రిటైర్డ్ ఉద్యోగుల హక్కులు కాలరాసి అరెస్టులు: ఫండమెంటల్ రైట్స్ కాపాడడంలో గవర్నర్ విఫలం – తీవ్ర ఆరోపణలు
తెలంగాణలో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల ఫండమెంటల్ రైట్స్ తీవ్రంగా ఉల్లంఘించబడుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం విఫలమైన సందర్భాల్లో రాజ్యాంగాధికారిగా గవర్నర్ జోక్యం చేసుకోవాల్సి ఉండగా ఆయన కూడా బాధ్యతను విస్మరిస్తున్నారని ఉద్యోగ సంఘాల నేత తీవ్ర విమర్శలు చేశారు. సుమారు 20,500 మంది రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన గ్రాట్యుటీ, పెన్షన్, డీఏ, పీఆర్సీ బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం కమిటెడ్ ఎక్స్పెండిచర్ నిధులను డైవర్ట్ చేసిందని ఆరోపించారు. ఈ కారణంగా ఇప్పటివరకు 60 మందికి పైగా రిటైర్డ్ ఉద్యోగులు మృతి…

