రో ఫైనాన్స్ స్కాంలో మాకు ఎలాంటి సంబంధం లేదు

తెలుగు సినీ గాయని Mangli కుటుంబం మరోసారి వార్తల్లో నిలిచింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో, కొన్ని మీడియా వేదికల్లో మైక్రో ఫైనాన్స్ స్కాం ఆరోపణలతో మంగళి కుటుంబ సభ్యుల పేర్లు ప్రచారంలోకి రావడంతో ఆమె సోదరుడు శివ చౌహాన్ మీడియా ముందుకు వచ్చి పూర్తి వివరణ ఇచ్చారు. తమపై జరుగుతున్న ప్రచారం పూర్తిగా అసత్యమని, ఇది ఒక పెద్ద కుట్రలో భాగమని ఆయన ఆరోపించారు. శివ చౌహాన్ మాట్లాడుతూ గత 14 ఏళ్లుగా మంగళి…

Read More

స్త్రీనిధిలో భారీ అవకతవకలా..? విద్యాసాగర్ రెడ్డి రీన్యువల్, కొత్త నోటిఫికేషన్లపై తీవ్ర ఆరోపణలు

తెలంగాణలో స్త్రీనిధి సంస్థలో జరుగుతున్న నియామకాలు, నిధుల వినియోగం, రిటైర్డ్ అధికారుల కొనసాగింపుపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా స్త్రీనిధి ఎండి విద్యాసాగర్ రెడ్డి వ్యవహారంపై నిరుద్యోగ వర్గాలు, కొంతమంది ఉద్యమకారులు తీవ్ర స్థాయిలో ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా రాము అనే వ్యక్తి స్త్రీనిధిలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ పోరాటం చేస్తున్నట్లు వెల్లడించారు. విద్యాసాగర్ రెడ్డి రిటైర్మెంట్ వయస్సు దాటిన తర్వాత కూడా పలుమార్లు ఎక్స్‌టెన్షన్ ఇవ్వడం వెనుక రాజకీయ మరియు ఆర్థిక ప్రయోజనాలు…

Read More

బేగంపేటలో భూముల కబ్జా ఆరోపణలు.. సర్పంచ్‌లు, రాజకీయ నేతలపై మాజీ సర్పంచ్ కుటుంబం సంచలన ఆరోపణలు

సంగారెడ్డి జిల్లా కంది మండలం బేగంపేట గ్రామంలో గ్రామ కంఠం భూముల కబ్జాపై తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఓకే టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులు, గతంలో పేదలకు కేటాయించిన భూములను ఫోర్జరీ పద్ధతుల్లో ఆక్రమించారని ఆరోపించారు. తమ సంతకాలను నకిలీగా ఉపయోగించి హౌస్ నంబర్లు, రికార్డులు మార్చి కోట్ల రూపాయల విలువైన భూములను కొందరు అనుచరుల పేర్లపై నమోదు చేశారని తెలిపారు. మాజీ సర్పంచ్ బాబు గౌడ్ మాట్లాడుతూ 20 ఎకరాలకు…

Read More

ప్రధానిని కలిస్తే బీజేపీలో చేరినట్టేనా?”.. పార్టీ మార్పు ప్రచారంపై మల్లారెడ్డి ఫైర్

బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి పార్టీ మారబోతున్నారనే ప్రచారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన వేళ ఆయన తాజాగా స్పందించారు. ప్రధాని ని కలిస్తే బీజేపీలో చేరినట్టేనా అంటూ ప్రశ్నిస్తూ తాను బీఆర్ఎస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఇటీవల మల్లారెడ్డి కుటుంబం బీజేపీలో చేరబోతుందనే ప్రచారం జోరుగా సాగింది. అంతేకాదు బీజేపీలో చేరేందుకు ఐదు సీట్లు కోరినట్టుగా కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. ఈ ప్రచారాల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం…

Read More

సర్కార్ చేతుల్లోకి హైదరాబాద్ మెట్రో.. ఎల్ అండ్ టీ షేర్ల బదిలీ పూర్తి.. పెట్రోల్ కొరతపై కేంద్రం క్లారిటీ

హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటివరకు పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంలో కొనసాగిన హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 ప్రాజెక్ట్ ఇప్పుడు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. ఎల్ అండ్ టీ సంస్థకు చెందిన 100 శాతం షేర్లను తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తూ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. సచివాలయంలో జరిగిన ఈ ఒప్పందం ప్రకారం రూ.1461 కోట్ల విలువైన షేర్ల బదిలీ ప్రక్రియ పూర్తయింది. దీంతో మెట్రో నిర్వహణ, ప్రణాళికలు ఇకపై పూర్తిగా ప్రభుత్వ…

Read More

రికార్డ్ టెన్త్ ఫలితాలు.. 95% పాస్.. ములుగు టాప్.. 6 ప్రైవేట్ స్కూళ్లలో జీరో రిజల్ట్!

