జూబ్లీహిల్స్ ఉపఎన్నికల హీట్ — మూడు ప్రధాన పార్టీల హోరాహోరీ ప్రచారం ముగిసింది!

హైదరాబాద్ | జూబ్లీహిల్స్:జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు రాజకీయంగా కీలక మలుపు తిప్పబోతున్నాయి. బిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ — మూడు ప్రధాన పార్టీలూ ప్రచారాన్ని విస్తృత స్థాయిలో నిర్వహించాయి.ప్రత్యేకించి, కాంగ్రెస్ పాలనకు రెండున్నర సంవత్సరాల తర్వాత జరగుతున్న ఈ ఉపఎన్నిక ప్రజా తీర్పుకు కీలక సూచికగా భావిస్తున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు మరిన్ని ఉపఎన్నికలకు ఇది “శాంపిల్ టెస్ట్”గా మారనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారంరోజుల పాటు అన్ని ప్రభుత్వ పనులను పక్కనపెట్టి జూబ్లీహిల్స్‌లో పర్యటించడం, ప్రచారానికి…

Read Full News

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ జోరు — మైనంపల్లి హనుమంతరావు గారి ధైర్యవాక్యాలు

హైదరాబాద్, జూబ్లీహిల్స్:తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత హాట్‌సీట్‌గా మారిన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల వేడి చెలరేగింది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ — మూడు ప్రధాన పార్టీల మధ్య పోటీ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో, ఓకే టీవీ జర్నలిస్ట్ శ్రావ్య గారు, జూబ్లీహిల్స్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడాలో ప్రచారం నిర్వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారిని కలుసుకుని ఇంటర్వ్యూ చేశారు. హనుమంతరావు గారు మాట్లాడుతూ,

Read Full News

సనత్‌నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి కోట నీలిమగారి ప్రచారం — జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ జోరు

సనత్‌నగర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోట నీలిమగారు, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి మద్దతుగా ఆమె ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా కోట నీలిమగారు మాట్లాడుతూ, “మా కాంగ్రెస్ పార్టీ నిజమైన ప్రజల పార్టీ. బీఆర్ఎస్‌లా ఇది కుటుంబ పార్టీ కాదు. ప్రజల సమస్యలను అర్థం చేసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేసే పార్టీ కాంగ్రెస్ మాత్రమే. మేము జవాబుదారీ…

Read Full News

కార్పొరేటర్ సంగీతగారి ఆత్మీయ ప్రచారం — అమీర్‌పేట్ ఎల్లారెడ్డిగూడలో కాంగ్రెస్ హడావిడి

అమీర్‌పేట్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడ శ్రీనిలయ అపార్ట్‌మెంట్‌లో శనివారం రోజున కాంగ్రెస్ పార్టీ తరఫున కార్పొరేటర్ సంగీతగారు పాదయాత్ర నిర్వహించారు. ఈ అపార్ట్‌మెంట్‌లోకి ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకులు కూడా రాలేదని అక్కడి నివాసితులు పేర్కొన్నారు. అయితే, ప్రజలతో నేరుగా మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకునేందుకు సంగీతగారు ప్రత్యేకంగా అక్కడికి వెళ్లడం స్థానికులలో ఆనందాన్ని కలిగించింది. సంగీతగారు అక్కడి ప్రజలతో ఆత్మీయంగా మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న రోజువారీ ఇబ్బందులను తెలుసుకున్నారు. నీటి సరఫరా సమస్యలు, రోడ్లు దెబ్బతినడం, పార్కింగ్…

Read Full News

జూబ్లీ హిల్స్ బస్తీ పౌరుల ఆవేదన: వాగ్ధానాలు గాల్లోకెళ్ళి, కాలువ సమస్యలు–జీవితమే సవాలుగా మారింది

జూబ్లీ హిల్స్ పరిసర బస్తీలలో నివసించే ప్రజలు ప్రభుత్వం పై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్లుగా కాలువ సమస్య, రోడ్లలేమి, ప్రాథమిక వసతుల కొరత కారణంగా తమ జీవితం నరకంగా మారిందని వారు వాపోయారు. “మా కాలువ తొవ్వి వుంచేసి ఇలా నాశనం చేశారు. నీళ్ళు వెళ్లడానికి దారి లేదు. ఇళ్ళు కూల్చేశారు. పెద్దలు వస్తే ఒక్క గంటైనా మా దగ్గర కూర్చొని చూస్తారా?” అని ఒక మహిళ ప్రశ్నించారు. ప్రభుత్వాలు మారుతున్నా, పరిస్థితులు మాత్రం…

Read Full News

కవిత ‘జనం బాట’తో తెలంగాణ రాజకీయాల్లో కొత్త ఊపు: ప్రజల పక్షాన తెలంగాణ జాగృతి ధ్వనీ

