2025లో కాంగ్రెస్ పాలనపై తీవ్ర అసంతృప్తి.. పంచాయతీలు, పాలనా వైఫల్యాలు, ప్రజల ప్రశ్నలు

2025 సంవత్సరం తెలంగాణ రాజకీయాల్లో అన్ని పార్టీలకూ చేదు అనుభవాలనే మిగిల్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బిఆర్ఎస్, బిజెపీల తర్వాత కాంగ్రెస్ పార్టీ పాలన కూడా తీవ్ర విమర్శలకు లోనైంది. ముఖ్యంగా కాంగ్రెస్‌లో బీసీ వర్సెస్ రెడ్డి రాజకీయాలు తెరపైకి రావడం, అంతర్గత పంచాయతీలు రోడ్ల మీదకు రావడం పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీశాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ పంచాయతీలకు “కేర్ ఆఫ్ అడ్రస్” అన్నట్టుగా పరిస్థితి మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక మంత్రి మరో…

Read More

పెళ్లి పీటలెక్కనున్న ప్రియాంక గాంధీ కొడుకు రేహాన్ వాద్రా.. ఎంగేజ్‌మెంట్ వార్తలు వైరల్

కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ కుమారుడు రేహాన్ వాద్రా త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆయనకు ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. రేహాన్ తన స్నేహితురాలు అవీవా బేగ్‌తో నిశ్చితార్థం చేసుకున్నట్లు సమాచారం. ఇటీవల అవీవా బేగ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రేహాన్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. ఆ తర్వాత అదే ఫొటోను హైలెట్స్ సెక్షన్‌లో ఉంచడంతో వీరిద్దరి మధ్య ఎంగేజ్‌మెంట్ జరిగిందనే ప్రచారం మరింత ఊపందుకుంది. వివరాల్లోకి…

Read More

కొట్టలగూడ–లాసింగ్ తాండా గ్రామాల అభివృద్ధికి పూర్తి బాధ్యత నాది: వికారాబాద్ ఎమ్మెల్యే స్పష్టం

కొత్తగా ఎన్నికైన మహిళా సర్పంచులు, వార్డు సభ్యులకు అభినందనలు తెలుపుతూ వికారాబాద్ నియోజకవర్గంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లాసింగ్ తాండా, కొట్టలగూడ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. సభను ఉద్దేశించి మాట్లాడిన వికారాబాద్ ఎమ్మెల్యే, కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులందరికీ చప్పట్లతో అభినందనలు తెలియజేయాలని పిలుపునిచ్చారు. కొట్టలగూడ, లాసింగ్ తాండా గ్రామాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అందించే పూర్తి బాధ్యత తనదేనని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో…

Read More

కేసీఆర్ ప్రెస్ మీట్‌పై కాంగ్రెస్ ఫైర్.. 10 ఏళ్ల పాలనలో ఒక్క అభివృద్ధి చూపించండి: చెన్నగాని దయాకర్

ఇటీవల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు సంవత్సరాల విరామం తర్వాత నిర్వహించిన ప్రెస్ మీట్ తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో ఓకే టీవీకి ఇచ్చిన ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో టీపీసీసీ అధికార ప్రతినిధి, టీపీసీసీ జనరల్ సెక్రటరీ చెన్నగాని దయాకర్ కేసీఆర్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ప్రెస్ మీట్ పూర్తిగా అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలకే పరిమితమైందని, కానీ తన పదేళ్ల పాలనలో తెలంగాణకు చేసిన ఒక్క…

Read More

రోడ్డు మీద కాదు.. అసెంబ్లీలో చర్చిద్దాం: కేసీఆర్‌కు సీఎం రేవంత్‌ సవాల్‌

తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. రోడ్డు మీద విమర్శలు కాదు, అసెంబ్లీ వేదికగా చర్చకు రావాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. సికింద్రాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో జరిగిన తేనేటి విందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సీఎం, కృష్ణా గోదావరి జలాల అంశంపై సభలో చర్చకు సిద్ధమా అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. కృష్ణా…