రాష్ట్ర 10వ తరగతి ఫలితాలు ఈసారి రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. మొత్తం ఉత్తీర్ణత శాతం 95.15%గా నమోదై విద్యార్థులు సత్తా చాటారు. గత ఏడాదితో పోలిస్తే పాస్ శాతం 2.37% పెరగడం విశేషం. ముఖ్యంగా ప్రభుత్వ గురుకుల పాఠశాలలు మరోసారి అద్భుత ఫలితాలు సాధించి అందరి దృష్టిని ఆకర్షించాయి. అయితే మరోవైపు లక్షల ఫీజులు వసూలు చేసే కొన్ని ప్రైవేట్ పాఠశాలల పరిస్థితి తీవ్ర విమర్శలకు దారితీసింది. రాష్ట్రంలో ఏకంగా ఆరు ప్రైవేట్ స్కూళ్లలో ఒక్క విద్యార్థి…

Read More

దక్షిణం నుంచి బెంగాల్ వరకు ఎగ్జిట్ పోల్స్ హీట్.. తమిళనాడులో డీఎంకే, అస్సాంలో బీజేపీ ఆధిక్యం!

దేశ రాజకీయాలను ప్రభావితం చేసే కీలక అసెంబ్లీ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ విడుదల కావడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. మే 4న అసలు ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఎవరి అంచనాలు నిజమవుతాయో అన్న ఆసక్తి నెలకొంది. పశ్చిమ బెంగాల్‌లో హోరాహోరీ పోరు పశ్చిమ బెంగాల్‌లో చివరి దశ…

Read More

హైదరాబాద్ ఆత్మ భవనాల్లో కాదు.. సంస్కృతిలో ఉంది” – కేటీఆర్

హైదరాబాద్ అభివృద్ధి, తెలంగాణ ప్రగతి, నగర సంస్కృతి గురించి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ను ఒక్క వ్యక్తి లేదా ఒక్క నాయకుడు నిర్మించలేదని, ఈ నగరం శతాబ్దాలుగా రూపుదిద్దుకున్న సంస్కృతి, వారసత్వం, ప్రజల జీవన శైలితో ప్రత్యేకత సాధించిందని పేర్కొన్నారు. “హైదరాబాద్‌కు ఘనతను ఒక వ్యక్తికి ఇవ్వలేం. ఈ నగరం ఒక్క రోజులో నిర్మించబడలేదు. రోమ్ ఒక్క రోజులో నిర్మించబడనట్టే హైదరాబాద్ కూడా శతాబ్దాలుగా అభివృద్ధి చెందింది” అని కేటీఆర్ అన్నారు….

Read More

ముష్కి చెరువు ఆక్రమణలపై హైడ్రా యాక్షన్.. 10 రోజుల్లో గుడిసెలు తొలగించాలని ఆదేశాలు

హైదరాబాద్ నర్సింగ్ పరిధిలోని ముష్కి చెరువు వద్ద హైడ్రా అధికారులు, ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. చెరువు పరిధిలో అక్రమంగా ఏర్పాటు చేసిన గుడిసెలు, డంపింగ్ కార్యకలాపాలు, బఫర్ జోన్ ఆక్రమణలపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువు అభివృద్ధి, నీటి నిల్వ సామర్థ్య పరిరక్షణ కోసం చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. అధికారుల వివరాల ప్రకారం ముష్కి చెరువు మొత్తం 52 ఎకరాల ఎఫ్టీఎల్ (FTL) పరిధిలో ఉంది. ఇందులో సుమారు…

Read More

నెల అయిందన్నా ఫోన్ చేస్తావా అంటున్నారు.. కనీస సౌకర్యాలు కూడా లేవు” అంటూ ప్రజల ఆవేదన

పరిస్థితి దారుణంగా ఉంది.. నెల అయిందన్నా ఫోన్ చేస్తావా అంటున్నారు. వస్తాం అంటారు కానీ ఎవరూ రావడం లేదు. కనీసం మంచిగా చెప్పినా పట్టించుకోవడం లేదు” అంటూ స్థానిక ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో కనీస సౌకర్యాలు కూడా అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రజలు చెబుతున్న వివరాల ప్రకారం, గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, రోడ్లు దెబ్బతిన్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. సమస్యలపై ఎన్నిసార్లు ఫోన్ చేసినా…

Read More