తెలంగాణ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. తెలంగాణ జాగృతి నేత కల్వకుంట్ల కవిత చేపట్టిన ‘జనం బాట’ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రజల సమస్యల్ని నేరుగా తెలుసుకుని, సమాజంలోని వివిధ వర్గాలు — యువత, మహిళలు, కూలీలు, రైతులు — ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడమే ఈ యాత్ర లక్ష్యమని జాగృతి ప్రతినిధి శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. కవిత చేపట్టిన ఈ పథకం ప్రజానికం నుంచే రూపొందిందని, ఇది ఎన్నికల రాజకీయాల కోసం కాదని ఆయన స్పష్టం…

Read Full News

జూబ్లీహిల్స్ ప్రజాభిప్రాయం: ప్రభుత్వ మార్పు తర్వాత మార్పులు కనిపించలేదు – ఓటర్లలో అయోమయం

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రెహమత్‌నగర్, బోరబండ, మోతీనగర్ ప్రాంతాల్లో ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే క్రమంలో ఈ ఫీల్డ్ రిపోర్ట్. దాదాపు 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పాలన కొనసాగగా, రెండు సంవత్సరాల క్రితం ప్రజలు ప్రభుత్వ మార్పు కోసం కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చారు. అయితే కొత్త ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అయినా కూడా బస్తీల్లో ప్రత్యేకమైన మార్పులు కనిపించడం లేదని ప్రజలు స్పష్టం చేస్తున్నారు. ప్రజల అభిప్రాయం ప్రకారం మౌలిక సదుపాయాల విషయంలో పెద్ద మార్పులు లేవని,…

Read Full News

జూబ్లీహిల్స్‌లో భావోద్వేగ ప్రసంగం: పార్టీ అండగా ఉందని భరోసా

జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్ నాయకులతో జరిగిన సమావేశంలో స్థానిక నాయకురాలు భావోద్వేగంతో మాట్లాడారు. పార్టీలో గడించిన రోజులను గుర్తుచేసుకుంటూ, మాజీ జూబ్లీహిల్స్ అధ్యక్షుడు గోపన్న (గోపీనాథ్) సేవలను వివరించారు. మహిళలకు ఎల్లప్పుడూ అండగా నిలబడి, కష్టసమయంలో అర్థరాత్రైనా ప్రజల మధ్యకు వచ్చి సమస్యలను పరిష్కరించిన నాయకుడని ఆమె ప్రశంసించారు. “నన్ను మీ ఇంటి ఆడబిడ్డలా చూసి, ఇప్పటికీ అండగా నిలబడ్డందుకు ధన్యవాదాలు. ఇక ముందు కూడా నాకు మీ అండదండలు, ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను,” అంటూ ఆమె భావోద్వేగంగా…

Read Full News

జూబిలీహిల్స్‌లో బీజేపీ ప్రభావం లేదు: స్థానిక సమస్యలపై కిషన్ రెడ్డి పై విమర్శలు

జూబిలీ హిల్స్ ఉపఎన్నికల ప్రచారం వేడెక్కుతూ ఉండగా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చకు దారి తీశాయి. ప్రజలు ఒక ఫోన్ చేస్తే సమస్యలు పరిష్కరిస్తామని ఆయన చెప్పిన విషయాన్ని విమర్శిస్తూ, గతంలో మూడు సార్లు ఎంపీగా గెలిచినా జూబిలీహిల్స్ ప్రజలకు స్పష్టమైన అభివృద్ధి చూపించలేదని స్థానిక వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఎర్రగడ్డ డివిజన్‌లో పాదయాత్ర నిర్వహించిన కిషన్ రెడ్డి, బిఆర్ఎస్ ప్రభావం పూర్తిగా తగ్గిపోయిందని, కాంగ్రెస్‌ మీద ప్రజల నమ్మకం కోల్పోయిందని అన్నారు….

Read Full News

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: కేటీఆర్ ఆగ్రహం – నవీన్ యాదవ్ పై ఆరోపణలు, అభివృద్ధి చర్చే ముఖ్యమని ప్రతిపక్ష కౌంటర్

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడెక్కుతున్న నేపథ్యంలో, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ షేక్‌పేట్‌లో రోడ్‌షో నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను లక్ష్యంగా చేసుకుని, కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నవీన్ యాదవ్‌ను “ఆకు రౌడీ”గా వ్యవహరిస్తూ, ప్రజలు పొరపాటున గెలిపిస్తే అతను అందరినీ బెదిరించే అవకాశం ఉందని హెచ్చరించారు. కేటీఆర్ ఆరోపణల ప్రకారం, కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో రాష్ట్రానికి మేలు చేయలేకపోయిందని, ఇచ్చిన హామీలు అమలు కాలేదని చెప్పారు. పేదల ఇళ్లను కూల్చిన “బుల్డోజర్ ప్రభుత్వం”కు…

Read Full News