ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌పై సీఐడీ దూకుడు.. 11 మంది అరెస్ట్, 108 యాప్స్ బ్లాక్!

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌పై సీఐడీ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి దేశవ్యాప్తంగా భారీ చర్యలు ప్రారంభించింది. ఢిల్లీ, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల్లో మ్యూల్ అకౌంట్ల ఆపరేటర్లను లక్ష్యంగా చేసుకుని రెండు వారాల పాటు నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్‌లో కీలక పురోగతి సాధించింది. సీఐడీ వెల్లడించిన వివరాల ప్రకారం, డఫాబెట్ వంటి బెట్టింగ్ యాప్స్‌కు సంబంధించి దేశవ్యాప్తంగా 225 ఫిర్యాదులు అందగా, ఇప్పటికే 73 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల దర్యాప్తులో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన సైబర్ నేరగాడితో…

Read More

హైదరాబాద్‌లో నకిలీ కన్సల్టెన్సీల మోసాలు.. నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆట

విదేశీ ఉద్యోగాలు, స్టడీ వీసాలు, వర్క్ పర్మిట్లు, 100 శాతం జాబ్ గ్యారెంటీ అంటూ హైదరాబాద్‌లో నకిలీ కన్సల్టెన్సీలు నిరుద్యోగులను భారీగా మోసం చేస్తున్నాయనే ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. నగరంలో వేల సంఖ్యలో నడుస్తున్న కన్సల్టెన్సీల్లో చాలా వరకు సరైన అనుమతులు లేకుండానే కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. నిరుద్యోగ యువత ఆవేదన, కుటుంబ ఒత్తిడిని ఆసరాగా చేసుకొని లక్షల రూపాయలు దోచుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారిక అంచనాల ప్రకారం హైదరాబాద్‌లో సుమారు 2600కు పైగా ఓవర్సీస్,…

Read More

ఫిట్ కాప్ నుంచి సైబర్ వార్ వరకు.. తెలంగాణ పోలీసింగ్‌పై డీజీపీ సీవీ ఆనంద్ విజన్

తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ C. V. Anand రాష్ట్ర భద్రత, పోలీసింగ్, ఫిట్‌నెస్, సైబర్ నేరాలు, డ్రగ్స్ సమస్యలపై తన విజన్‌ను వెల్లడించారు. వెయిట్ న్యూస్ కాన్క్లేవ్ 2026 వేదికగా మాట్లాడిన ఆయన, భవిష్యత్ తెలంగాణ పోలీసింగ్‌కు సంబంధించిన బ్లూప్రింట్‌ను వివరించారు. కార్యక్రమంలో మాట్లాడిన డీజీపీ సీవీ ఆనంద్, పోలీస్ శాఖలో ఫిట్‌నెస్ అత్యంత కీలకమని పేర్కొన్నారు. “స్ట్రెస్‌ను తట్టుకోవాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే ఫిట్‌నెస్ చాలా ముఖ్యం. నేను గత 33 ఏళ్లుగా నా…

Read More

ఆర్టీఓ చలాన్ పేరుతో కొత్త సైబర్ మోసం.. ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేస్తే ఖాతాలు ఖాళీ!

వాహనదారులను లక్ష్యంగా చేసుకుని కొత్త తరహా సైబర్ మోసాలు పెరుగుతున్నాయని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. “ఆర్టీఓ చలాన్ APK” పేరుతో జరుగుతున్న ఈ మోసంలో వాహనదారులకు WhatsApp, SMS, MMS ద్వారా సందేశాలు పంపుతూ “మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి.. వెంటనే జరిమానా చెల్లించండి” అంటూ భయపెడుతున్నారు. ఈ మెసేజ్‌లలో ఒక లింక్ ఇచ్చి, దాని ద్వారా APK ఫైల్ డౌన్లోడ్ చేయాలని కోరుతున్నారు. అయితే ఆ ఫైల్‌ను మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసిన వెంటనే…

Read More

ఏఐతో బ్యాంక్ లోన్ మోసం.. డీప్‌ఫేక్ వీడియోలతో ఆధార్ బయోమెట్రిక్ బైపాస్ చేసిన సైబర్ నేరగాళ్లు