Read More

కాంగ్రెస్‌లో అంతర్గత అగ్నిపరీక్ష: మంత్రుల అహంకారంపై సొంత పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటు, సీఎం రేవంత్ రెడ్డికి తలనొప్పి

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు మరోసారి బహిరంగ చర్చకు వచ్చాయి. ఇటీవల జరిగిన ప్రెస్ మీట్‌లో బయటపడ్డ అంశాలు పార్టీని తీవ్ర అసౌకర్యంలోకి నెట్టాయి. మంత్రులను కలవడానికి వెళ్తే అవహేళనగా మాట్లాడుతున్నారని, గంటల తరబడి వేచిచూసేలా చేస్తున్నారని, నియోజకవర్గ సమస్యలపై స్పందన లేదని సొంత పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది విపక్షాల విమర్శ కంటే కూడా ప్రమాదకరమైన పరిణామంగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. సాధారణంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మంత్రులపై అసహనం వ్యక్తం…

Read More

పంచాయతీ ఎన్నికల ఫలితాలే 2029 అసెంబ్లీ ఎన్నికలకు నాంది: సీఎం రేవంత్ రెడ్డి

2029లో కూడా ఇదే రీతిలో ఫలితాలు పునరావృతం అవుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ విజయాన్ని అందించిన ప్రజలకు, అలాగే కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12,702 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగగా, అందులో 7,527 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు, 808 పంచాయతీల్లో కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థులు విజయం సాధించారని సీఎం వెల్లడించారు. రెబెల్స్‌తో కలిపి మొత్తం 8,335 పంచాయతీల్లో కాంగ్రెస్…

Read More

పార్టీ ఫిరాయింపుల చట్టానికి గండి: స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పుతో కాంగ్రెస్ తెచ్చిన చట్టమే నిర్వీర్యం?

తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఈరోజు ఇచ్చిన తీర్పు రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ తీర్పుతో పార్టీ ఫిరాయింపుల చట్టం (రాజ్యాంగం – 10వ షెడ్యూల్) ఉద్దేశ్యమే దెబ్బతిన్నదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ చట్టాన్ని దేశంలో అమలు చేసినది అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ. రాజకీయాల్లో అక్రమ ఫిరాయింపులను అడ్డుకోవడం, ప్రజల ఓటుకు గౌరవం కల్పించడమే దీని లక్ష్యం. కానీ నేడు అదే చట్టాన్ని తీసుకొచ్చిన కాంగ్రెస్…

Read More

సత్యానికి–అసత్యానికి మధ్య పోరాటం: ఓట్ చోరీపై కాంగ్రెస్ మెగా ర్యాలీ, ఈసీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు

దేశంలో సత్యానికి–అసత్యానికి మధ్య పోరాటం నడుస్తోందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింస మార్గంలోనే పోరాడి నరేంద్ర మోదీ–ఆర్ఎస్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ డీఎన్‌ఏలోనే ఓట్ చోరీ ఉందని, కాంగ్రెస్ డీఎన్‌ఏలో మాత్రం సత్యం, అహింస ఉన్నాయని రాహుల్ గాంధీ అన్నారు. ఆదివారం న్యూఢిల్లీలోని రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన “ఓట్ చోరీ – గద్దీ చోడ్”…

Read More

త్వరలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ?: పొన్నం, కొండా సురేఖ తొలగింపు వార్తలపై మహేష్ గౌడ్ స్పష్టీకరణ

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందనే ప్రచారం నేపథ్యంలో, మంత్రి పొన్నం ప్రభాకర్, కొండా సురేఖలను మంత్రివర్గం నుంచి తొలగిస్తారనే వార్తలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇద్దరూ బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రులని, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నేతలని ఆయన కితాబు ఇచ్చారు. అయితే శాఖల మార్పులు లేదా మంత్రివర్గంలో ఇతర మార్పులు ఉంటాయా అనే అంశంపై…

Read More