సైబర్ నేరాలు రోజురోజుకీ కొత్త రూపాలు దాలుస్తున్నాయి. ఇప్పటివరకు ఫోన్ కాల్స్, డిజిటల్ అరెస్టులు, ఫేక్ లింకులు, ఓటీపీ మోసాల ద్వారా ప్రజలను లక్ష్యంగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు.. ఇప్పుడు ఏఐ టెక్నాలజీని ఉపయోగించి నేరుగా బ్యాంకులనే బురిడీ కొట్టించే స్థాయికి వెళ్లిపోయారు. తాజాగా గుజరాత్‌లో వెలుగుచూసిన ఒక ఘటన పోలీసులను సైతం షాక్‌కు గురి చేసింది. అహ్మదాబాద్ కు చెందిన ఓ ఇంపోర్ట్-ఎక్స్‌పోర్ట్ వ్యాపారిని లక్ష్యంగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు అతని వ్యక్తిగత వివరాలను పూర్తిగా…

Read More

సురేందర్ రెడ్డి పై తప్పుడు ప్రచారం.. వాయిస్ రికార్డులతో మోసం చేశారని స్నేహితుల ఆరోపణ

సురేందర్ రెడ్డి పై జరుగుతున్న ఆరోపణలు పూర్తిగా అబద్ధమని, వాటిని కావాలనే సృష్టించి ప్రచారం చేస్తున్నారని ఆయనకు 30 సంవత్సరాలుగా పరిచయం ఉన్న స్నేహితులు తెలిపారు. విజయ రెడ్డి కేసులో భాగంగా తమను తప్పుదారి పట్టించి, వాయిస్ రికార్డులను దుర్వినియోగం చేశారని వారు ఆరోపించారు. స్నేహితుడు జంగయ్య మాట్లాడుతూ, “మేము 30 సంవత్సరాలుగా సురేందర్ రెడ్డితో కలిసి ఉన్నాం. ఆయన అలాంటి వ్యక్తి కాదు. కొంతమంది కావాలనే మమ్మల్ని ఫోన్ ద్వారా సంప్రదించి, సాధారణంగా మాట్లాడించిన విషయాలను…

Read More

₹50,000 లోపు సైబర్ మోసాలకు కోర్ట్ ఆర్డర్ లేకుండానే పరిహారం.. బ్యాంకులపై పూర్తి బాధ్యత

డిజిటల్ లావాదేవులు పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ మోసాలు దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద సవాలుగా మారుతున్నాయి. ఫిషింగ్ లింకులు, నకిలీ కాల్ సెంటర్లు, కేవైసీ అప్డేట్ పేరుతో మోసాలు, నకిలీ ఇన్వెస్ట్‌మెంట్ యాప్‌లు వంటి పద్ధతులతో సైబర్ నేరగాళ్లు కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. ముఖ్యంగా యూపీఐ, ఆన్‌లైన్ బ్యాంకింగ్ వేదికలే ప్రధాన లక్ష్యంగా మారాయి. రోజురోజుకు పెరుగుతున్న ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బాధితులకు త్వరగా పరిహారం అందించేందుకు బ్యాంకుల బాధ్యతలను…

Read More

ముద్రా లోన్ పేరుతో సైబర్ మోసం… వరంగల్‌కు చెందిన ఐదుగురు యువకుల అరెస్ట్

ముద్రా లోన్ ఇప్పిస్తామని చెప్పి మహిళను మోసం చేసిన కేసులో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఐదుగురు యువకులను హైదరాబాద్ సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. జాబ్ సెర్చింగ్‌లో భాగంగా సైబర్ నేరస్తులతో పరిచయం ఏర్పడి, చివరికి వారే సైబర్ మోసాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ గత ఏడాది నవంబర్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో లోన్స్‌కు సంబంధించిన ప్రకటనను చూసింది. మరుసటి రోజు గుర్తు తెలియని…

Read More

అక్రమ సిమ్ విక్రయాల ముఠా బట్టబయలు: నాంపల్లిలో ఇద్దరి అరెస్ట్, 184 యాక్టివేటెడ్ సిమ్‌లు స్వాధీనం

హైదరాబాద్ నాంపల్లి పరిధిలో అక్రమంగా యాక్టివేటెడ్ సిమ్ కార్డులను విక్రయిస్తున్న ముఠాను సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి మొత్తం 184 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఎయిర్‌టెల్‌కు చెందిన 150 సిమ్‌లు, జియోకు చెందిన 34 సిమ్‌లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సీసీఎస్ డీసీపీ చైతన్య కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఏపీ రాష్ట్రం కడప జిల్లాకు చెందిన నేనావత్ దినేష్ కుమార్ నాయక్…

Read More